Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇకపై పర్మినెంట్ గా ఉండేది అక్కడే..

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇకపై పర్మినెంట్ గా ఉండేది అక్కడే..

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి రోజుకు ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అతని గురించి జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ఎవరు ఎలా అనుకున్న సరే.. ఎలా ప్రచారం చేసినా సరే హార్దిక్ పాండ్యా తన దారిలో తాను వెళుతూనే ఉంటాడు. తాను అనుకున్నది చేస్తూనే ఉంటాడు. ఆట నుంచి మొదలుపెడితే వై వాహిక జీవితం వరకు.. మైదానం నుంచి మొదలు పెడితే ఐపీఎల్ వరకు.. ఇలా ప్రతిదాంట్లో హార్దిక్ […]

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి రోజుకు ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అతని గురించి జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ఎవరు ఎలా అనుకున్న సరే.. ఎలా ప్రచారం చేసినా సరే హార్దిక్ పాండ్యా తన దారిలో తాను వెళుతూనే ఉంటాడు. తాను అనుకున్నది చేస్తూనే ఉంటాడు. ఆట నుంచి మొదలుపెడితే వై వాహిక జీవితం వరకు.. మైదానం నుంచి మొదలు పెడితే ఐపీఎల్ వరకు.. ఇలా ప్రతిదాంట్లో హార్దిక్ పాండ్యా తన మార్క్ చూపిస్తూనే ఉంటాడు.

హార్దిక్ పాండ్యా కెరియర్ ప్రస్తుతం అంత గొప్పగా సాగడం లేదు. వైవాహిక జీవితం కూడా అంత గొప్పగా లేదు. భార్యకు విడాకులు ఇచ్చాడు. మరొక యువతి తో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో అతని ప్రదర్శన మెరుగ్గా లేదు. సారథిగా విఫలమయ్యాడు. ఆటగాడిగా కూడా ఫ్లాఫ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో అతడు ముంబై జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదని తెలుస్తోంది. ముంబై జట్టు నుంచి బయటకు వస్తాడని.. లక్నో జట్టుకు మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా. అతడు ప్రస్తుతం బీసీసీఐ శిక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ శిక్షణ కేంద్రం బెంగళూరులో ఉంది. అతడు పూర్తిస్థాయిలో చికిత్స పొందేందుకు.. పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్లే అతడు బెంగళూరుకి తన మకాం మొత్తం మార్చాడని సమాచారం. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఒక ప్రాపర్టీని అతడు కిరాయికి తీసుకున్నట్టు సమాచారం. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రాంతాన్ని తనకు ట్రైనింగ్ బేస్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు వైట్ బాల్ క్రికెట్ ఆడాలని పాండ్యా నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా కు అందించడంతోపాటు.. 2028లో ఒలంపిక్స్ లో మెడల్ అందుకోవడం తన గోల్ అని పాండ్యా చెప్పినట్టు తెలుస్తోంది. పాండే ఇప్పటికే తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ కోచ్ లను నియమించుకున్నట్టు సమాచారం.. అతనితోపాటు మిహికా కూడా అక్కడే ఉంటునట్లు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper