spot_img
Homeక్రీడలుక్రికెట్‌2027 ODI World Cup India Squad: 2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ...

2027 ODI World Cup India Squad: 2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ ముగ్గురు ఎంతగా ఆడినా.. వాళ్లు కర్చీఫ్ చేశారు

2027 ODI World Cup India Squad: ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అదే ఆఫ్గనిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు యంగ్ ప్లేయర్లకు అవకాశం లభించింది. అయితే వారు గనుక సత్తా చూపిస్తే 2027 మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం. అయితే అది అంత ఈజీ కాదు.

2027 ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నాహాలు చేస్తోంది. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ప్లేయర్లు ఉపయోగించుకోవాలి. అయితే ఈ సిరీస్లో గొప్పగా ఆడినంత మాత్రాన ఆ ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం వస్తుందని చెప్పడానికి లేదు.. ఎందుకంటే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా గాయాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు దూరమయ్యారు. కోహ్లీ, పాండ్యా కు గాయాల వల్ల వారి స్థానంలో జైస్వాల్ ను తీసుకున్నారు. నిలకడైన ఆటతీరితో ఆకట్టుకుంటున్న ఇతడు.. 2027 ప్రపంచ కప్ లో జట్టులో చోటు సంపాదించుకోవడం అనుమానమే. ఒకవేళ ఇతడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అదరగొట్టినప్పటికీ.. విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకుని వస్తే మాత్రం ఇతడికి చోటు ఉండదు.

2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని రవీంద్ర జడేజా కు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో ఎడమ చేతివాటం ఆర్థోడాక్స్ పిన్నర్ హర్ష్ దూబే చోటు దక్కించుకున్నాడు.. ఒకవేళ ఇతడు ఆఫ్గనిస్తాన్ సిరీస్ లో అదరగొట్టినప్పటికీ.. 2027 వరల్డ్ కప్ లో కచ్చితంగా జడేజా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దూబే తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.

బుమ్రా కు వర్క్ లోడ్ వల్ల మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. అతని స్థానంలో గుర్నూర్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ తరఫున ఇతడు తొమ్మిది లిస్టు ఏ మ్యాచ్ లు ఆడాడు. అతడు ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా ఆడటం ఖాయం. అతడు జట్టులోకి వస్తే గుర్నూర్ వెళ్ళిపోవాల్సిందే.

మరోవైపు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా.. బుమ్రా తరచు గాయాల బారిన పడటం వల్ల మేనేజ్మెంట్ వారికి అవకాశాలు ఇస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే యంగ్ ప్లేయర్లతో వరల్డ్ కప్ పాటించాలని గంభీర్ భావిస్తున్నాడు. అందువల్లే సీనియర్ ప్లేయర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకవేళ గంభీర్ మాట గనుక చెల్లుబాటు అయితే అప్పుడు విరాట్ కోహ్లీ.. బుమ్రా. . హార్దిక్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో రోహిత్ కూడా ఉంటాడు. అప్పుడు ఆఫ్గనిస్తాన్ సిరీస్లో సత్తా చూపించిన ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular