spot_img
Homeక్రీడలుక్రికెట్‌2027 ODI World Cup India Squad: 2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ...

2027 ODI World Cup India Squad: 2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ ముగ్గురు ఎంతగా ఆడినా.. వాళ్లు కర్చీఫ్ చేశారు

2027 ODI World Cup India Squad: ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అదే ఆఫ్గనిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు యంగ్ ప్లేయర్లకు అవకాశం లభించింది. అయితే వారు గనుక సత్తా చూపిస్తే 2027 మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం. అయితే అది అంత ఈజీ కాదు.

2027 ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నాహాలు చేస్తోంది. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ప్లేయర్లు ఉపయోగించుకోవాలి. అయితే ఈ సిరీస్లో గొప్పగా ఆడినంత మాత్రాన ఆ ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం వస్తుందని చెప్పడానికి లేదు.. ఎందుకంటే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా గాయాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు దూరమయ్యారు. కోహ్లీ, పాండ్యా కు గాయాల వల్ల వారి స్థానంలో జైస్వాల్ ను తీసుకున్నారు. నిలకడైన ఆటతీరితో ఆకట్టుకుంటున్న ఇతడు.. 2027 ప్రపంచ కప్ లో జట్టులో చోటు సంపాదించుకోవడం అనుమానమే. ఒకవేళ ఇతడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అదరగొట్టినప్పటికీ.. విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకుని వస్తే మాత్రం ఇతడికి చోటు ఉండదు.

2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని రవీంద్ర జడేజా కు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో ఎడమ చేతివాటం ఆర్థోడాక్స్ పిన్నర్ హర్ష్ దూబే చోటు దక్కించుకున్నాడు.. ఒకవేళ ఇతడు ఆఫ్గనిస్తాన్ సిరీస్ లో అదరగొట్టినప్పటికీ.. 2027 వరల్డ్ కప్ లో కచ్చితంగా జడేజా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దూబే తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.

బుమ్రా కు వర్క్ లోడ్ వల్ల మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. అతని స్థానంలో గుర్నూర్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ తరఫున ఇతడు తొమ్మిది లిస్టు ఏ మ్యాచ్ లు ఆడాడు. అతడు ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా ఆడటం ఖాయం. అతడు జట్టులోకి వస్తే గుర్నూర్ వెళ్ళిపోవాల్సిందే.

మరోవైపు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా.. బుమ్రా తరచు గాయాల బారిన పడటం వల్ల మేనేజ్మెంట్ వారికి అవకాశాలు ఇస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే యంగ్ ప్లేయర్లతో వరల్డ్ కప్ పాటించాలని గంభీర్ భావిస్తున్నాడు. అందువల్లే సీనియర్ ప్లేయర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకవేళ గంభీర్ మాట గనుక చెల్లుబాటు అయితే అప్పుడు విరాట్ కోహ్లీ.. బుమ్రా. . హార్దిక్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో రోహిత్ కూడా ఉంటాడు. అప్పుడు ఆఫ్గనిస్తాన్ సిరీస్లో సత్తా చూపించిన ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper