తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. ఈనెల 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ప్రత్యూష పెళ్లి జరగనుంచి వీరి నిశ్చితాతర్థం గత అక్టోబర్ లోని విద్యానగర్ లో జరిగింది. వరుడు చరణ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట ప్రత్యూష తన పిన తల్లి చేతిలో వేధింపులకు గురైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమెను కేసీఆర్ చూసి చలించిపోయారు. దీంతో ఆమెను దత్తపుత్రికగా ప్రకటించారు. అప్పటి నుంచి ఐఎఎస్ అధికారి రఘునందన్ రావు పర్యవేక్షణలో ప్రత్యూష ఆరోగ్యం మెరుగైంది. ప్రస్తుతం ఆమె నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది.