Homeఆధ్యాత్మికంFriday Puja Tips : శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? అయితే మీ డబ్బు పోయినట్లే..

Friday Puja Tips : శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? అయితే మీ డబ్బు పోయినట్లే..

Friday Puja Tips :  జీవితంలో డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో కొందరు మాత్రమే అనుకున్నది సాధిస్తారు. డబ్బు పొందడానికి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ అనుకున్న స్థాయిలో ఆదాయం పొందలేని వారు చాలా మందే ఉంటారు. సరైన ఆదాయం లేకపోవడంతో కొన్ని కొర్కెలు తీరక ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అనుకున్న ఆదాయం వచ్చి ఇల్లు సంతోషంగా ఉండాలంటే మహాలక్ష్మీ అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం సాధించాలంటే పూజలు, వ్రతాలతో పాటు శుచి, శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం స్వచ్చంగా ఉండాలి. అంతేకాకుండా శుభ్రమైన దుస్తులు ధరించాలి. అయితే కొన్నిపనులను శుక్రవారం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. దీంతో అటువంటి వారి ఇళ్లల్లో డబ్బు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా వారు తీవ్ర నిరాశతో ఉంటాయి. ఆ వివరాల్లోకి వెళితె..

మహాలక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవవాలంటే శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానమాచరించాలి. ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసుకొని తెల్లటి వస్త్రాలు ధరించాలి. తెలుసు స్వచ్ఛతకు నిదర్శనం. అందువల్ల శుక్రవారం తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు సంతోషిస్తారు. ఆ తరువాతు అవసరమైన పూజలు చేయాలి.అలాగే పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

శుక్రవారం మహిళలు నిష్టతో ఉండడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు సారీ మాత్రమే ధరించాలి. ఎరుపు రంగు చీరను ధరించినా అమ్మవారు సంతోషిస్తారు. ఈరోజు ఎటువంటి కోపాలు తెచ్చుకోకుండా ప్రశాంతగా ఉండాలి. నుదుటన తప్పనిసరిగా కుంకుమ ఉండేలా చూసుకోవాలి. ఇప్పడు కురులను అలా వదిలేకుండా ముడి వేసుకోవాలి. సాయత్రం సమయంలో అస్సలు నిద్రించకుండా ఉండాలి. ఈరోజు మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. అలాగే ఆభరణాలు మెడలో మాత్రమే ధరించాలి. కొన్ని ఆభరణాలు చేతికి వేసుకోకూడదు. బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందువల్ల బంగారం స్వచ్ఛమైన ప్రదేశంలో ఉండడం మంచిది.

మహిళలతో పాటు పురుషులు కూడా కొన్నినియమాలు పాటించడం వల్ల అమ్మవారిని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం పురుషులు తమ ఇల్లాలని ఎటువంటి పరుష వ్యాఖ్యలు చేయొద్దు. తనకు కోపం వచ్చే విధంగా ఎటువంటి పనులు చేయకూడదు. ఈరోజు అమ్మవారి సేవలో ఉన్న వారిని చేతితో కొట్ట కూడదు. అవసరమైతే వారు సంతోషంగా ఉండే విధంగా కొన్ని పనులు చేయాలి. ఈరోజు మహిళలను గౌరవించడం వల్ల శుభాలు జరుగుతాయి. పురుషులు ఈరోజు తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఆర్థికంగా లాభం చేకూరుతుంది.

ఈరోజు రాజ వృక్ష వద్ద ప్రత్యేక పూజలు చేయాలి. రాజవృక్షం వద్ద అమ్మవారు కొలువై ఉంటారని అంటారు. అలాగే కమలం పుష్పాలతో అమ్మవారిని పూజించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఎవరికీ ధనం ఇవ్వకూడదు. కొన్ని ప్రత్యేక పనులు చేయకుండా ఉండాలి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం లభించి ఐశ్వర్యవంతులుగా మారి సంతోషంగా జీవిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular