Sri Lanka Cricket: వరల్డ్ కప్ లో ప్రతి టీం కూడా తమదైన రీతిలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ మ్యాచు ఆడుతూ ఉంటే శ్రీలంక టీమ్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఆడుతూ టోర్నీ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లో ఆడితే అందులో రెండు విజయలను సొంతం చేసుకుని నాలుగు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక రీసెంట్ గా శ్రీలంక గవర్నమెంట్ శ్రీలంక బోర్డును రద్దు చేయగా,ప్రస్తుతం ఐసీసీ శ్రీలంక టీంకు పెద్ద షాక్ ఇచ్చింది ఏంటి అంటే శ్రీలంక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఐసీసీ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది… శ్రీలంక తను ఎలా వ్యవహరించాలి అలా వ్యవహరించకుండా తన బాధ్యతలను ఉల్లంఘించింది అని అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ..అందుకే ఈ మేరకే ఐసీసీ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు గా తెలుస్తుంది…ఇక సస్పెండ్ కి సంభందించిన నిర్ణయాలను కూడా వెంటనే అమలులోకి తీసుకు వస్తుందని స్పష్టం చేసింది…
ఇక నెక్స్ట్ ఇయర్ అంటే 2024 జనవరి- ఫిబ్రవరి నెలలో ఐసిసి నిర్వహించే అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమం లో ఇప్పుడు ప్రకటించిన ప్రస్తుత పరిణామంతో అండర్ -19 ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించాలి అనే విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పైననే ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది. ఇక ఇలాంటి టైం లో శ్రీలంక బోర్డ్ కి చాలా భారీ ఎదురు దెబ్బలు తగిలాయనే చెప్పాలి…ఇక శ్రీలంక బోర్డ్ ఐసిసి నిర్వహించే మ్యాచ్ లకి అందుబాటు లో లేనట్టే అనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది..నిజానికి ప్రస్తుతం శ్రీలంక బోర్డ్ కూడా చాలా కన్ ఫ్యూజన్ లో ఉందనే చెప్పాలి…
ఇక దీనికంతటికీ కారణం శ్రీలంక వరల్డ్ కప్ లో సరైన రీతిలో ఆడకపోవడం అని తెలుస్తుంది.ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆడకపోవడం తో ఈ దేశ ప్రభుత్వం శ్రీలంక బోర్డ్ ని రద్దు చేసింది. దాంతో ఐసిసి అనుమతి లేకుండా ఒక దేశ ప్రభుత్వం అలా ఇన్వాల్వ్ అయి ఆ దేశ క్రికెట్ బోర్డ్ ని రద్దు చేయడం కరెక్ట్ కాదని అందుకే అలాంటి క్రమ శిక్షణ లేని బోర్డ్ ఐసిసి లో ఉండాల్సిన అవసరం లేదని శ్రీలంక క్రికెట్ బోర్డ్ సభ్యత్వాన్ని ఐసిసి రద్దుచేసింది…