Homeఆధ్యాత్మికంKrishnashtami : కృష్ణాష్టమి పండుగ ఏ రోజు జరుపుకోవాలి? పూజా విధానం ఏంటి?

Krishnashtami : కృష్ణాష్టమి పండుగ ఏ రోజు జరుపుకోవాలి? పూజా విధానం ఏంటి?

Krishnashtami : దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సౌత్ కంటే నార్త్ వాళ్లు ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే పండుగలను తిథుల బట్టి ఏ రోజు జరుపుకోవాలి అని నిర్ణయిస్తారు. కొన్ని పండుగలు రెండు రోజులు ఉంటాయి. వీటికి కారణం తిథి అనే రెండు రోజులు ఉంటుంది. ఇలా కొన్నిసార్లు జరుగుతుంది. దీంతో చాలామంది గందరగోళానికి గురవుతారు. అయితే తిథి ఉండే సమయాన్ని బట్టి పండుగ జరుపుకోవాలి. అయితే మరి ఈ ఏడాది కృష్ణాష్టమి పండుగను ఏ రోజు జరుపుకోవాలి? ఆగస్టు 26 లేదా 27వ తేదీన? పూజ ఏ సమయంలో చేయాలి? అసలు పూజా విధానం ఏంటి? పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం.

హిందూ పంచాంగంలో శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన సోమవారం తెల్లవారు జామున 3:39 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మళ్లీ ఆగస్టు 27వ తేదీన మంగళవారం తెల్లవారు జామున 2:19 గంటలకు తిథి ముగిస్తుంది. అయితే కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలంటే సూర్యోదయంలో తప్పకుండా రోహిణ నక్షత్రం కూడా ఉండాలి. అయితే రోహిణి నక్షత్రం ఆగస్టు 26న మధ్యాహ్నం 3:55 గంటలకు మొదలయ్యి, మరుసటి రోజు ఆగస్టు 27న మధ్యాహ్నం 3:38 గంటలకు ముగిస్తుంది. దీంతో పండితులు ఈ పండుగను కొందరు స్మార్త, వైష్ణవ కృష్ణాష్టమి అనే రెండు రకాలుగా జరుపుకుంటారని చెబుతున్నారు.

స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ స్మార్త కృష్ణాష్టమిని జరుపుకోవడానికి సూర్యోదయంలో రోహిణి నక్షత్రం ఉండాలని ఏం లేదు. ఆ రోజులో ఎప్పుడైనా రోహిణి నక్షత్రం ఉంటే చాలు. వైష్ణవ కృష్ణాష్టమిని జరుపుకునేవాళ్లు రోహిణి తిథి సూర్యోదయంలో ఉండేట్లు చూసుకుంటారు. దీని ప్రకారం ఆగస్టు 27న ఉదయం రోహిణి తిథి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్థరాత్రి 12:44 వరకు జరుపుకుంటారు. ఆగస్టు 27న ఉదయానికి నవమి తిథి మొదలవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఉట్టి కొట్టడం మాత్రం ఆగస్టు 27న మంగళవారం జరుపుకుంటున్నారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణుడికి జలాభిషేకం చేయాలి. కన్నయ్యకు ఇష్టమైన వంటలు పెట్టాలి. సాయంత్రం సమయంలో కన్నయ్యను ఊయలలో వేయాలి. పూజ చేయాలి. అయితే కృష్ణాష్టమి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. దీనివల్ల మంచి జరుగుతుందని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు.

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper