People charging phones from transformer: విద్యుత్ ను తయారు చేసింది విలియం గిల్బర్ట్.. అతడు ఒకవేళ బతికి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కిందపడి గిలగిలా కొట్టుకునేవాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అటువంటిది కాబట్టి. కరెంటుతో ఎవరైనా సరే విద్యుత్ దీపాలు వెలిగించుకుంటారు. అనేక రకాల పనులు చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రపంచం మొత్తం నోరు వెళ్ళబెట్టే విధంగా.. ఆశ్చర్యంతో చూసే విధంగా.. ఓరయ్య మీకో దండం.. ఆపండ్రా బాబు అన్నట్టుగా పనిచేశారు.
అది బీహార్ రాష్ట్రం. ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోకి కరెంటు సరఫరా సరిగా అవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కరెంటు వచ్చినప్పటికీ .. కొద్దిసేపు మాత్రమే ఉంటోంది. అక్కడ సరఫరాలో నిరంతరం సమస్యలు ఉండడంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది పెరిగిపోయింది. కరెంటు ఉన్నతసేపు ఫోన్ లను చార్జింగ్ పెడుతున్నారు అక్కడి యువకులు. కరెంటు పోతే వారి కష్టాలు మామూలుగా ఉండడం లేదు. అందువల్లే ఒక పని చేశారు.
వారి గ్రామానికి కొంత దూరంలో ఉన్న మరో ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లారు. అక్కడ చిన్నపాటి రెండు తీగలను ఏర్పాటు చేశారు. వాటిని సాకెట్ మాదిరిగా అమర్చారు. అలా అనేక కనెక్షన్లు రూపొందించారు. అక్కడ తమ ఫోన్ లను చార్జింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 50 నుంచి 100 వరకు ఫోన్లు అక్కడ నిత్యం చార్జ్ అవుతూనే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లడమే ప్రమాదకరం అనుకుంటే.. బీహార్ యువకులు ఏకంగా చార్జింగ్ కోసం సాకెట్ ఏర్పాటు చేసి.. దానిని రకరకాలుగా మార్చేశారు.
బీహార్ యువకులు ఫోన్లను చార్జింగ్ పెడుతున్న తీరును కొంతమంది వీడియో తీశారు. దానిని కాస్త సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది దెబ్బకు చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని కొంతమంది అంటుంటే.. విద్యుత్ సృష్టించిన వ్యక్తి కూడా ఈ స్థాయిలో ఆలోచించడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఇలాంటి విధానాలు సరికావని.. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని నెటిజన్లు వాపోతున్నారు.
View this post on Instagram