Homeకరోనా వైరస్Third Wave: తాజా నివేదిక: ఇంకో మూడు వారాలే.. దేశంలో కరోనా విస్ఫోటనం?

Third Wave: తాజా నివేదిక: ఇంకో మూడు వారాలే.. దేశంలో కరోనా విస్ఫోటనం?

అన్నట్టే జరుగుతోంది.. కరోనా కల్లోలానికి రంగం సిద్ధమవుతోంది. మొదటి వేవ్ నుంచి తప్పించుకున్న భారతదేశానికి రెండో వేవ్ ఎంత వినాశనాన్ని చూపించిందో చూశాం.. ఇప్పుడు మూడో ముప్పు ముంగిట పొంచి ఉన్నాం. తాజాగా అంచనాలన్నీ నిజం అవుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో కేసులు జెట్ స్పీడులా దూసుకెళుతున్నాయి.

భారత్ లో కోవిడ్ మూడోదశ వ్యాప్తి మరో మూడు వారాల్లో గరిష్ట్ర స్థాయికి చేరుతుందని తేలింది. తాజాగా ఎస్.బీఐ చేసిన పరిశోధనలో ఈ అంచనావేసింది. నెలరోజుల నుంచి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. నగరాలతో మొదలై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను సైతం ఈ వ్యాధి చుట్టేస్తోంది. ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని.. వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట్ర స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్.బీఐ తాజా అంచనా..

మొదటి రెండో వేవ్ తోపాటు అమెరికా సహా యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాల్లో పరిశోధించిన ఎస్బీఐ భారత్ లో థర్డ్ వేవ్ అంచనాలు రూపొందించింది. ముంబైలో ఈనెల 7న 20971 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్ లో ఇదే గరిష్ట స్థాయి. ముంబైలో కేసుల సంఖ్య గరిష్టానికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ట స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదికలో పేర్కొంది.

ఇతర దేశాల్లో గరిష్టస్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టింది. మనదేశంలో కేసుల సంఖ్య పెరగడం డిసెంబర్ 29 నుంచి మొదలైంది. ఈనెల 17న 2.38 లక్షల కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16.56 లక్షలకు పెరిగింది.

భారతదేశంలో ఇప్పటికే 64 శాతం జనాభాకు ఇప్పటికే 2 డోసుల టీకా వేయడం పూర్తయ్యింది. టీకాలు తీసుకున్న ప్రజల్లో గ్రామీణులు 83శాతం ఉన్నారు. అందువల్ల చాలా వరకూ ప్రజలకు టీకాతో భద్రత కలిగినట్లు అవుతోంది.

ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, జమ్మూకశ్మర్, అరుణాచల్ ప్రదేశ్ లలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కానీ రెండేవేవ్ లో చేరినంతగా జనాలు ఆస్పత్రి పాలవ్వకపోవడం ఊరటగా చెప్పొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Power Star: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన సినిమా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, యావరేజ్, అట్టర్ ప్లాప్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. పవన్ కల్యాణ్ ప్లాపు సినిమాలు కూడా 50కోట్లు కలెక్ట్ చేస్తుందంటే బాక్సాఫీస్ వద్ద అతడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా కథతో సంబంధం లేకుండా పవన్ కటౌట్ చూడటానికే థియేటర్లకు వచ్చే అభిమానులు ఆయనకు కోట్లల్లో ఉన్నారు. […]

  2. […] Corona Virus:  గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒమిక్రాన్ ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో హిమాలయాలలో ఉన్న ఒక మొక్క కరోనాకు సులభంగా చెక్ పెడుతుందని తేలింది. […]

  3. […] Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించడంతో పాటు అప్రెంటీస్‌ల ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 2422 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. rrccr.com/tradeapp/login వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 17వ తేదీన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular