
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,45,862 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,362గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,25,664 మంది కోలుకోగా ప్రస్తుతం 18,656 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 15,864 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 285 కేసులు నమోదయ్యాయి. కాగా గత రోజులుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.