Amarnath Temple: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ శివలింగంపై ఈ ఏడాది కలత పెట్టే దృశ్యం వెలుగులోకి వచ్చింది. మహా శివుడు మిగతా చోట్ల కంటే అమర్ నాథ్ లో మంచు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవదేవుడిని దర్శనం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి ఎన్నో ప్రయాసలు పడి వస్తుంటారు. ఎంత కష్టపడినా…ఇక్కడ మంచులింగం రూపంలో శివుడిని చూసిన తరువాత తమ కష్టాన్ని మరిచిపోతారు. అయితే ఈసారి ఆ శంకరుడి దర్శనభాగ్యం కష్టంగానే ఉండనుంది. ఎందుకంటే ఇక్కడి శివలింగం పూర్తిగా మాయమైపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలోకి రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితె..
పవిత్ర అమర్నాథ్ మంచు శివలింగం యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఇదే సమయంలో శివలింగం గురించి చర్చ సాగుతోంది. ఈ శివలింగంను ఆయా తేదీల్లో తీసిన చిత్రాలను రిలీజ్ చేశారు. వీటిలో మే 23, జూన్ 29, జూలై 7 నాటి ఫొటోలున్నాయి.
మే 23న 7 అడుగులు:
మే 23వ తేదీన సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు పవిత్ర గుహకు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ సమయంలో హిమాలయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మంచు లింగం ఎంతో స్పష్టంగా, గంభీరంగా దాదాపు 7 అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చింది. ఈ అద్భుత రూపాన్ని చూసి భక్తులు ఎంతో పులకించిపోయారు.
జూన్ 29: తొలి పూజల నాటికే తగ్గిన పరిమాణం:
అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమై, గుహలో తొలి పూజలు నిర్వహించిన జూన్ 29వ తేదీ నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. తొలి పూజల రోజైన జూన్ 29 నాటి చిత్రంలో శివలింగం ఎత్తు 5 అడుగులకు పడిపోవడం స్పష్టంగా కనిపించింది. కేవలం నెల రోజుల్లోనే రెండు అడుగుల మంచు కరిగిపోవడం ఆందోళన కలిగించింది.
జూలై 7: పూర్తిగా కరిగిపోయిన శివలింగం
యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా, జూలై 7వ తేదీ నాటికి పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. ఆ రోజు తీసిన మూడవ చిత్రంలో శివలింగం ఉన్న స్థానంలో కేవలం ఖాళీ పీఠం మాత్రమే కనిపిస్తోంది. కాశ్మీర్ లోయలో ఈ ఏడాది నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తక్కువ హిమపాతం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
ఉష్ణోగ్రతల పెరుగుదలనే కారణమా?
హిమాలయ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవిలో తీవ్రమైన ఉష్ణగాలులు వీచడం వల్ల మంచు వేగంగా కరిగిపోతోంది. ముఖ్యంగా అమర్నాథ్ గుహ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే అధికంగా నమోదవుతున్నాయని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల సహజంగా ఏర్పడే మంచు శివలింగం పరిమాణం తగ్గడం లేదా ముందుగానే కరిగిపోతుందని అంటున్నారు. అమర్నాథ్ శివలింగం ఏర్పడటానికి శీతాకాలంలో కురిసే భారీ మంచు కీలకం. అయితే ఇటీవలి కాలంలో మంచు కురిసే పరిమాణం తగ్గడంతో గుహలో పేరుకునే మంచు కూడా తగ్గుతోంది. ఫలితంగా శివలింగం పూర్తిస్థాయిలో ఏర్పడకపోవడం లేదా ఏర్పడినా ఎక్కువకాలం నిలవకపోవడం కనిపిస్తోంది.
















హీరోయిన్ కియారా అద్వానీ పై సాయి పల్లవి కౌంటర్ అటాక్.. ముద్దు సన్నివేశాలపై ఘాటు కామెంట్స్..
Sai Pallavi And Kiara Advani: నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో నటన పరంగా , డ్యాన్స్ పరంగా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమెకు యూత్ ఆడియన్స్ లో మాత్రమే కాదు , ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే అందరి హీరోయిన్స్ లాగా ఈమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టం చూపించదు. చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి రెడీ కానీ , హద్దులు దాటినా రొమాన్స్ కి మాత్రం ఈమె అసలు ఒప్పుకోదు. ఆ చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కూడా, కథ , కంటెంట్ డిమాండ్ చేస్తేనే చేస్తుంది , లేదంటే నో చెప్తుంది. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలాంటి సన్నివేశాలపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ముందుగా రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘డైరెక్టర్స్ మీతో ముద్దు సన్నివేశాలు తీయడానికి ఎందుకు ఆసక్తి చూపించరు?, మిమ్మల్ని ఒక్కసారి కూడా అలాంటి సన్నివేశాల్లో నటించమని వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదట, నిజమేనా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘అవును.. నిజమే .. ఎందుకంటే నేను అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడను అనే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్ మాట్లాడుతూ ‘ఎందుకు , మీరు ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే ఇలాంటి పాలసీ పెట్టుకున్నారా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు , అతని కోసం నేను అలాంటి సన్నివేశాల్లో నటించను. అది నటన అయినా సరే నాకు ఇష్టం ఉండదు. ప్రతీ మనిషి ఇల్లు , కారు , ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని కోరుకుంటారు , నాకు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి , ముద్దు సన్నివేశాల్లో నటించి వాటిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఉన్న వాటిట్లోనే నాకు సంతృప్తి ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
మరి సాయి పల్లవి కి , కియారా అద్వానీ కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు , రీసెంట్ గానే కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ‘టాక్సిక్’ మూవీ మొదటి సాంగ్ విడుదలైంది. ఇందులో ఆమె హీరో యాష్ తో హద్దులు దాటి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఆమెకు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో రీసెంట్ గానే పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా పుట్టింది. అయినప్పటికీ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. కానీ సాయి పల్లవి మాత్రం కాబోయే భర్త గురించి అలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు పరోక్షంగా కియారా అద్వానీ కి కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.