Home Blog Page 9

మాయమైన అమర్నాథ్ శివుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..

Amarnath Temple
Amarnath Temple

Amarnath Temple: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ శివలింగంపై ఈ ఏడాది కలత పెట్టే దృశ్యం వెలుగులోకి వచ్చింది. మహా శివుడు మిగతా చోట్ల కంటే అమర్ నాథ్ లో మంచు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవదేవుడిని దర్శనం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి ఎన్నో ప్రయాసలు పడి వస్తుంటారు. ఎంత కష్టపడినా…ఇక్కడ మంచులింగం రూపంలో శివుడిని చూసిన తరువాత తమ కష్టాన్ని మరిచిపోతారు. అయితే ఈసారి ఆ శంకరుడి దర్శనభాగ్యం కష్టంగానే ఉండనుంది. ఎందుకంటే ఇక్కడి శివలింగం పూర్తిగా మాయమైపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలోకి రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితె..

పవిత్ర అమర్‌నాథ్ మంచు శివలింగం యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఇదే సమయంలో శివలింగం గురించి చర్చ సాగుతోంది. ఈ శివలింగంను ఆయా తేదీల్లో తీసిన చిత్రాలను రిలీజ్ చేశారు. వీటిలో మే 23, జూన్ 29, జూలై 7 నాటి ఫొటోలున్నాయి.

మే 23న 7 అడుగులు:
మే 23వ తేదీన సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు పవిత్ర గుహకు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ సమయంలో హిమాలయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మంచు లింగం ఎంతో స్పష్టంగా, గంభీరంగా దాదాపు 7 అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చింది. ఈ అద్భుత రూపాన్ని చూసి భక్తులు ఎంతో పులకించిపోయారు.

జూన్ 29: తొలి పూజల నాటికే తగ్గిన పరిమాణం:
అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమై, గుహలో తొలి పూజలు నిర్వహించిన జూన్ 29వ తేదీ నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. తొలి పూజల రోజైన జూన్ 29 నాటి చిత్రంలో శివలింగం ఎత్తు 5 అడుగులకు పడిపోవడం స్పష్టంగా కనిపించింది. కేవలం నెల రోజుల్లోనే రెండు అడుగుల మంచు కరిగిపోవడం ఆందోళన కలిగించింది.

జూలై 7: పూర్తిగా కరిగిపోయిన శివలింగం
యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా, జూలై 7వ తేదీ నాటికి పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. ఆ రోజు తీసిన మూడవ చిత్రంలో శివలింగం ఉన్న స్థానంలో కేవలం ఖాళీ పీఠం మాత్రమే కనిపిస్తోంది. కాశ్మీర్ లోయలో ఈ ఏడాది నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తక్కువ హిమపాతం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

ఉష్ణోగ్రతల పెరుగుదలనే కారణమా?
హిమాలయ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవిలో తీవ్రమైన ఉష్ణగాలులు వీచడం వల్ల మంచు వేగంగా కరిగిపోతోంది. ముఖ్యంగా అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే అధికంగా నమోదవుతున్నాయని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల సహజంగా ఏర్పడే మంచు శివలింగం పరిమాణం తగ్గడం లేదా ముందుగానే కరిగిపోతుందని అంటున్నారు. అమర్‌నాథ్ శివలింగం ఏర్పడటానికి శీతాకాలంలో కురిసే భారీ మంచు కీలకం. అయితే ఇటీవలి కాలంలో మంచు కురిసే పరిమాణం తగ్గడంతో గుహలో పేరుకునే మంచు కూడా తగ్గుతోంది. ఫలితంగా శివలింగం పూర్తిస్థాయిలో ఏర్పడకపోవడం లేదా ఏర్పడినా ఎక్కువకాలం నిలవకపోవడం కనిపిస్తోంది.

మరో పాశుపతాస్త్రం.. ఇండియన్ ఆర్మీనా మజాకా.. మనతో పెట్టుకుంటే మటాషే..

Indian Army
Indian Army

Indian Army: భారత రక్షణ రంగం పాశుపతాస్త్రంను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత శక్తి వంతంగా గుర్తింపు పొందిన ఇడియన్ ఆర్మీ చేతిలోకి ఇది రావడంతో మరింత బలం చేకూరినట్లయింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (Pinaka Long Range Guided Rocket – LRGR) ను విజయవంతంగా పరీక్షించారు. దీంతో భారత సైన్యం దీర్ఘదూర దాడి సామర్థ్యం మరింత బలోపేతమైంది. అయితే ఇది ఎలా తయారైంది? దీని వల్ల సైన్యానికి ఎటువంటి ఉపయోగం?

ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) లో 8, జూలై 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్ నిర్దేశించిన 60 కిలోమీటర్ల కనిష్ఠ దూరాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకుని లక్ష్యాన్ని ఛేదించింది. పరీక్ష సందర్భంగా ప్రయోగించిన పినాకా ఎల్‌ఆర్‌జీఆర్ ముందుగా నిర్దేశించిన మార్గాన్నే అనుసరిస్తూ ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రయాణించింది. చివరికి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తాకింది. రాకెట్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని ఈ పరీక్ష మరోసారి నిరూపించింది.

పినాకా ఎల్‌ఆర్‌జీఆర్‌ను డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. పూణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL)లు ఈ రాకెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. అలాగే హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) గైడెన్స్, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలకు అత్యాధునిక సాంకేతిక సహకారం అందించాయి.

