
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కేసులు స్వల్పంగా తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,79,644 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,505గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,70,967 మంది కోలుకోగా ప్రస్తుతం 7,172యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 5,063 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 48,652 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.