Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీISRO :  అంతరిక్షంలో అద్భుతం.. పురుడుపోసుకున్న జీవం...

ISRO :  అంతరిక్షంలో అద్భుతం.. పురుడుపోసుకున్న జీవం…

ISRO :  భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవ సృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సీ60 ఆర్బిటాల్‌ ఎక్స్‌ పెరిమెంట్‌ మాడ్యూల్‌(పోయెమ్‌–4) ద్వారా 2025, డిసెంబర్‌ 30న అందరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం నాలుగు రోజుల్లో మొలకెత్తాయి. కాంపాక్ట్‌ రీసెర్చ్‌ మాడ్యూల్‌ ఫర్‌ ఆర్బిటాల్‌ ప్లాంట్‌ స్టడీస్‌(సీఆర్‌పీఎస్‌)టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగం ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనం చేయడానికి ఉద్దేవించిన ఆటోమేటెడ్‌ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్‌ పేలోడ్‌ను విక్రం సారాబాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతోకూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం వెలుతురు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ..
విత్తనాల్లో మార్పులను అత్యంత హై రెజల్యూషన్‌తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీవోటూ సాంద్రత, ఆర్ధ్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి అంటూ ఇస్ట్రో హర్షం వ్యక్తం చేసింది. త్వరలో వాటికి ఆకులు కూడావస్తాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో ఇదో కీలక మైలురాయిగా నిలుస్తుంది అని ఎక్స్‌లో పోస్టు చేసింది.

స్పేడెక్స్‌ నుంచి భూమి ఫొటోలు..
స్పేడెక్స్‌లోని జంట ఉపగ్రహాల్లో ఒకటి అయిన ఛేజర్‌ భూమిని తొలిసారి ఫొటోలతోపాటు వీడియో తీసింది. దానిని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్‌ 470 కి.మీ ఎత్తున దిగువ కక్ష్యలో పరిబ్రమిస్తూ తీసిన వీడియోలో భూమి అత్యంత అందంగా కనిపిస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్‌ సామర్థ్యంతోపాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దానిని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ప్రకటించింది. త్వరలో కీలక డాకింగ్‌(ఉపగ్రహాల అనుసంధానం) పరీక్షకు చేజర్‌ , టార్గెట్‌ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయని తెలిపింది. వీలైతే దానిని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్‌ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ సరగ్వంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular