తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఫలితం మొత్తానికి బీజేపిని వరించింది. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్లలో బీజేపి మెజారిటీ సాధించగా, 1 0 రౌండ్లలో టీఆర్ఎస్ కు, ఒక రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.