భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. వరద కారణంగా ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా ఆదివారం పాతబస్తీలోని ఓ ఇల్లు వర్షం ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇంట్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే నగరంలో చాలా చోట్ల పాత ఇళ్లు ఉన్నాయి. దీంతో అక్కడ నివసించేవారు భయాందోళనతో ఉన్నారు.