Homeజనరల్ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

2021 సంవత్సరానికి నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్ నోటిఫికేషన్ ‌ విడుదలైంది. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సైన్స్ లో వేర్వేరు కోర్సులు చేసి సైంటిస్ట్ లు కావాలని భావించే వాళ్లకు నెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్షకు హాజరైన వాళ్లు పీజీ కోర్సు – ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలను పొందే అవకాశం ఉంటుంది. Also Read: పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ […]

NEST Application Form Released.

2021 సంవత్సరానికి నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్ నోటిఫికేషన్ ‌ విడుదలైంది. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సైన్స్ లో వేర్వేరు కోర్సులు చేసి సైంటిస్ట్ లు కావాలని భావించే వాళ్లకు నెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్షకు హాజరైన వాళ్లు పీజీ కోర్సు – ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

నెస్ట్ కు ఎంపికైన వాళ్లు ఐదు సంవత్సరాల కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 – 2026 సంవత్సరంలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పీజీ కోర్సు- ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. 2019, 2020 సంవత్సరాల్లో ఇంటర్‌ (సైన్స్‌) గ్రూప్‌లో 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న వాళ్లు నెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్నులో కొత్త నిబంధనలివే..?

2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ తరువాత జన్మించిన జనరల్‌, ఓబీసీ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి. నెస్ట్‌- 2021 పరీక్షలో అర్హత సాధించిన వాళ్లకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో రెండు సెషన్లలో ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు ఉండగా అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్ధ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లను ఎంచుకోవాలి. https://www.nestexam.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.80,000 స్కాలర్ షిప్ లభిస్తుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper