spot_img
Homeక్రీడలుWorld Cup 2023: ఆ విషయం లో ఐపీఎల్ ని బీట్ చేయలేకపోయిన వరల్డ్ కప్...

World Cup 2023: ఆ విషయం లో ఐపీఎల్ ని బీట్ చేయలేకపోయిన వరల్డ్ కప్ మ్యాచ్ లు…

World Cup 2023: క్రికెట్ అంటే ఏ దేశంలో ఎలా ఉన్నా కూడా ఇండియాలో మాత్రం దాని ఒక్క మతం లాగా స్వీకరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అభిమాని క్రికెట్ మ్యాచ్ కోసం పడి చచ్చిపోతూ ఉంటారు. ఇక దానికి ఉదాహరణగా మొన్న వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయిన వెంటనే చాలామంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే మరి కొంతమంది అయితే హార్ట్ ఎటాక్ తో ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇలా ఇండియాలో క్రికెట్ అంటే అంత పిచ్చి…

ఇక ఇలాంటి క్రమంలో ఇండియాలో డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటారు అందుకే ఎక్కువ గా స్టేడియం లోకి వెళ్లి మ్యాచ్ చూస్తూ హంగామా చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మొన్న ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 92,453 మంది ఫైనల్ మ్యాచ్ ని చూడడానికి వచ్చి ఆ మ్యాచ్ ని చూస్తూ ఇండియన్ టీమ్ ను విపరీతంగా ఎంకరేజ్ చేశారు. అయితే అభిమానుల అందరు కోలాహలం చేస్తూ ఉండగా, మన ప్లేయర్లు మాత్రం అంత పెద్ద పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు చేసిన కొలాహలం మ్యాచ్ మధ్యలోకి వచ్చేసరికి తగ్గిపోయింది. ఇక చివరలో అయితే గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది…ఇక ఈ నరేంద్ర మోడీ స్టేడియం 1,30,000 మంది కెపాసిటీ ఉన్న స్టేడియం కానీ ఇక్కడ 92,453 మంది మాత్రమే హాజరవడం విశేషం…

ఎందుకంటే చాలా మంది మాకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి టికెట్లు దొరకట్లేదు అనే ఒక భావాన్ని వ్యక్తం చేశారు కానీ ఇక్కడ చూస్తే 92,000 మంది మాత్రమే హాజరవ్వడాన్ని చూసిన చాలా మంది మరి మిగితా టికెట్లను ఎందుకు అమ్మలేదు అని అందరూ తప్పు పడుతున్నారు…అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టీమ్ ల మధ్య ఒక భీకరమైన పోరాటం జరిగింది. దాని కోసం1,01,566 మంది జనం మ్యాచ్ చూడటానికి హాజరయ్యారు.

ఐపీఎల్ తో పోల్చుకుంటే వరల్డ్ కప్ కి చాలా తక్కువ మంది జనం హాజరయ్యారు అనే చెప్పాలి. కొంతమంది కి టికెట్లు దొరకట్లేదు అని బాధపడుతుంటే మరింత కొంత మంది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఇంత తక్కువ మంది హాజరయ్యారు అని వాపోతున్నారు… ఏదేమైనా ప్రతి క్రికెట్ అభిమాని కనీసం వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి అయిన మ్యాచ్ ని స్టేడియంలో చూడాలి ఆ ఎంజాయ్ మెంట్ ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు…

ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన జనాన్ని చూస్తే 50 ఓవర్ల మ్యాచ్ చూసే కంటే 20 ఓవర్ల మ్యాచ్ అయిన ఐపీఎల్ కే జనాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది అంటూ పలువురు క్రికెట్ మేధావులు కూడా చెప్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper