మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి పోలింగ్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న ఎన్నిక నిర్వహించారని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారి చేయగా, 10న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. దేశంలోని 54 అసెంబ్లీ, ఒక ఎంపీస్థానంతో పాటే దుబ్బాక ఎన్నిక జరగనుంది. ఇదివరకు అక్కడ ఉన్న సోమిరెడ్డి రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. కాగా ఇప్పటికే ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి టీఆర్స్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి లింగారెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్