Homeజాతీయ వార్తలుJagan KCR: జగన్‌ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్‌!

Jagan KCR: జగన్‌ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్‌!

Jagan KCR:ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేయడమే కానీ.. ఫాలో అవ్వని సీఎం కేసీఆర్.. తొలిసారి ఏపీ సీఎం జగన్ విధానాలకు ఫిదా అయ్యారు. అవ్వడమే కాదు.. వెంటనే అమలుకు నిర్ణయించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లూ అంటూ వెళుతున్న జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అవి కేసీఆర్ సర్కార్ ను సైతం ఆకర్షిస్తున్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు నాడు కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన పథకాలన్నీ కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. జగన్ అమలు చేస్తున్న విధానాలను కేసీఆర్ కాపీ కొడుతుండడం విశేషంగా మారింది..

Jagan KCR
kcr-jagan

అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చినట్లు కనిపిస్తోంది. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే తరలించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం నిర్ణయించడం విశేషం.

అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇరుశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,167 ఇప్పటికే ప్రాథమిక పాఠశాల ఆవరణలో పనిచేస్తున్నాయి. 11,185 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, మరో 12,174 ప్రభుత్వ భవనాల్లో పనిచేస్తుండగా, 12,219 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు తరలించడం ద్వారా వాటిని బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సత్యవతి రాథోడ్ తెలిపారు.

Also Read: కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు కేసీఆర్ పైఎత్తులు.. డైలామాలో జాతీయ పార్టీలు

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో క్రమంగా విలీనం చేయడమే లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి. “అంగన్‌వాడీ కేంద్రాల నుండి పిల్లలకు ప్రీ-ప్రైమరీ (నర్సరీ) విద్యను విస్తరించాలని మేము ఆలోచిస్తున్నాము. అక్కడ వారికి పౌష్టికాహారం అందించబడుతుంది. ప్రీ-ప్రైమరీ నుండి వారు వెంటనే అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు వెళతారు, ”అని వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ ప్రభుత్వం ఇదే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసి, అంగన్‌వాడీ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో చేర్చి, పేద వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ విద్యను అందించారు. ఏపీలో ఈ కాన్సెప్ట్ బాగానే ఉన్నందున, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే మోడల్‌ను అనుకరించాలని యోచిస్తోందని వర్గాలు తెలిపాయి.

Also Read: కేంద్రపథకాలు.. జగనన్న పేర్లు..ఏంటిది?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular