
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,58,828 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,410గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,43,686 మంది కోలుకోగా ప్రస్తుతం 13,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 11,313ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 16,02 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.