పినాకా ఎల్‌ఆర్‌జీఆర్ సాధారణ రాకెట్ కాదు. ఇది లక్ష్యానికి చేరుకునేంతవరకు తన దిశను సరిచేసుకుంటూ ప్రయాణించే గైడెడ్ రాకెట్. అందువల్ల శత్రు కమాండ్ సెంటర్లు, బంకర్లు, వ్యూహాత్మక స్థావరాలు వంటి కీలక లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. తక్కువ సమయంలో భారీ అగ్నిశక్తిని ప్రదర్శించగల సామర్థ్యం దీనికి ప్రత్యేకత.

ఈ విజయవంతమైన పరీక్షతో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ మరోటి అందుబాటులోకి రానుంది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, యుద్ధ పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందనకు ఈ రాకెట్ కీలకంగా ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత భూసేన అగ్నిశక్తిని మరింత పెంచడంలో పినాకా కీలక పాత్ర పోషించనుంది. ఈ పరీక్ష స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ పరీక్ష మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యానికి ఇది మరింత బలాన్ని చేకూర్చనుంది.

పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ విజయవంతమైన పరీక్షతో భారత్ ఆధునిక రాకెట్ సాంకేతికతలో మరో కీలక అడుగు వేసింది. ఖచ్చితత్వం, దీర్ఘదూర దాడి సామర్థ్యం, స్వదేశీ అభివృద్ధి వంటి అంశాల్లో ఈ వ్యవస్థ భారత రక్షణ రంగానికి కొత్త బలాన్ని అందించనుంది. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హీరోయిన్ కియారా అద్వానీ పై సాయి పల్లవి కౌంటర్ అటాక్.. ముద్దు సన్నివేశాలపై ఘాటు కామెంట్స్..

Sai Pallavi And Kiara Advani
Sai Pallavi And Kiara Advani

Sai Pallavi And Kiara Advani: నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో నటన పరంగా , డ్యాన్స్ పరంగా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమెకు యూత్ ఆడియన్స్ లో మాత్రమే కాదు , ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే అందరి హీరోయిన్స్ లాగా ఈమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టం చూపించదు. చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి రెడీ కానీ , హద్దులు దాటినా రొమాన్స్ కి మాత్రం ఈమె అసలు ఒప్పుకోదు. ఆ చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కూడా, కథ , కంటెంట్ డిమాండ్ చేస్తేనే చేస్తుంది , లేదంటే నో చెప్తుంది. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలాంటి సన్నివేశాలపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ముందుగా రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘డైరెక్టర్స్ మీతో ముద్దు సన్నివేశాలు తీయడానికి ఎందుకు ఆసక్తి చూపించరు?, మిమ్మల్ని ఒక్కసారి కూడా అలాంటి సన్నివేశాల్లో నటించమని వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదట, నిజమేనా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘అవును.. నిజమే .. ఎందుకంటే నేను అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడను అనే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్ మాట్లాడుతూ ‘ఎందుకు , మీరు ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే ఇలాంటి పాలసీ పెట్టుకున్నారా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు , అతని కోసం నేను అలాంటి సన్నివేశాల్లో నటించను. అది నటన అయినా సరే నాకు ఇష్టం ఉండదు. ప్రతీ మనిషి ఇల్లు , కారు , ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని కోరుకుంటారు , నాకు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి , ముద్దు సన్నివేశాల్లో నటించి వాటిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఉన్న వాటిట్లోనే నాకు సంతృప్తి ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

మరి సాయి పల్లవి కి , కియారా అద్వానీ కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు , రీసెంట్ గానే కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ‘టాక్సిక్’ మూవీ మొదటి సాంగ్ విడుదలైంది. ఇందులో ఆమె హీరో యాష్ తో హద్దులు దాటి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఆమెకు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో రీసెంట్ గానే పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా పుట్టింది. అయినప్పటికీ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. కానీ సాయి పల్లవి మాత్రం కాబోయే భర్త గురించి అలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు పరోక్షంగా కియారా అద్వానీ కి కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి మూవీలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఇదే...

Anil Ravipudi And Kalyan Ram
Anil Ravipudi And Kalyan Ram

Anil Ravipudi And Kalyan Ram: అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరిస్తుంది అంటూ మేకర్స్ అయితే క్లారిటి ఇస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారు. తద్వారా ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోబోతుంది అనేది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఇప్పటివరకు 9 విజయాలను సాధించాడు. ఈ సినిమాతో పదో విజయాన్ని సాధించి వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకులలో రాజమౌళి తర్వాత తను మాత్రమే ఉన్నానని చాలా గర్వంగా చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తను అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో తనను తాను చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేసుకోబోతున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి అప్పు ఇచ్చే క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట. వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ఉంటాయని ఇద్దరు బావ బామ్మర్దుల క్యారెక్టర్ లో నటించెబుతున్నారని దానికి తగ్గట్టుగానే ప్రతి సన్నివేశాన్ని కూడా కామెడీతో నింపేసే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నాడట.

యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయని ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని కూడా అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేసి సక్సెస్ ని సాధిస్తాడా? ఆయనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకుంటాడా?

ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ వాళ్లిద్దరి ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మలిచాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో తన సత్తా చాటుకుంటే మాత్రం ఆయన టాప్ డైరెక్టర్ గా మారడమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎక్కువ మంది తో సినిమాలు చేసిన దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకుంటాడు…

అనిల్ రావిపూడి కి ఆ హీరోయిన్ కి మధ్య ఏం జరిగింది...

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో కొంతమంది దర్శకులకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. అందులో అనిల్ రావిపూడి ఒకరు కావడం విశేషం… రాజమౌళి తర్వాత వరుసగా విజయాలను అందుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న పదోవ సినిమాతో సైతం భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అనిల్ రావిపూడి గతంలో ఒక హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేశాడు. దానివల్ల వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. వరుస సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అనిల్ రావిపూడి చేసే సినిమాల్లో క్యారెక్టర్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటానని పలు సందర్భాల్లో ఆయన క్లారిటి ఇచ్చాడు.

మొత్తానికైతే ఆ హీరోయిన్ ని ఇప్పుడు తన సినిమాలో రిపీట్ చేయడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే మెహ్రీన్ కావడం విశేషం… అనిల్ రావిపూడి చేసిన ‘రాజా ది గ్రేట్’, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇక ఆ సమయంలోనే వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదంటూ ఆ తర్వాత పలు సందర్భాల్లో అనిల్ రావిపూడి స్పందించాడు.

ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎవరైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారో తన అ క్యారెక్టర్ కి ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన తన సినిమాలో స్టార్ హీరోయిన్లు పెట్టుకోడు. పెద్దగా ఇమేజ్ లేని హీరోయిన్స్ కి అవకాశాలను ఇస్తూ సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా వాళ్లకి కూడా సక్సెస్ లను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు.

డైరెక్టర్ గా కంటే నటులుగానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న దర్శకులు...

Telugu Directors
Telugu Directors

Telugu Directors: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. దర్శకులు ఈ మధ్యకాలంలో సినిమాలను చేస్తూనే నటులుగా కూడా రాణిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడి గా చేస్తే వాళ్లకు వచ్చే డబ్బుల కంటే కూడా నటులు గా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చాలా మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన డైరెక్టర్ గా సినిమాలను చేయడం పక్కనపెట్టి నటుడిగా రాణించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎందుకని అలా చేస్తున్నాడు మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. కదా బెస్ట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆ కోవలోనే మరిన్ని మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కదా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నప్పటికి ఆయనకు మాత్రం నటనంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన దానిమీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట…

ప్రస్తుతం ఆయన నటుడిగానే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తుండటం విశేషం…ఇక ఆయనలానే కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన వెంకటేష్ మహా సైతం ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా ఆడకపోవడంతో ఆ తర్వాత నటుడిగా రాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు.

ఈ క్రమంలోనే ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాడు. ఇక ఆ సినిమా తర్వాత మిరాయి సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ పాత్రలో నటించడం విశేషం…ఇక కొద్ది రోజుల నుంచి ఆయన ఏ సినిమా ను డైరెక్షన్ చేయకపోవడంతో నటుడిగా చేసినప్పుడు వచ్చిన డబ్బులే అతని సర్వైవల్ కి ఉపయోగపడ్డాయని ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.

ఇక రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘రావు బహుదూర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కించుకుంది… గతంలో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ కూడా డాకూ మహారాజ్ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఇంకొంతమంది దర్శకులు సైతం నటులుగా రాణించే ప్రయత్నాలైతే చేస్తున్నారు…

'లెనిన్' సెన్సార్ పూర్తి అయ్యింది.. సెన్సార్ సభ్యుల టాక్ ఇలా వస్తుందని ఊహించలేదు..

Lenin Censor Review
Lenin Censor Review

Lenin Censor Review: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత , అఖిల్ ఎంతో ప్యాషన్ తో , ఇష్టపడి చేసిన సినిమా ఇది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే , ఇక అక్కినేని అఖిల్ కెరీర్ డేంజర్ లో పడినట్టే. అందుకే ఈ చిత్రానికి నాగార్జున స్పెషల్ కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఆయన చాలా కసరత్తులు చేశారు. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని , కచ్చితంగా కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని నాగార్జున బలంగా నమ్ముతున్నారు. ఆయన లో ఈ రేంజ్ నమ్మకం ఉందంటే కచ్చితంగా ఈ సినిమా అదిరిపోయి ఉంటుందని అందరూ నమ్ముతున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. రేపు విడుదల పెట్టుకొని , ఈరోజు వరకు సెన్సార్ చేయకపోవడం ఏంటి? అని మీకు అనుమానాలు రావొచ్చు. చివరి నిమిషం వరకు నాగార్జున ఫైనల్ కట్ లో కావాల్సిన మార్పులు చేయించడం వల్లే , ఇంత ఆలస్యం అయ్యినట్టు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ జారీ చేశారు. వాళ్ళ నుండి వస్తున్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ ఒక గుండెకాయ లాంటిది అట. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ సాలిడ్ ఎమోషన్స్ ఉన్న సెకండ్ హాఫ్ రాలేదని , కచ్చితంగా అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

ఈ సినిమాలో నటీనటుల నటనకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని , అఖిల్ లో ఈ రేంజ్ యాక్టింగ్ టాలెంట్ ని ఊహించలేదని , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కూడా అదరగొట్టేసిందని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ , పాటలు వంటివి కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచడం లో సక్సెస్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్ , అది వచ్చాక అఖిల్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడుతాడని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

నాకు లాగేస్తుంది.. అది లేకుండా ఉండలేను అంటూ జగపతిబాబు హాట్ కామెంట్స్

Jagapathi Babu
Jagapathi Babu

Jagapathi Babu: ఇకప్పుడు హీరోగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న జగపతి బాబు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో , లేడీస్ లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఈయనే అని అంటుంటారు విశ్లేషకులు. అయితే హీరో గా మార్కెట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాక , ఆయన విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి , సెకండ్ ఇన్నింగ్స్ ని ఏ రేంజ్ లో మొదలు పెట్టారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా , సూపర్ స్టార్స్ తో కలిసి నటిస్తూ , నేటి తరం ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. రీసెంట్ గానే ఆయన ‘పెద్ది’ చిత్రంలో పోషించిన అప్పలసూరి క్యారెక్టర్ కి ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ సినిమాతో జగపతి బాబు 3 వ ఇన్నింగ్స్ మొదలైంది అనే చెప్పాలి. అయితే ఆయన చాలా కాలం తర్వాత హీరో గా నటించిన ‘వదలా ‘ చిత్రం ఈ నెల 17 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది . ఈ చిత్రం లో లయ హీరోయిన్ గా నటించింది. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జగపతి బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా యాంకర్ జగపతి బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ రోజు మీకు కచ్చితంగా కావాల్సింది ఏంటి ?’ అని అడగ్గా , అందుకు జగపతి బాబు క్షణం కూడా ఆలోచించకుండా ‘సిగరెట్’ అని సమాధానం ఇచ్చారు. సిగరెట్ లేనిదే నా రోజు మొదలు అవ్వదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత ‘వదలా’ మూవీ గురించి జగపతి బాబు మాట్లాడుతూ ‘ఈ చిత్రం పూర్తి అయ్యి చాలా రోజులైంది. కానీ ఈ సినిమాకు బిజినెస్ జరగకపోవడం వల్ల విడుదల చేయలేకపోయాం. ఇప్పుడు సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మాత విడుదల చేస్తున్నారు. ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఆదరించాలి’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరోయిన్ ఆమని కోడలు హ్రితిక శ్రీనివాస్ ఇండస్ట్రీ కి పరిచయం కానుంది. ట్రైలర్ ని బట్టీ చూస్తుంటే , ఇందులో ఆమె క్రూరమైన విలన్ క్యారెక్టర్ లో నటించినట్టు అర్థం అవుతోంది. తొలిసినిమాతోనే ఒక సీనియర్ హీరోయిన్ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వస్తూ ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకోవడం సాహసమే. ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

హీరోయిన్ 'శ్రీలీల' ను ఓ రేంజ్ లో ఆడుకున్న నిర్మాత నాగవంశీ..

Naga Vamsi Comments On Sreeleel
Naga Vamsi Comments On Sreeleel

Naga Vamsi Comments On Sreeleel: నిర్మాత నాగవంశీ మీడియా ముందు మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఇతని స్టైల్. దానివల్ల అనేక సమస్యలు వస్తుంటాయి , ఒక్కోసారి ఈయన సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ కి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన లేటెస్ట్ గా హీరోయిన్ శ్రీలీలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రేపు ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘లెనిన్’ మూవీ విడుదల కాబోతుంది. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమాకు అక్కినేని నాగార్జున కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శ్రీలీల గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విషయం ఏమిటంటే , ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని ఎంచుకున్నారు. కొంతభాగం షూటింగ్ కూడా ఆమెపై చేశారు. మొదటి టీజర్ లో మనం శ్రీలీల ని కొన్ని షాట్స్ లో చూడొచ్చు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , కొన్ని రోజుల తర్వాత శ్రీలీల ఈ చిత్రం నుండి తప్పుకుంది. నిన్నటి ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని ఒక రిపోర్టర్ ప్రస్తావిస్తూ ‘ఈ సినిమాకు మొదటి నుండి అన్నీ మంచి పరిణామాలే జరుగుతున్నాయి. కొంతమంది ఈ చిత్రం నుండి తప్పుకోవడం తో చాలా మేలు జరిగింది’ అని అనగా, అందుకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘అంటే మీరు ఇప్పుడు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా ‘ అని సరదాగా కౌంటర్ ఇచ్చారు. అనంతరం నాగవంశీ శ్రీలీల తప్పుకోవడం గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘మంచి సినిమాలకు అన్నీ మంచే జరుగుతుంది. మా సినిమాకు కూడా అలాగే జరిగింది. కేవలం డేట్లు సర్దుబాటు అవ్వకపోవడం వల్లే ఈ చిత్రం నుండి శ్రీలీల తప్పుకుంది. అంతకు మించి వేరే కారణం లేదు. మొన్ననే ఈ చిత్రాన్ని చూశాను , భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది, ఈ పాత్ర ఆమె తప్ప మరో హీరోయిన్ చెయ్యలేరని అనిపించింది’ అంటూ నాగవంశీ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలీల ఈమధ్య కాలం లో చేస్తున్న ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఆ కారణం చేత ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరొచ్చింది. నాగవంశీ ఈ సినిమాకు అంతా మంచే జరిగింది అంటున్నారంటే శ్రీలీల ని ఐరన్ లెగ్ అని ప్రస్తావించినట్టే కాదు , ఇలా ఒక హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ తో మూడో టి20.. తెలుగోడికి చోటు కష్టమే.. ఇదీ గౌతమ్ గంభీర్ మార్క్ పక్షపాతం

India vs England 3rd T20
India vs England 3rd T20

India vs England 3rd T20: ఇప్పటికే రెండు టి20 లను టీమిండియా కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో గెలుపుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. బౌలింగ్ లోపం వల్ల ఓడిపోయింది. మూడో మ్యాచ్లో సమిష్టి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్ లోపం టీమిండియాను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది. గురువారం జరిగే మ్యాచ్లో గనుక విజయం సాధిస్తే ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంటుంది. అది జరగొద్దు అనుకుంటే టీమిండియా గురువారం జరిగే మ్యాచ్లో గెలవాలి.

ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా వరుసగా రెండు మ్యాచ్లు కోల్పోయింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఇలా ఆడుతుందని ఎవరు అంచనా వేయలేదు. 2024 లో టి20 పొట్టి సమరంలో గెలిచిన తర్వాత టీమ్ ఇండియా జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మ్యాచులు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. అంతే కాదు 2024 పొట్టి ప్రపంచ కప్ గెలిచిన నాటినుంచి మొన్నటి 2026 t20 వరల్డ్ కప్ గెలిచే వరకు టీం ఇండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనామక జట్టు మీద టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ గడ్డమీద వరుస ఓటములు ఎదుర్కొంటున్నది.

ఈ పరిస్థితి మారాలంటే టీమిండియాలో ప్రక్షాళన జరగాలి. కాకపోతే దానిని పక్కనపెట్టి కోచ్ గౌతమ్ గంభీర్ తన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మీద మూడో మ్యాచ్లో వేటు వేశాడు. అతని స్థానంలో సంజు శాంసన్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి మూడో మ్యాచ్లో తిలక్ వర్మ తేలిపోయాడు. ఐర్లాండ్ సిరీస్ లో కూడా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అతని ఆట తీరు మారడం లేదు. అలాగని మిగతా ప్లేయర్లు గొప్పగా ఆడుతున్నారని కాదు. హర్షిత్ రానా అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు. బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదు. కానీ అతడిని కొనసాగించి తిలక్ వర్మను జట్టుకు దూరం చేయడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి. తిలక్ గౌతమ్ కక్ష కట్టాడని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

ఇటీవల రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా దారుణమైన ఓటమిని మూట కట్టుకున్న తర్వాత గౌతమ్.. తిలక్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళుతుండగా అభిమానులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. వి వాంట్ సంజు బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. తిలక్ వర్మ సరిగా ఆడలేక పోవడం.. అవకాశాలు ఇచ్చినప్పటికీ సరిగ్గా వినియోగించుకోలేకపోవడంతో అతడి స్థానంలో సంజు శాంసన్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.. అయితే సంజూ కూడా ఇటీవల కాలంలో గొప్పగా ఆడిన దాఖలాలు లేవు. అందువల్లే అతడిని మూడో మ్యాచ్ కి దూరం పెట్టారు. చివరికి వైభవ్ సూర్య వంశీ కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. మూడో మ్యాచ్లో నైనా టీమిండియా గాడిలో పడుతుందా.. విజయం సాధిస్తుందా.. చూడాల్సి ఉంది.

యూ ట్యూబర్ రావణ్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..

YouTuber Ravan
YouTuber Ravan

YouTuber Ravan: ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన యూట్యూబర్ రావణ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అతడి నిజ వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయి. ఆయన కేవలం ప్రశ్నించడానికి మాత్రమే ఛానల్ పెట్టుకున్నానని చెప్పిన ఆయన.. ప్రశ్నను పక్కనపెట్టి కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. నారా లోకేష్.. ఇతర వ్యక్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్.. ఇతర సోషల్ మీడియా మాధ్యమాలను వాడుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ రావణ్ ఒక వర్గాన్ని తీవ్రంగా విమర్శించారనే అభియోగాలు ఉన్నాయి.

రావణ్ హిందువుల మీద.. హిందూ దేవుళ్ళ మీద.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ఇష్టానుసారంగా మాట్లాడారు. హిందువుల పండుగల మీద పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా హిందువుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించాయి. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆయన సంఘీభావంగా మాట్లాడారు. దేశాన్ని ప్రేమించనని.. బాహటం గానే చెప్పేశారు. పైగా మావోయిస్టు నేత హిడ్మా మీద సానుకూల వ్యాఖ్యలు చేశారు. యువత పోరాటాలు చేయాలని.. సాయుదులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా రావణ్ యూట్యూబ్ వీడియోలలో కనిపించాయి. దీంతో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు.

రావణ్ కేసులు విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రావణ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు నిలుపుదల చేశారు. ప్రశ్న అనే వెబ్సైట్ ద్వారా అతడు నెలకు 1.50 లక్షలు సంపాదిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రావణ్ ఫోన్ నుంచి వాట్సప్ చాట్ రికవరీ చేశారు. అందులో నుంచి కీలక విషయాలు వెలుగు చూసాయి.. అయితే ఇతడి వెనుక ఎవరి హస్తముంది.. ఎవరు ఇతడితో ఆ పని చేస్తున్నారు.. వారి లక్ష్యం ఏమిటి అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ మీద.. సనాతన ధర్మం మీద రావణ్ ఇష్టానుసారంగా మాట్లాడారు. జనసేన నాయకులు అనక పోలీస్ స్టేషన్లో రావడం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

ఆర్తి అగర్వాల్' మరణం వెనుక అసలు రహస్యం ఇదేనా.. ఆమె చేసిన 5 తప్పులు ఇవే..

Aarthi Agarwal
Aarthi Agarwal

Aarthi Agarwal: తెలుగు ఆడియన్స్ చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ హీరోయిన్స్ లో ఒకరు ఆర్తి అగర్వాల్. ఈమెని చూస్తే మన ఇంట్లోని అమ్మాయి లాగానే అనిపిస్తుంది. ఆరోజుల్లో యూత్ ఆడియన్స్ తో పాటు , ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈమెని ఎంతగానో ఇష్టపడేవారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత నువ్వు లేక నేను లేను , ఇంద్ర, నీ స్నేహం, వసంతం, నేనున్నాను , సంక్రాంతి , అందాల రాముడు , గోరింటాకు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే కొత్త హీరోయిన్స్ రాకతో , బాగా లావు అవ్వడంతో ఆర్తి అగర్వాల్ కి నెమ్మదిగా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. సినిమా అవకాశాల కోసం తన శరీరాన్ని తగ్గించుకునే క్రమంలో లైపో సర్జరీ చేయించుకుంది. అది వికటించడం తో ప్రాణాలను కోల్పోయింది ఆర్తి అగర్వాల్.

అయితే ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కేవలం లైపో సర్జరీ వికటించడం మాత్రమే కాదు , ఆమె వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని ఆమె కెరీర్ పై ప్రభావం చూపించాయి , తద్వారా ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడి కారణంగానే సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఎలా అయినా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలనే తపనతో తొందరగా శరీరాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం ఆమె ప్రాణాలు తీసింది. ఇంతకీ ఆమె కెరీర్ పై ప్రభావం చూపించిన వ్యక్తిగత కారణం హీరో తరుణ్ ని ఈమె పిచ్చిగా ప్రేమించడం. ఈ లవ్ బ్రేక్ అవ్వడం తో ఈమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటి నుండే పీక్ రేంజ్ లో వెళ్తున్న ఆమె కెరీర్ నెమ్మదించింది. రెండేళ్ల పాటు సినిమా కెరీర్ కి బ్రేక్ ఇచ్చి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

కానీ రీ ఎంట్రీ ఆమెకు అసలు కలిసి రాలేదు. ఈ రీ ఎంట్రీ సమయం లోనే ఆమె ఉజ్జ్వల్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల 2009 లో అతనితో విడాకులు తీసుకుంది. ఇది ఆమె మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి అయ్యేందుకు మూడవ కారణం. ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉండుంటే ఈరోజు ఆర్తి అగర్వాల్ త్రిష , నయనతార రేంజ్ లో హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉండేదేమో. తొందరపాటు నిర్ణయాల కారణంగా 31 ఏళ్ళ వయస్సులోనే ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్తి అగర్వాల్ లేని లోటు ఇప్పటికీ టాలీవుడ్ లో స్పష్టంగానే కనిపిస్తోంది. ఆమెని రీ ప్లేస్ చేసే హీరోయిన్ మరొకరు ఇప్పటి వరకు రాలేదు.

ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ స్కెచ్..ఇలా బయటపడింది..

Donald Trump
Donald Trump

Donald Trump: ఇరాన్ మీద ట్రంప్ కు ఎందుకంత కోపం. ఇరాన్ అంటేనే ట్రంప్ ఎందుకంత మండి పడుతున్నారు.. ఆ స్థాయిలో ఆగ్రహాన్ని ఎందుకు చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ దేశం మీద కూడా ట్రంప్ ఈ స్థాయిలో కోపాన్ని చూపించడం లేదు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం లేదు. తన ఆవేశాన్ని వెళ్ళగక్కడం లేదు. యూఎస్ ప్రెసిడెంట్ ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇలా చేయడం వెనక కారణమేంటి.. గ్లోబల్ మీడియాలో వస్తున్న కథనాలు ట్రంప్ లో ఉన్న మరో కోణాన్ని.. ఇరాన్ మీద ఆయనకు ఉన్న అసలు కోపాన్ని బయటపెడుతున్నాయి.

ట్రంప్ ఇటీవల కాలంలో ఇరాన్ దేశానికి ప్రతిరోజు దీపావళి పండుగ చూపించారు. విపరీతంగా బాంబులు వేశారు. మిస్సైల్స్ కురిపించారు. అనేక ప్రాంతాలను ధ్వంసం చేశారు. వేలాదిమందిని చంపేశారు. ఇరాన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. ఇంకా చెప్పాలంటే ఇరాన్ దేశానికి ఎన్ని విధాలుగా చుక్కలు చూపించాలో.. అన్ని విధాలుగా చూపించేశారు. ఇంత చేసినప్పటికీ ట్రంప్ కోపం తగ్గడం లేదు. ఆయన ఆవేశం చల్లారడం లేదు. ఇరాన్ మీద ఆయన తన కోపాన్ని చూపిస్తూనే ఉన్నారు. మండిపడుతూనే ఉన్నారు. తాజాగా కూడా బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇరాన్ మీద ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక కారణం ఉంది. ఇరాన్ సుప్రీమ్ ను అమెరికా దళాలు చంపేశాయి. ఆ తర్వాత అదును కోసం ఇలా ఎదురుచూస్తోంది. ఈ క్షణమైనా సరే ట్రంప్ ను లేపేయాలని భావిస్తోంది. అందువల్లే ట్రంప్ ఇటీవల తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించకుండా. దానికి బదులుగా వేరే విమానాన్ని ఎంచుకున్నారు. ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ స్కెచ్ వేసింది. అందుకే ట్రంప్ వేరే విమానంలో ప్రయాణించారు. వేగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రంప్ భద్రతా అధికారులు ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన వెంటనే వేరే విమానంలోకి మారిపోయారు.

దీనిపై ఒక విలేకరి ప్రశ్నించగా..”నేను ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నాను. అందువల్లే వేరే విమానంలో ప్రయాణించాను. ఇరాన్ చంపాలనుకుంటున్న వ్యక్తుల జాబితాలో నేను మొదటి స్థానంలో ఉన్నాను. కానీ నిన్ను దానిని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను పని చేసుకుంటున్నాను. నా పనిని నేను ఉత్తమంగా చేస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు. నన్ను చంపాలనుకుంటున్న వాళ్లకు కూడా తెలుసు” అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఈ విషయం మీద తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆయన చెబుతున్నారు.
image.png

బుచ్చి బాబు తో అఖిల్ కొత్త సినిమా.. ఈసారి ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడంటే!

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ చిత్రం తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా బుచ్చి బాబు , మొదటి సినిమాతోనే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఏకంగా రామ్ చరణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో ‘పెద్ది’ చిత్రం చేసే అరుదైన అదృష్టం కలిగింది. అంత పెద్ద సూపర్ స్టార్ ని బుచ్చి బాబు హ్యాండిల్ చేయగలరా?, ఈయన కూడా డైరెక్టర్ మారుతీ లాగా చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘పెద్ది’ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా తెరకెక్కించారు. ‘గేమ్ చేంజర్ ‘ తో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న రామ్ చరణ్ కి , ‘పెద్ది’ ద్వారా 350 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ కి తీసుకొచ్చారు.

అంతే కాదు రామ్ చరణ్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా కొట్టేశారు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఒక ప్రముఖ నిర్మాతతో బుచ్చి బాబు కి అడ్వాన్స్ కూడా ఇప్పించారట రామ్ చరణ్. ఇది కాసేపు పక్కన పెడితే , ఇప్పుడు బుచ్చి బాబు కి మరో ప్రాజెక్ట్ కూడా లాక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేయాల్సిందిగా స్వయంగా అక్కినేని నాగార్జున బుచ్చి బాబు ని అడిగారట. అందుకు బుచ్చి బాబు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే అఖిల్ ని కలిసి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని వినిపించే పనిలో ఉన్నారట బుచ్చి బాబు. మొదటి మూవీ లవ్ స్టోరీ జానర్ , 2 వ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ జానర్, ఇప్పుడు అఖిల్ తో చేయబోయే సినిమా మైథలాజికల్ టచ్ ఉన్న జానర్ అట.

‘పెద్ది’ తర్వాత ఆయన తదుపరి చిత్రం ఇదే కావొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ మరో రెండేళ్ల వరకు సుకుమార్ మూవీ తో ఫుల్ బిజీ గా ఉంటారు. ఈ రెండేళ్ల గ్యాప్ లో బుచ్చి బాబు ఖాళీగా అయితే ఉండలేరు కదా, అందుకే అఖిల్ తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మరో పక్క బుచ్చి బాబు మహేష్ బాబు తో కూడా ఒక సినిమాని రీసెంట్ గానే ఫైనల్ చేసుకున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో బుచ్చి బాబు పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అఖిల్ తో చేయబోయే సినిమా కూడా ఆయన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగుతుందో లేదో చూడాలి.

70 ఏళ్ళ వయస్సు లో 12 గంటలు వర్షం లో నాన్ స్టాప్ గా తడిసిన చిరంజీవి.. ఇదేమి కసి బాబోయ్..

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: జీవితం లో పైకి ఎదగాలని అనుకునే వాళ్లకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఆదర్శం అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాదు వయస్సు పెరిగిపోయింది , ఇక మన పరిమితి ని తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్లకు కూడా మెగా స్టార్ చిరంజీవి ఒక గొప్ప ఆదర్శప్రాయులు. ఆయన వయస్సు ప్రస్తుతానికి 70 ఏళ్ళు. ఈ వయస్సులో కూడా ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలు చేయడమే కాదు , ఈ వయస్సులో కూడా ఆయన ఫైట్స్ , డ్యాన్స్ చేస్తూ వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అవలీలగా కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రీసెంట్ గా షూట్ చేసిన ఒక సందర్భాన్ని చెప్తే ఈ వయస్సులోనే చిరంజీవి ఇంత కష్టపడితే, మనం ఎంత కష్టపడాలి , ఎంత కసిగా పనిచేయాలి అనేది అర్థం చేసుకుంటారు. ఈ చిత్రం లో కీలకంగా వచ్చే ఒక వర్షన్ ఫైట్ సన్నివేశం ఉంటుందట. ఈ సన్నివేశాన్ని దాదాపుగా 12 గంటల పాటు చిత్రీకరించారట. చిరంజీవి 70 ఏళ్ళ వయస్సులో ఎలాంటి డూప్ ని వాడకుండా, 12 గంటలు స్వయంగా షూటింగ్ చేశారట. కాసేపు వర్షం లో తడిస్తేనే ఏ రోగం వస్తుందో బాబోయ్ అని ఇంట్లోనే కూర్చుంటాం మనం , అలాంటిది చిరంజీవి పని కోసం ఇంత డేడికేట్ గా ఈ వయస్సు లో కూడా కష్టపడడం చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఈ వయస్సులో ఆయనకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి?.

కొడుకు ఈ జనరేషన్ లో పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి , సంతోషంగా మనవడు మానవరాళ్లతో ఆడుకుంటూ చిరంజీవి ఇంట్లో సమయం గడిపేయొచ్చు. కానీ పని అంటే పిచ్చి ఉన్న చిరంజీవి ఆ పని చేయడం లేదు , పని లేకపోతే నాకు పిచ్చెక్కిపోతాది , అందుకే సినిమాలు చేస్తున్నాను అని రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. పని ని ఆ విధంగా ఇష్టపడుతున్నారు కాబట్టే , ఈ వయస్సులో కూడా ఎంటర్టైన్ చేస్తూ అవలీలగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతున్నారు మెగాస్టార్. ఇలా ప్రతీ రంగం లోనూ పని చేసే యువత కష్టపడితే , జీవితం లో ఎవ్వరూ అందుకోలేనంత స్థాయికి ఎదుగుతారని సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా, రష్యా తర్వాత భారత్.. చైనాకు ఇది ఊహించని ఎదురు దెబ్బ..

India Defence Ranking
India Defence Ranking

India Defence Ranking: వాస్తవానికి ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉంది. తర్వాత స్థానంలో చైనా ఉంది. రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ జాబితాలో ఇండియా వచ్చి చేరింది. ఆర్థికంగా బలోపేతమైన స్థానంలో ఉంది. ఇప్పుడు డిఫెన్స్ రంగంలో కూడా భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఏకంగా చైనా కు దిమ్మ తిరిగే విధంగా షాకిచ్చింది.

కొంతకాలం గా డిఫెన్స్ రంగంలో భారత్ అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తోంది. కొత్త కొత్త ఆయుధాలను రూపొందిస్తుంది. వివిధ దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నది. తన ఆయుధ శక్తిని ఇటీవల కాలంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రదర్శించింది. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసింది. ఖచ్చితమైన లక్ష్యాల మీద దాడులు చేసి భారత్ తన స్థాయిని నిరూపించుకుంది. అయితే ఇక్కడితోనే భారత్ ఆగిపోవడం లేదు. ఏకంగా ప్రపంచ ఆయుధ శక్తులుగా వెలుగొందుతున్న అమెరికా, రష్యా తర్వాత భారత్ స్థానాన్ని సంపాదించుకుంది.

భారతస్థాయిని డబ్ల్యూడిఎంఎంఏ సంస్థ తన వార్షిక ర్యాంకింగ్ ల ద్వారా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉండడం విశేషం. ఆధునికీకరణ.. లాజిస్టికల్ మద్దతు.. పరస్పరంగా చేసే దాడులు.. రక్షణ సామర్థ్యాలు వంటి ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చింది. ప్రత్యేకమైన మిషన్, ప్రత్యేకమైన బాంబర్ దళం, సిఏఎస్ శిక్షణ.. వంటి వాటిని డబ్ల్యూ డి ఎం ఎం ఏ పరిధిలోకి తీసుకుంది. ఇందులో అత్యధికంగా టీవీఆర్ స్కోర్ 242.9. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సాధించింది. ఆ తర్వాత స్థానంలో రష్యా ఉంది. రష్యా తర్వాత భారత్ కొనసాగుతోంది.

టీవీఆర్ రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 242.9 పాయింట్లు తో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ నేవీ విభాగం కొనసాగుతోంది. నేవీ విభాగానికి 142.4 టీవీఆర్ రేటింగ్ ఉంది. తర్వాత స్థానంలో 114.2రేటింగ్ తో రష్యన్ వైమానిక దళం కొనసాగుతోంది.. 112.6 టీవీఆర్ రేటింగ్ తో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కొనసాగుతోంది. 85.3 టీవీఆర్ రేటింగ్ తో యునైటెడ్ స్టేట్స్ మెరైన్స్ కొనసాగుతోంది. భారత వైమానిక దళం 64.9 టివిఆర్ రేటింగ్ తో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.. వాస్తవానికి దేశాల ప్రకారం చూసుకుంటే అమెరికా మొదటి స్థానంలో.. రష్యా రెండవ స్థానంలో.. ఇండియా మూడో స్థానంలో ఉంది. 63.8 టివిఆర్ రేటింగ్ తో చైనా నాలుగో స్థానంలో.. ర్యాంకు పరంగా ఏడవ స్థానంలో ఉంది.

కొంతకాలంగా డిఫెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ను పూర్తిగా ఆధునికరిస్తోంది. కొత్త కొత్త ఆయుధాలను.. యుద్ధ విమానాలను.. మిస్సైల్స్ ను తయారు చేస్తోంది. అందువల్లే ఇండియా మూడో స్థానంలో ఉంది. ఇదే రేంజ్ గనక కొనసాగిస్తే భారత్ రష్యా స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని డిఫెన్స్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన 'పెద్ది'.. కానీ థియేటర్ లో చూపించిన సినిమా ఇది కాదే !

Peddi OTT
Peddi OTT

Peddi OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచానాల నడుమ విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో దాదాపుగా అన్ని సెంటర్స్ లోనూ రన్ ని పూర్తి చేసుకుంది. దీంతో నిన్న అర్థరాత్రి నుండి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు , తమిళం , మాయలయం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ విడుదల అయ్యేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందట. అయితే ఓటీటీ లో విడుదలయ్యాక ఈ సినిమాని చూసిన రిపీట్ ఆడియన్స్ షాక్ కి గురి అవుతున్నారు. ఇదేంటి థియేటర్ లో మాకు వేరే ప్రింట్ వేశారు , ఈ సన్నివేశాలు థియేటర్ లో చూసినప్పుడు లేవే అంటూ కామెంట్స్ చేశారు.

అంటే థియేటర్ లో చూడని కొన్ని కొత్త సన్నివేశాలతో పాటు , విడుదల కొత్తల్లో ఈ సినిమాపై తీవ్రమైన నెగెటివిటీ , వివాదాలు క్రియేట్ చేసిన కొన్ని సన్నివేశాలను , డైలాగ్స్ ని కట్ చేసారని అంటున్నారు ఫ్యాన్స్. థియేటర్స్ కి అంటే సెన్సార్ కావాలి కానీ , ఓటీటీ కి అసలు అవసరం లేదు, ఇష్టమొచ్చినట్టు డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టుకోవచ్చు , నేరుగా బూతులు మాట్లాడిన డైలాగ్స్ కూడా పెట్టొచ్చు , అలాంటి ఓటీటీ లో ఈ ఎడిటెడ్ వెర్షన్ అవసరమా ? అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. థియేటర్స్ లో ఈ చిత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడు 3 వ వారం లో కొత్త సన్నివేశాలను జత చేశారు. కానీ అప్పటికే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించేశారు.

మూడవ వారం లో రిపీట్ గా చూసినవాళ్లకు , అదే విధంగా కొత్తగా మూడవ వారం లో చూసిన వాళ్లకు మాత్రమే , ఈ ఓటీటీ వెర్షన్ అర్థం అవుతుంది. అలా కాకుండా థియేటర్ లో కేవలం మొదటి రోజు చూసి , ఆ తర్వాత రిపీట్ గా వేళ్ళని ఆడియన్స్ కి మాత్రం , ఇదేంటి.. థియేటర్ లో మాకు చూపించిన సినిమా ఇది కాదే అని అనిపించక తప్పదు. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది దసరా నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.