తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటించి బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ చిహ్మమని ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. పంటలు బాగా పండి గొప్పగా వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరియాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.