నిత్యావసరాలల్లో కోడిగుడ్ల ధరలు దోబూచూలాడుతాయి. అయితే కరోనా కాలంలో రూమర్స్ వచ్చినప్పుడు కోడిగుడ్ల ధరలు పడిపోగా సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత ఆమాంతం పెరిగాయి. అప్పటి నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు మళ్లీ దిగడం లేదు. వర్షాలు, ఇతర కారణాలతో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.6 పలుకుతుండగా, ట్రే రూ.160కి ఇస్తున్నారు. మరోవైపు కరోనా కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు రోజుకో కోడిగుడ్డును తినాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో వినియోగం కంటే ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగినట్లు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక ఉల్లి గడ్డధరలు సైతం మొన్నటి వరకు రూ.30 ఉండగా ప్రస్తుతం కేజీ రూ.60కి విక్రయిస్తున్నారు.
Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?