Homeక్రీడలుMI Vs KKR 2024: ముంబై 12 ఏళ్ల రికార్డును.. హార్దిక్ నాశనం చేశాడు.. ఇందుకా...

MI Vs KKR 2024: ముంబై 12 ఏళ్ల రికార్డును.. హార్దిక్ నాశనం చేశాడు.. ఇందుకా నిన్ను కెప్టెన్ చేసింది?

MI Vs KKR 2024: ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు.. ప్రస్తుత 17వ సీజన్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. 11 మ్యాచులు ఆడి.. కేవలం మూడంటే మూడే విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి సొంత మైదానంలో కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా కోల్ కతా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో కొంత ఇబ్బంది పడింది. ఆ తర్వాత తేరుకుంది. బౌలింగ్ లో కోల్ కతా జట్టు ముంబైని కకావికలం చేసింది. ముంబై జట్టును ఓడించి ఏడవ విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది. ఈ విజయం ద్వారా ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో నిలవడం మాత్రమే కాదు, 12 సంవత్సరాల ముంబై జట్టు రికార్డును కోల్ కతా బద్దలు కొట్టింది. అంతేకాదు హార్థిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు ఓడిపోవడమే కాదు, తన అరుదైన ఘనతను కూడా కోల్పోయింది. ముంబై జట్టు ఘనతను పోగొట్టుకోవడం పట్ల అభిమానులు హార్దిక్ పాండ్యాను ఏకిపడేస్తున్నారు.

రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ముంబై జట్టు వాంఖడే మైదానంలో కోల్ కతా ను విజయం సాధించకుండా నిలువరించింది. ముంబై జట్టును పీకి పొడుస్తాడని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా పెట్టుకుంటే.. తొలి ఏడాదిలోనే పరువు తీశాడు. 2012లో ముంబై జట్టును.. కోల్ కతా వాంఖడే మైదానంలో ఓడించింది. అప్పుడు కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు కోల్ కతా జట్టుకు మెంటార్ గా పనిచేస్తున్నాడు. ముంబై జట్టును వారి సొంత మైదానంలో ఏదో ఒక రూపంలో ఓడించడంలో గౌతమ్ గంభీర్ తనవంతు పాత్ర పోషించాడు.. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ, సరైన నాయకత్వం లేకపోవడంతో ముంబై జట్టు కోల్ కతా చేతిలో ఓటమిని ఎదుర్కొందని, 12 సంవత్సరాల రికార్డును కోల్పోయిందని అభిమానులు వాపోతున్నారు.

ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. కోల్ కతా రెండుసార్లు కప్ అందుకుంది.. ఎంతో బలమైన ఈ రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతుందని అభిమానులు భావించారు. హోరాహోరీగా జట్లు తలపడతాయని అనుకున్నారు. 12 ఏళ్లుగా పై చేయి సాధించుకుంటూ వచ్చిన ముంబై, ఈసారి కూడా అదే పరాక్రమాన్ని ప్రదర్శిస్తుందని అంచనా వేశారు. కానీ, కోల్ కతా చేసిన తక్కువ స్కోరును చేజ్ చేయడంలో ముంబై విఫలం అయింది. మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకొని.. లీగ్ దశలోనే టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular