Homeఆధ్యాత్మికంRashi Phalalu: ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం.. ఈరోజు 12 రాశి ఫలాలు ఏవిధంగా...

Rashi Phalalu: ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం.. ఈరోజు 12 రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 16న శనివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మీనం, సింహ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కొన్ని విషయాల కారణంగా ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలి. బంధువులలో ఒకరికి డబ్బు ఏర్పాటు చేస్తారు.

వృషభం:
ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఆందోళన చెందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగా జరుపుతారు. సాయంత్ర ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని శుభవార్తలు వింటారు.

మిథునం:
పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. సాయంత్రం శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులను ఎవరైనా మోసం చేసే ప్రమాదం ఉంది.

కర్కాటకం:
జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం డబ్బ ఖర్చు చేస్తారు. ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి సమయం కేటాయిస్తారు.

సింహ:
ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పులు ఎవరిదగ్గర తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు.

కన్య:
వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో సహకారం ఉంటుంది. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి.

తుల:
ఆనారోగ్య సమస్యలు పెరగవచ్చు. ఉద్యోగులు పై వారితో వాదననలకు దిగొద్దు. ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. సాయంత్ర కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:
కొన్ని పనులతో ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. చిరువ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ధనస్సు:
మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలు పొందే ఛాన్స్. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలి.

మకర:
వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల నుంచి సానుకూల వార్తలు వింటారు. ఇంటి కోసం ప్రత్యేకంగా ఖర్చులు చేస్తారు. సాయంత్రి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

కుంభం:
ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు రావొచ్చు. తల్లిదంద్రులకు సేవ చేస్తారు. పాత స్నేహతులను కలుస్తారు. వారితో ఉల్లాసంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: పెండింగులో ఉన్న బకాయిలు తీరుతాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. పిల్లలతో భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular