Homeఆధ్యాత్మికంEkadashi 2024 : అజ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి?

Ekadashi 2024 : అజ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి?

Ekadashi 2024 : ప్రతి నెలలో వచ్చే ప్రతి ఏకాదశికి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఏకాదశి రోజునే విష్ణుమూర్తిని పూజించి, ఉపవాస దీక్ష పాటిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ అజ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి గురువారం ఆగస్టు 29, మధ్యాహ్నం 1:19 గంటలకు ప్రారంభమయ్యి.. శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ ఏకాదశికి రెండు శుభ యోగాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అందులో ఒకటి సిద్ధి యోగం. మరొకటి సర్వార్థ సిద్ధ యోగం. సిద్ధి యోగం ఉదయం నుంచి సాయంత్రం 6:19 నిమిషాల వరకు ఉంటుంది. సర్వార్ధ సిద్ధి యోగం ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4:39 నుంచి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు ఉంటుంది. అయితే ఈ యోగాల్లో పూజలు నిర్వహించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఎలా పూజించాలంటే?
అజ ఏకాదశి రోజు మహా విష్ణువు భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్యం లభించడంతో పాటు సుఖసంతోషాలతో ఉంటారు. అయితే ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ అజ ఏకాదశి పూజను ఉపవాసం ఉన్న రోజు చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం 4:39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇలాంటి సమయంలో విష్ణువును కొలిస్తే శభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి సాన్నం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి మహా విష్ణువును కొలిచి ఉపవాసం ఉంటానని దేవుడికి మాట ఇవ్వాలి. తులసి మొక్కను మహా విష్ణువుకి కొలుస్తారు. కాబట్టి తులసి మొక్కను పూజించాలి. ఆ తర్వాత విష్ణువు మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపించాలి. ఆ తర్వాత అజ ఏకాదశి కథ వినాలి. ఆహారం, బట్టలు, డబ్బు, ధాన్యాలు వంటివి దానం చేయాలి. ఆ తర్వాత విష్ణువును కొలుస్తూ భజన చేయాలి. ఆ తర్వాతే పండ్లు, పాలు, పళ్లు రసాలు వంటివి తీసుకోవాలి. అంతవరకు ఉపవాస దీక్ష పాటించాలి. అయితే కొందరు పూర్తిగా ఏం తినకుండా ఉంటారు. కొందరు కేవలం ఒక పూట మాత్రమే తింటారు.

ఈ పనులు చేయవద్దు
ఈ రోజు వేరే ఇతర పనులు పెట్టుకోకుండా విష్ణువును భక్తి శ్రద్ధలతో కొలుస్తుండాలి. రోజంతా ఆహారం తీసుకుకుండా దేవుడిని మాత్రమే కొలవాలి. అలాగే ఆటలు, కోపం, హింస వంటి వాటికి దూరంగా ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, మద్యం వంటివి తీసుకోకూడదు. ఈ నియమాలు అన్ని అజ ఏకాదశి రోజున పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular