IPL Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. నాలుగో స్థానం కోసం పంజాబ్, కోల్కతా, రాజస్థాన్ జట్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించడంతో.. ఆ జట్టు కాస్త ముందడుగు వేసింది. అయితే రాజస్థాన్.. కోల్కతా జట్లకు కూడా అవకాశం ఉండడం.. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచులు ఆడే అవకాశం ఉండడంతో.. ఏదైనా జరగవచ్చని క్రికెట్ విశేషకులు అంచనామిస్తున్నారు.
లీగ్ దశలో ఆదివారం నాడు రెండు కీలకమైన మ్యాచులు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ల్లో గెలిచిన వారికి నాలుగో బెర్త్ దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.. నాలుగో బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, కోల్కతా జట్లు సిద్ధంగా ఉన్నాయి. పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు
.. రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లు.. కోల్కతా ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి..
ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ గనుక ముంబై ఇండియన్స్ మీద విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాల అవసరం లేకుండానే నాలుగో స్థానాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు రాజస్థాన్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. ఫలితంగా చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా కోల్కతా, పంజాబ్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ఒకవేళ గనుక రాజస్థాన్ ఓటమిపాలైతే.. పంజాబ్, కోల్కతా చెట్లకు అవకాశాలుంటాయి. అప్పుడు ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో కోల్కతా గెలవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు పంజాబ్ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా + 0.309 ఉంది. ఇలాంటప్పుడు పంజాబ్ జట్టును అధిగమించాలంటే కోల్కతా అత్యంత భారీ విజయం సొంతం చేసుకోవాలి. ఢిల్లీ జట్టు మీద భారీ అంతరంతో కోల్కతా గెలిస్తే ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ కూడా+0.011 ఉంటుంది.
కోల్కతా జట్టు బెటర్ నెట్ రన్ రేట్ సాధించాలంటే ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు 200 పైగా పరుగుల టార్గెట్ విధించాలి. ఆ తర్వాత 77 పరుగుల అంతరంతో విజయం సాధించాలి.
ఒకవేళ కోల్కతా టార్గెట్ ఫినిష్ చేయడానికి దిగినప్పుడు 200కు పైగా పరుగుల టార్గెట్ ను కేవలం 12.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. అప్పుడు పంజాబ్ జట్టు వెనక్కి వెళ్ళిపోతుంది.. కోల్కతా ముందుకు వస్తుంది.. ఇవన్నీ జరగాలంటే ముంబై ఇండియన్స్ జట్టు మీద రాజస్థాన్ ఓడిపోవాలి. ఒకవేళ గెలిస్తే పంజాబ్.. కోల్కతా బ్యాగులు సర్దుకుని ఇంటికి పోవాలి.
