సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ ప్రతినిధులతో సైబరాబాద్ సీసీ సజ్జనార్ గురువారం సమావేశమయ్యారు. గూగుల్ యాడ్స్ సర్వాసెస్, గూగుల్ వ్యూఫామ్ల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారని వారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ ద్వారా వినియోగదారులను చైతన్యం చేయాలని తెలిపారు. అలాగే యూ ట్యూబ్లో అభ్యంతరకర పోస్టులను పెట్టేవారిపై ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని ఆయన కోరారు.