
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,531 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,37,187 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,330గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,17,401 మంది కోలుకోగా ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 15,425 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా కేసులు తగ్గుతున్నాయనుకునే సమయంలో మళ్లీ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.