Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశివారికి పెండింగు పనులు పూర్తవుతాయి.. నేటి రాశి ఫలాలు ఏ...

Rashi Phalalu: ఈ రాశివారికి పెండింగు పనులు పూర్తవుతాయి.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 5న ఆదివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి ప్రతికూల వాతావరణం ఏర్పడనుంది. మరికొందరికి ఆకస్మిక అదృష్టం రానుంది. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వాదనలకు దిగొద్దు. కుటుంబ సభ్యులతో టూర్ ట్రిప్ కు ప్లాన్ వేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం.

వృషభం:
విహార యాత్రకు వెళ్తారు. కార్యాలయం నుంచి ఒక శుభవార్త వింటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉ:టారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన సమయం.

మిథునం:
ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మెప్పు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. తండ్రి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తారు. రాజకీయాల్లో ఉండేవారికి సత్ఫలితాలు.

కర్కాటకం:
దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఏ పనిచేసినా అంకిత భావంతో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక వేస్తారు.

సింహం:
ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్తారు. కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. జాగ్రత్తగా ఉండాలి.

కన్య:
ఉద్యోగులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు.మీ పురోగతిపై ఎదుటి వారికి ఈర్ష్య ఉంటుంది.

తుల:
ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం ఎటువంటి వివాదాలకు వెళ్లొద్దు. ప్రాజెక్టులు ప్రారంభిస్తే అవి పూర్తవుతాయి.

వృశ్చికం:
ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కుటుంబలో ఉన్న గొడవలు సమసిపోతాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు పొందుతారు.

ధనస్సు:
వ్యాపారులకు నగదు కొరత ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఏర్పడుతాయి. కొన్ని రిస్క్ లు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్ లో సమస్యలు వస్తాయి.

మకరం:
కొన్ని రంగాల వారికి అనుకూలం వివిధ పనుల కారణంగా ఆందోళన పెరుగుతుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కొన్ని ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండొద్దు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారులు లాభాలను పొందే అవకాశాలు ఎక్కువ.

మీనం:
ఏ సమస్య వచ్చినా తెలివితేటలు ప్రదర్శిస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిస్క్ తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular