Homeక్రీడలుక్రికెట్‌Lord Historic Victory India Cricket: లార్డ్స్‌లో జరిగిన చారిత్రాత్మక అద్భుతం.. భారత క్రికెట్‌ను ప్రపంచ...

Lord Historic Victory India Cricket: లార్డ్స్‌లో జరిగిన చారిత్రాత్మక అద్భుతం.. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజయం!

Lord Historic Victory India Cricket: జూన్ 25.. క్రికెటర్ క్రీడాకారులు, అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. భారత క్రికెట్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన క్షణాలు ఆరోజు ఆవిష్కృతమయ్యాయి. అప్పటివరకు క్రికెట్ రా రాజుగా ఉన్న వెస్ట్ ఇండీస్ ను చిత్తుచేసి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారి గెలిచిన భారత్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. 1983లో ఇంగ్లండ్‌లో జరిగిన మూడో వన్డే వరల్డ్ కప్‌లో భారత్ పసికూన జట్టుగా ప్రవేశించింది. అప్పటికే వెస్టిండీస్ రెండు వరుస వరల్డ్ కప్‌లు గెలిచిన బలమైన జట్టు. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లో కష్టాలను ఎదుర్కొంది. జింబాబ్వేపై డ్రామాటిక్ విజయం (కపిల్ దేవ్ సెంచరీ), ఆస్ట్రేలియాపై విజయం వంటి మ్యాచ్‌లు జట్టుకు ఆత్మవిశ్వాసం కలిగించాయి. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ ప్రయాణం మొత్తం ఒక అద్భుత కథలా మారింది.

కల సాకారమైన రోజు..
జూన్ 25, 1983న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడామైదానం లార్డ్స్ లో జరిగిన ఫైనల్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 60 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి ఓపెనర్లు మంచి ప్రారంభం ఇచ్చినా, మధ్యలో వికెట్లు పడటంతో స్కోరు నియంత్రణలో ఉంది. లక్ష్య చేదనలో బలమైన వెస్టిండీస్ జట్టు (వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, ఆండీ రాబర్ట్స్ వంటి స్టార్లు ఉన్న) కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. మదన్ లాల్, రోజర్ బిన్నీ వంటి బౌలర్లు కీలక వికెట్లు తీసి ఆ బలమైన జట్టును కుదిపేశారు. మొహిందర్ అమర్‌నాథ్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌గా నిలిచారు.

అద్భుతం చేసిన కపిల్ దేవ్..
ఈ మ్యాచ్‌లో అత్యంత హైలైట్ కపిల్ దేవ్ పట్టిన వివ్ రిచర్డ్స్ క్యాచ్. రిచర్డ్స్ బ్యాటింగ్‌లో ఆధిపత్యం చూపుతున్న సమయంలో కపిల్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందుకున్నారు. ఆ క్షణం టోర్నీకే సింబల్‌గా మారింది. కపిల్ దేవ్ ఆ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యారు. ఆయన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, నాయకత్వం అన్నింటిలోనూ అద్భుతంగా రాణించారు. ఆయన నాయకత్వంలో జట్టు ఒకటిగా కలిసి ఆడి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

భారత క్రికెట్‌పై ప్రభావం..
1983 విజయం భారత క్రికెట్ దిశనే మార్చివేసింది. ఆ రోజు వరకు భారత్‌లో క్రికెట్ ప్రధానంగా టెస్ట్ ఫార్మాట్‌కు పరిమితం. ఈ వన్డే విజయం తర్వాత దేశవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఉత్సాహం పెరిగింది. యువత, పిల్లలు బ్యాట్, బాల్‌తో ఆడడం ప్రారంభించారు. టెలివిజన్ ద్వారా క్రికెట్ ప్రసారాలు పెరిగి, క్రికెట్ వాణిజ్యపరంగా ఎదగడానికి పునాది వేసింది. ఈ విజయం తర్వాత వచ్చిన తరం (సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు) ఈ విజయం నుంచి స్ఫూర్తి పొందారు. 2011 వరల్డ్ కప్ విజయానికి కూడా ఈ 1983 విజయం ప్రేరణగా నిలిచింది.

1983 జూన్ 25న సాధించిన ఈ విజయం భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మలుపు. ఆ రోజు వరకు భారత జట్టు అనుభవం లేని, బలహీనంగా చూడబడేది. కపిల్ దేవ్ నాయకత్వం, జట్టు సభ్యుల ఐక్యత, ధైర్యం ఈ విజయాన్ని సాధ్యం చేశాయి.ఈ విజయం భారతదేశంలో క్రికెట్‌ను “ఆట” నుంచి “జాతీయ గర్వం” స్థాయికి తీసుకెళ్లింది. దేశంలో క్రికెట్ అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగి, ఆ తర్వాతి దశాబ్దాల్లో భారత క్రికెట్ వాణిజ్య, మీడియా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారీగా అభివృద్ధి చెందింది. నేటికీ 1983 విజయం భారత క్రికెట్ అభిమానులకు, ఆటగాళ్లకు స్ఫూర్తి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular