
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పడ్డాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,55,663 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,397గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,37,172 మంది కోలుకోగా ప్రస్తుతం 17,094 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,466 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 169 కేసులు నమోదయ్యాయి. కాగా గత రోజులుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 48,12,167 కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.