తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 622 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,73,341 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,472గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,63,7441 మంది కోలుకోగా ప్రస్తుతం 8,125యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 6,116 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 57,308 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.