India Vs Australia 2nd T20: తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా ఇండియా టీం ల మధ్య నిన్న రెండో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం నిర్ణీత 20 ఓవర్లకి 235 పరుగులు చేసింది. యశస్వి జైష్వాల్ , రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ముగ్గురు విజృంభించడంతో ఇండియన్ టీం అంత భారీ స్కోర్ చేయగలిగింది. ఇక 236 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం లో స్టోయినిస్, టిమ్ డేవిడ్,మాథ్యూ వేడ్ ముగ్గురు కూడా కొంతవరకు టీమ్ కి మంచి స్కోర్ అందించినప్పటికీ ఆస్ట్రేలియా ఇండియా టీం మీద విజయం సాధించలేకపోయింది. దాంతో ఇండియన్ టీం ఆస్ట్రేలియా మీద 44 పరుగుల తేడాతో విజయం సాధించింది…
ఇక దీంతో ఇండియన్ టీం వరుసగా రెండు టీ20 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.ఇక ఇంకొక మ్యాచ్ లో కనుక విజయం సాధిస్తే టి20 సిరీస్ ఇండియా కైవసం చేసుకుంటుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన సంఘటన అనేది చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ మ్యాచ్ జియో సినిమా ఆప్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుండటం వల్ల ఇందులో అత్యధిక వ్యూయర్ షిప్ అనేది సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు ఎవరు చూడని విధంగా 20.5 కోట్ల వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకొని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఇప్పటివరకు ఇంతటి వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్న మ్యాచ్ ఏది లేకపోవడంతో చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. ఇక వన్డే వరల్డ్ కప్ విషయంలో కూడా ఎంతమంది ఆ మ్యాచ్ లను చూసినప్పటికీ ఇంత ఎక్కువ వ్యూయర్ షిప్ అనేది నమోదు కాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కల్గించే విషయం అనే చెప్పాలి.
ఇక ఈ టి20 మ్యాచ్ ని అంత మంది ప్రేక్షకులు చూడడం అనేది నిజంగా ఒక అరుదైన అద్భుతం అనే చెప్పాలి. ఇక వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద ఫైనల్ లో ఇండియా ఓడిపోవడంతో దానికి రివేంజ్ గా సాగుతున్న ఈ మ్యాచుల పైననే ప్రతి ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ మ్యాచ్ లను చూడడానికి సిద్ధమవుతున్నారు.
అందుకే ఇంత ఎక్కువ సంఖ్య లో వ్యూయర్ షిప్ అనేది నమోదు అవుతుంది. ఇంక మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గనక ఇండియా గెలిచినట్టయితే ఈ సిరీస్ ని కైవసం చేసుకుంటుంది.ఇక వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయినందుకు ఈ సీరీస్ లను గెలిచి ఇండియన్ టీమ్ రివెంజ్ తీర్చుకోవాలని ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాడు…