spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఓడించిన ప్రజలపై పవన్ కళ్యాణ్ లో ఫస్ట్రేషన్ బయటపడిందా?

ఓడించిన ప్రజలపై పవన్ కళ్యాణ్ లో ఫస్ట్రేషన్ బయటపడిందా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చాడు. సీఎం సీటు కోసం.. రాజ్యాధికారం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. నిజాయితీగా రాజకీయం చేశాడు. అందుకే 2014లో ఆయన బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అదే 2019లో వారి విధానాలు నచ్చక.. హామీలు నెరవేర్చకపోవడంతో ఒంటరిగా పోటీచేశాడు. అయితే రెండు చోట్ల పోటీచేసినా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో పార్టీ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడించిన ప్రజల తీరును తప్పు పట్టారు. నిజానికి గెలిపించకపోతే ఎవరూ ప్రజలపై కోపగించుకోరు.. అది నాయకుల లక్షణం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది మరోసారి గెలుస్తారు. అదే అసలైన నాయకుడి లక్షణం.. కానీ పవన్ ఈ విషయంలో తనను గెలిపించని ప్రజలను తప్పు పట్టడం హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ జనసేన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేయాలని వచ్చా.. కానీ తనను రెండు చోట్ల పోటీచేస్తే ప్రజలు ఓడించారు. వైసీపీని గెలిపించారు. ఇప్పుడు గెలిపించిన వైసీపీని వదిలేసి నన్ను పోరాడమంటున్నారు. ఇదెలా సాధ్యం? నేను ఓట్లు అడుక్కోను. అది నాకు నచ్చదు. నేను పోరాడుతున్న తీరు చూసి ఓట్లు వేయాలి’’ అంటూ ప్రజల తీరునే
పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. మీరు ఓట్లేసి విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపేవాడని.. మోడీని గట్టిగా ప్రజాప్రతినిధిగా నిలదీసేవాడిని.. ఇప్పుడు ఓడించి నాకు వాయిస్ లేకుండా చేశారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

అయితే ప్రజాస్వామ్యం గెలుపు ఓటములు సహజం. 151 ఎమ్మెల్యేలు ఇచ్చి జగన్ ను గెలిపించిన ప్రజలే 2014లో చిత్తుగా ఓడించారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రజలను తిట్టలేదు.నిందించలేదు. ఎందుకు మమ్మల్ని అధికారంలోకి రానీయలేదని అడగలేదు.

పైగా ప్రజల నాడి తెలుసుకునేందుకు.. ఆశీర్వదించాలని ఏకంగా 3వేల కి.మీల పాదయాత్ర చేశాడు. పల్లెపల్లెకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యాడు. ప్రజా సమస్యలపై నిలదీశాడు. అలా ప్రజల్లో ఉన్నాడు కాబట్టే ఓడించిన జగన్ ను అక్కున చేర్చారు. ఏపీ చరిత్రలోనే ఘనవిజయాన్ని కట్టబెట్టారు.

ఇప్పుడు పవన్ మాత్రం తనను ఓడించారని.. అందుకే విశాఖ ఉక్కును రక్షించలేకపోతున్నానని.. బీజేపీని తన వెనుక ఎమ్మెల్యేలు లేరు కాబట్టి నిలదీయలేకపోతున్నానని అనడంపై విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాడి వారిసమస్యలు తీరిస్తేనే అధికారంలోకి వస్తాయి. ప్రజల వెంట నడిచి వారితో మమేకం అయినప్పుడే అది సాధ్యం. కానీ ప్రజలు ఓడించారని తాను సమస్యలు తీర్చడం లేదన్నది కరెక్ట్ కాదని అంటున్నారు. ఓడినప్పుడే ప్రజల వెంట ఉండి.. వారితో కలిసి పోరాడితే పవన్ ను ప్రజలు ఆదరిస్తారని.. గెలిపిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper