Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం..

Rashi Phalalu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 1న శుక్రవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, మిథునం రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఆర్థిక వ్యవహారాలుఎక్కువగా జరుపుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా నష్టం జరిగే అవకాశం.

వృషభం:
ఆకస్మిక పర్యటనలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో ఆటంకాలు ఏర్పడితే ఇతరుల సాయంతో పరిష్కరించుకుంటారు. పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

మిథునం:
ఆర్థిక ప్రయోజనాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. డబ్బును ఆదా చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తారు.

కర్కాటకం:
విలాసాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయొద్దు. మీ మీద ఆధిపత్యానికి శత్రువులు రెడీగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందే అవకాశం.

సింహం:
కొన్ని సమాచారాల కారణంగా మనసు కకావికలం అవుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. లేదంటే సమస్యలు ఎక్కువవుతాయి.

కన్య:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ముందుకు సాగాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

తుల:
జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారిని కలుసుకోవడంతో మనసుల్లో ఉత్తేజం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు ఉన్న వివాదాలు ఈ రోజుతో పరిష్కారం అవుతాయి.

వృశ్చికం:
ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా దానిని పూర్తి చేయరు ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లోకొంత అసౌకర్యాన్ని పొందుతారు.

ధనస్సు:
దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. సాయంత్రం ఆరోగ్యంలో మార్పులు రావొచ్చు. సమస్యలను అధిగమించేందుకు ఎంతో కష్టపడుతారు. ఆదాంయ పెంచేందుకు మార్గాన్ని అన్వేషిస్తారు.

మకరం:
వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఇన్నాళ్లు మిగిలిపోయిన పనులు పూర్తి కావడంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెంచేందుకు ఎక్కువగా దృష్టి సారించాలి.

కుంభం:
కొత్త పనిని మొదలుపెట్టేవారికి అదృష్టం అని చెప్పొచ్చు. కొన్ని పనులను సలభంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం.

మీనం:
ఉద్యోగులుఉల్లాసంగా గడుపుతారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. అనవసర వాదనలకు పొవద్దు. ఎన్ని విమర్శలు వచ్చినా ఓపికతో ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular