Peddi movie hype down: ఎంతటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా సరే, మేకర్స్ సరైన ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లకపోతే, అందుకోవాల్సిన టార్గెట్ ని చేరుకోలేము అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి , ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా మరో ఉదాహరణగా మారనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకసారి కాదు , రెండు సార్లు కాదు , ఏకంగా మూడు సార్లు వాయిదా వేశారు. ఆ కారణం చేత ఈ సినిమా పై ఉన్న బజ్ బాగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి, అందులో ‘చికిరి చికిరి’ పాటకు సెన్సేషనల్ రీచ్ వచ్చింది. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు యూట్యూబ్ లో 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా అద్భుతమైన రీచ్ వచ్చింది. ఇక మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని అద్భుతమైన కంటెంట్లు ఈ చిత్రం నుండి వచ్చాయి కాబట్టి, ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి మూడు రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇది కచ్చితంగా మంచి ట్రెండ్ కాదు అనే చెప్పాలి. ఇదే రేంజ్ హైప్ ఉన్న ఓజీ, దేవర, కల్కి లాంటి చిత్రాలకు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. పెద్ది కి ఆ స్థాయి ఉంటుందని అనుకుంటే చాలా నార్మల్ గానే ఉన్నాయి.
ఇది అభిమానులను కాస్త కలవరపెడుతున్న విషయం. సినిమా కి హైప్ ఉంటే ఇలా ఉండదని , మూవీ టీం వరుసగా మూడు సార్లు వాయిదా వెయ్యడం వల్లే, ఈ చిత్రం పై ఉన్న హైప్ మొత్తం దెబ్బ తినిందని , ట్రెండ్ ఇలాగే కొనసాగితే 1 మిలియన్ కూడా ప్రీమియర్స్ నుండి రాబట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ‘రాజా సాబ్’ ని కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారని, చివరి పది రోజుల్లో ఆ చిత్రానికి దిమ్మ తిరిగే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయని , కాబట్టి చివరి పది రోజుల్లో ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదని , కచ్చితంగా 2 మిలియన్ డాలర్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
















నా కెరీర్ మొత్తం కష్టాల్లోకి వెళ్ళిపోయింది అంటూ హీరోయిన్ కియారా అద్వానీ హాట్ కామెంట్స్
Kiara Advani career struggles: సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ‘ఏం ఎస్ ధోని’ బయోపిక్ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ చిత్రం చేయగా, అది కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. టాలీవుడ్ ఈమెకు అంతగా కలిసి రాలేదు కానీ , బాలీవుడ్ లో మాత్రం వరుస సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయింది.
ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన మొదటి సినిమా అనుభవాన్ని చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఫుగ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ కారణం చేత నేను కోరుకున్న గుర్తింపు రాలేదు. ఆ చిత్రం తర్వాత నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను, కానీ నన్ను రిజెక్ట్ చేసేవారు. అలాంటి సమయం లో MS ధోని బయోపిక్ లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. కబీర్ సింగ్ చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పింది. ఇప్పుడు టాప్ స్థాయిలో కొనసాగుతున్నాను. జీవితం లో ప్రతీ ఒక్కరికి ఇలాగే కష్టాలు వస్తుంటాయి, వాటిని సమర్థవతంగా ఎదురుకొని నిలబడినప్పుడే విజయం దక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.
ఇకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు , ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది . ఈ చిత్రం లో కియారా అద్వానీ నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించిందని టాక్. ఆమె నటన చాలా బోల్డ్ గా ఉంటుందని , ముఖ్యంగా యాష్ తో చేసిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు వేరే లెవెల్ లో వచ్చాయని అంటున్నారు.