Homeక్రీడలుక్రికెట్‌India Vs Ireland: ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద...

India Vs Ireland: ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం

India Vs Ireland: ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా ప్లేయర్ల మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. దాదాపు 1000 కి పైగా రోజులు తన రికార్డును అత్యంత పదిలంగా ఉంచుకుంది. పెద్ద పెద్ద జట్లను సైతం ఓడించి.. వారి సొంత గడ్డల మీద గెలిచి ట్రోఫీలు అందుకుంది. 2024లో.. 2026లో టి20 వరల్డ్ కప్ లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా.

భయంకరమైన బ్యాటింగ్.. అంతకుమించిన బౌలింగ్ కలిగి ఉన్న టీం ఇండియా అనామకమైన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మాజీ ప్లేయర్లు కూడా ఆటగాళ్ల ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లలో.. టీమిండియా తొలి మ్యాచ్లో 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనది. రెండో మ్యాచ్ లో 155 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. పలువురు బ్యాటర్లు చెప్పుకోదగిన స్థాయిలో పరుగులు తీయలేదు.

టీమిండియా వైఫల్యం పట్ల మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్లు ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతారని.. బౌలింగ్ మైదానాల మీద ఆడలేరని ఇప్పటికే సునీల్ గవాస్కర్ దుమ్మెత్తి పోసాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడేందుకు అలవాటు పడిన ప్లేయర్లు.. విదేశీ మైదానాల మీద తడబడుతున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టీం మీడియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇటీవల ఓటమి పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు.. అసలు ఇలాంటి ఆటగాళ్లు ట్రోఫీ ఎలా గెలుస్తారని.. ఇలాంటి ప్లేయర్లు విదేశీ మైదానాల మీద ఎలా ఆడతారని ప్రశ్నించారు. కనీసం మైదానాల రూపకల్పన విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించాడు. ఐపీఎల్ నుంచి ప్లేయర్లు నేరుగా రావడం కూడా ఈ ఓటమికి ఒక కారణమని అతడు అభిప్రాయపడ్డాడు..

అశ్విన్ చేసిన వ్యాఖ్యలు రకరకాల చర్చలు కారణమయ్యాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక విధానం పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానం పై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తాయ్. ఐపీఎల్ ఫామ్ మీద ఆధారపడకుండా.. విభిన్న పరిస్థితుల్లో ఆటగాళ్లు చేసిన ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు.. ఐర్లాండ్ జట్టు బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ ను భారత జట్టు కోచ్ అయ్యర్ అభినందించిన తీరును కూడా ఇక్కడ అశ్విన్ ప్రస్తావించాడు. సింగిల్స్ మాత్రమే తీసి టీమిండియా బ్యాటర్లు పరువు తీసుకున్నారని.. కీలకమైన సమయాలలో సరైన ఇన్నింగ్స్ ఆడలేక చేతులెత్తేసారని.. ఈ ఓటమిని గుణపాఠం లాగా మార్చుకోవాలని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
image.png

Displaying

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular