spot_img
Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni: ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై.. సీఎస్కే ట్విట్ వెనుక ఉద్దేశం అదేనా?

MS Dhoni: ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై.. సీఎస్కే ట్విట్ వెనుక ఉద్దేశం అదేనా?

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా మలిచి.. అత్యంత విజయవంతమైన జట్టుగా ఆవిర్భవించేలా చేసిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. ప్రస్తుతం ధోని నాలుగు పదుల వయసులో ఉన్నాడు. అయితే ఈ టీమిండియా మాజీ దిగ్గజం ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేసింది. దీంతో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడుతోంది. చెపాక్ వేదికగా రాజస్థాన్ జట్టుతో పోటీపడుతోంది. టాస్ రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. అయితే చెన్నై జట్టు మైదానంలోకి దిగకముందు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో చేసిన ఒక ట్వీట్ చర్చకు దారి తీస్తోంది. “రాజస్థాన్ జట్టుతో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మొత్తం ఎదురు చూడాలి. సూపర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని” విన్నవించింది. అయితే ఈ ట్వీట్ రకరకాల ఊహాగానాలకు కూతమిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ట్వీట్ చేయడంతో.. ఆ జట్టులో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ గుడ్ బై చెబుతాడా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే తాను చెపాక్ మైదానం వేదికగా చివరి మ్యాచ్ ఆడతానని ఇప్పటికే ధోని చెప్పాడు. దీంతో సీఎస్కే జట్టు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడు కాబట్టే ఈ ట్వీట్ చేసిందని తెలుస్తోంది.

ఈ మ్యాచ్ కు ధోని భార్య సాక్షి సింగ్, సురేష్ రైనా, ప్రముఖులు హాజరయ్యారు. అయితే అభిమానులు చాలామంది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, స్థానిక అభిమానులకు ప్రత్యేక బహుమతులు అందించేందుకు సీఎస్కే ఈ ట్వీట్ చేసిందని తమిళ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఐపీఎల్ సీజన్లో సొంతం మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత.. చెన్నై ఆటగాళ్లు గ్రౌండ్ చుట్టూ తిరుగుతారు. అభిమానులకు అభివాదం చేస్తారు. తమకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ కు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అంతేకాదు టెన్నిస్ బాల్స్, బ్యాట్లు, టీ షర్టులు అందజేస్తారు. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించేందుకు సీఎస్కే ఈ ట్వీట్ చేసిందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper