Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం.. ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా...

Rashi Phalalu: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం.. ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 5 శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరో రాశివారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పవు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి పనిలో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రయాణాలు చేసేవారు ఆలోచించి ముందుకు అడుగు వేయాలి.

వృషభం:
ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. భవిష్యత్ గురించి లక్ష్యాలను నిర్ణయిస్తారు. శత్రువులు మీ సహనాన్నిపరీక్షించవచ్చు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:
ఆర్థికపరమైన విషయాల్లో బంధువులు మోసం చేసే అవకాశం ఉంది. వారితో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లయిన కొత్త దంపతుల మధ్య వివాదాలు ఉండే అవకాశం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో సీనియర్ల సలహాలు తీసుకోవాలి.

కర్కాటకం:
ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చించాలి. లేకుంటే ప్రేమ తగ్గిపోతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగులు మాత్రం ఉల్లాసంగా ఉంటారు.

సింహ:
ఆరోగ్య సమస్యలు వెంటాడవచ్చు. రాజకీయాల్లో ఉండేవారికి అద్భుత అవకాశాలు ఉండొచ్చు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఒక సమస్య కోసం వైద్యులను సంప్రదిస్తారు.

కన్య:
రాజకీయాల్లో కొనసాగేవారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. ఓ వర్క్ కోసం టూర్ ప్లాన్ వేస్తారు. మొత్తంగా సంతోషంగా గడుపుతారు.

తుల:
వివాహంకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు శ్రద్ధ వహించిన ఆశించిన ఫలితాలు పొందలేరు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వృశ్చికం:
మీరు మంచిగా మాట్లాడినా ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందువల్ల తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దు.

ధనస్సు:
ఇతరులకు ఇచ్చిన వాగ్గానాలను నెరవేరుస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి.

మకర:
వ్యాపారులకు ఆకస్మిక లాభాలు.. అవివాహితులకు సంబంధాలు వస్తాయి. వీరికి ఈరోజు పట్టిందల్ల బంగారం అన్నట్లుగా జీవితం కొనసాగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది.

కుంభం:
ఇన్నాళ్లు వ్యక్తిగత సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:
పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు సరైన ప్రణాళికలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular