Home Blog Page 289

దిగజారిన మునీర్‌.. బయటపడిన అమెరికాతో లాబీయింగ్!

Munir lobbying with America
Munir lobbying with America

Munir lobbying with America: గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ ప్రతిదాడులను తిప్పికొట్టింది. అయితే మన దాడికి వణికిపోయిన పాకిస్తాన్‌ అమెరికాతో చేసిన లాబీయింగ్‌ ఇప్పుడు బయటపడింది. ఇది పాకిస్తాన్‌ బలహీనతకు ప్రత్యక్ష సాక్ష్యం.

పకడ్బందీ లాబీయింగ్‌..
అమెరికా చొరవతోనే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందని, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ తాజాగా ప్రకటించారు. ప్రాంతీయ శాంతి కోసమే పాకిస్తాన్‌ ఇందుకు అంగీకరించిందని వెల్లడించాడు. కానీ యూఎస్‌ ఫారిన్‌ ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ఫెరా(FARA) పత్రాలు ఈ ప్రకటనను డొల్లుగా మార్చాయి. నిజం ఏమిటంటే.. పాకిస్తాన్‌ అమెరికా సాయం కోసం 60 సార్లకుపైగా లాబీయింగ్‌ చేసింది. ఇది దౌత్య విజయం కాదు, దౌత్య బలహీనతకు నిదర్శనం.

30 సార్లు సంప్రదింపులు..
మే 6 అర్ధరాత్రి భారత్‌ సైనిక దాడులతో షాక్‌ అయిన పాకిస్తాన్‌ అమెరికాతో సుమారు 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్‌ అంబాసిడర్‌ అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. మే 7–8న ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబీయింగ్‌ చేసింది. మే 9న లాబీయింగ్‌ను మరింత పెంచి, రక్షణ, జాతీయ భద్రత వ్యక్తులతో 20–25సార్లు సంప్రదించింది. అమెరికా మీడియా జర్నలిస్టులతో భేటీలు జరిపింది.

సైనిక దెబ్బకు బలహీనపడిన పాక్‌
భారత్‌ సైనిక చర్యలకు పాక్‌ ఎంతగా భయపడిందో లాబీయింగ్‌ పరిమితి నుంచి స్పష్టమవుతోంది. మొత్తం 50సార్లకుపైగా అమెరికాను సంప్రదించడం, 60 మంది అధికారులను సంచరించడం నిదర్శం.

దౌత్య వ్యూహాల్లో తేడా..
వాషింగ్‌టన్‌లో భారత్, పాక్‌ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించింది. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం. మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ తొలి నుంచే వస్తోంది. పాకిస్తాన్‌ మాత్రం అమెరికా మద్దతు కోరడం, మధ్యవర్తిత్వం కోరడం, కశ్మీర్‌ను అంతర్జాతీయత చేయడం. ఇదే రెండు దేశాల మధ్య తేడా.

బలహీనతకు లొంగిపోవడం
పాక్‌ ప్రకటనలు ‘ప్రాంతీయ శాంతి కోసం‘ అని చెప్తున్నాయి. కానీ నిజం మరొకటి: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు కంగుతిన్న పాక్‌ చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఈ పరిస్థితిలోనే భారత్‌ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది భారత్‌ బలహీనత కాదు. ఇది భారత్‌ దౌత్య విజయం.

కచ్చితమైన దాడులు..
ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సైనిక సమర్థతను చాటింది: ఇచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాం. పీవోకేసహా పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రకేంద్రాలను కకావికలం చేసి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది.

ఆసిమ్‌ మునీర్‌ ప్రకటనలు డొల్లు అని తేలిపోయాయి. పాక్‌ ఎంతగా దిగజారిపోయిందనే విషయం వెలుగు చూసింది. 60సార్లకుపైగా లాబీయింగ్‌ చేయడం బలహీనతకు లక్షణం. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక విజయం కాదు, దౌత్య విజయం కూడా.. భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్‌ మెడలు వంచింది.

జూనియర్ ఉద్యోగికి వ*యా*గ్రా బిల్లలు ఇచ్చింది.. ఈ లేడీ బాస్ టార్చర్ ఎంత దారుణం అంటే..

Lady Boss Harassment Case
Lady Boss Harassment Case

Lady Boss Harassment Case: మామూలుగా అయితే దీనిని వార్త లాగా రాయకూడదు. కాకపోతే ఇటువంటి దారుణాలు సభ్య సమాజానికి తెలియాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు అప్రమత్తమవుతారు. తమకు ఇటువంటి అనుభవాలు ఎదురుగా కాకుండా జాగ్రత్తపడతారు. ఈ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత.. ఆమె దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. బాధ కలిగింది. ఇబ్బంది కలిగింది. అన్నింటికీ మంచి పురుషులకు ఈ సమాజంలో రక్షణ లేకుండా పోతుందని అర్థమైంది.

చాలా సందర్భాల్లో లైంగిక వ్యవహారాలలో ఆడవాళ్లే బాధిత పక్షంగా ఉంటారు. మగవాళ్ళను ఈ మీడియా దోషులుగా చూస్తూ ఉంటుంది. మగవాళ్ళు అనేవారు మనుషులు కాదని.. ఆడవాళ్లను చూస్తే రెచ్చిపోతారని.. ఎంతటి దారుణానికైనా తెగిస్తారని మీడియా రాస్తూ ఉంటుంది. కొన్ని ఈ సందర్భాలలో ఇది నిజమైనప్పటికీ.. అన్ని సమయాలలో ఇది నిజం కాదు. ఎందుకంటే పురుషులు కూడా బాధిత పక్షంగా ఉంటారు.. వారు కూడా ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాలలో బలవన్మరణానికి పాల్పడుతుంటారు.

అది అమెరికా.. అక్కడ జేపీ మోర్గాన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఓ మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఈమె వయసు దాదాపు 40 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈమె తన కింద పనిచేసే జూనియర్ ఉద్యోగి మీద లైంగిక దాడికి పాల్పడింది. అతడిని ఆ బానిస చేసుకుంది. ప్రతిరోజు అతడితో మాట్లాడటం.. రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేసుకోవడం.. ఆఫీస్ పనిమీద తనను ఇంటికి పిలిపించుకోవడం.. కాఫీ లేదా ఇతర పదార్థాలు సర్వ్ చేయడం.. అందులో వ*యా*గ్రా కలిపి ఇచ్చేది. అతడితో నిత్యం అదే పనిలో మునిగి తేలుతూ ఉండేది.. అతనితో బలవంతంగా ఆ పనిలో పాల్గొనేది. ఆ తర్వాత వాటిని వీడియోలు రహస్యంగా తీసేది.

ఈ క్రమంలో ఆ జూనియర్ ఉద్యోగి తనపై ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీద ఆరోపణలు చేశాడు. తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది మొత్తం బయటపెట్టేశాడు. ఈ వ్యవహారం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే కేసు నమోదయింది. ఈ కేసు కు సంబంధించి విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.. అయితే ఆ జూనియర్ ఉద్యోగం మీద జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దారుణానికి పాల్పడింది నిజమేనని తేలింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఆమెకు ఎటువంటి శిక్ష విధిస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

త్రిష అసలు మనిషి కాదంటూ ప్రముఖ సింగర్ హాట్ కామెంట్స్..

Trisha Pet Dog
Trisha Pet Dog

Singer comments on Trisha: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం సౌత్ నుండి నార్త్ వరకు మారుమోగిపోతున్న పేరు ఇది. అందుకు కారణం ఏంటో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత కొంతకాలం నుండి ఈమె తమిళ హీరో విజయ్ తో సహజీవనం చేస్తోంది. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం లో త్రిష పాల్గొనగా , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ‘సూచీ లీక్స్’ అంటూ అప్పట్లో ప్రముఖ సింగర్ సుచిత్ర సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అక్రమ సంబంధాలు , ఫోటోలు , వీడియోలు వంటివి అప్పట్లో ఈమె విడుదల చేసింది. దానిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే సుచిత్ర ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా త్రిష గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘త్రిష అంటే నాకు మొదటి నుండి అసలు ఇష్టం ఉండదు. కానీ తలపతి విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన తన భార్య కి దూరమయ్యాడు , తల్లిదండ్రులకు , పిల్లలకు కూడా దూరం అయ్యాడు. ఇలా అందరికీ దూరమైన సమయాన్ని చూసుకొని కొన్ని పరాన్నజీవులు లాంటి వ్యక్తులు ఆయన జీవితం లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఒంటరి తనాన్ని , మంచితనాన్ని వాడుకొని కొందరు ఆయనకు భారం గా మారుతున్నారు’ అంటూ త్రిష ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి.

ఇకపోతే విజయ్ ముఖ్యమంత్రి అవ్వగానే, త్రిష టీవీకే పార్టీ లో కీలక బాధ్యతలు చేపడుతుందని, ఆమెకు ఉపముఖ్యమంత్రి పదవి ని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియా లో అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఎందుకంటే టీవీకే పార్టీ ప్రస్తుతం నాలుగు పార్టీలతో పొత్తులో ఉంది, అందులో వీసీకే పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పదవి ని డిమాండ్ చేస్తున్నారు , అందుకే విజయ్ త్రిష కి ఈసారి అవకాశం ఇవ్వలేదని, కానీ పార్టీ కి సంబంధించిన అంతర్గత కార్యక్రమాలు మొత్తం ఆమె దగ్గరుండి చూసుకుంటుందని అంటున్నారు. ఇకపోతే మరోపక్క ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం , తెలుగు లో ‘వీరభద్రుడు’ అనే పేరుతో విడుదల కాబోతుంది.

అసెంబ్లీ లో మాజీ సీఎం ని అవమానించిన విజయ్.. ఇలా ఉంటే కష్టమే..

CM Vijay
CM Vijay

Vijay insulted former CM in assembly: రాజకీయాల్లో పదవి శాశ్వతం కాదు , కేవలం నాయకులూ చేసే మంచి పనులు తాలూకు ఫలితం మాత్రమే శాశ్వతం, ఆ ఫలితాల ద్వారా ఏర్పడే మంచి పేరు శాశ్వతం. ఇది చాలా మంది నాయకులూ అర్థం చేసుకోలేదు , అందుకే కాలగర్భంలో కలిసిపోయారు. అధికార మదంతో అహంకారం చూపించడం అసలు కరెక్ట్ కాదు అనేది 2024 ఎన్నికలు ఒకసారి నిరూపించి చూపించింది. ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి గా ఎన్నికైన విజయ్ కూడా పైన చెప్పిన దారిలోనే నడుస్తున్నాడా?, వయస్సులో పెద్దవారైనా నాయకులకు ఆయన మర్యాద ఇవ్వడం లేదా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నేడు తమిళనాడు అసెంబ్లీ లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన ప్రతీ ఒక్కరు ప్రమాణస్వీకారం చేశారు. అందులో అన్నా డీఎంకే పార్టీ అధినేత పళని స్వామి కూడా ఉన్నాడు.

అయితే పళని స్వామి ప్రమాణస్వీకారం చేయడానికి ముందుకొచ్చినప్పుడు, తన ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి విజయ్ కి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వారికి తిరిగి నమస్కారం చేయడం సంస్కారం. కానీ విజయ్ పళని స్వామికి నమస్కారం చెయ్యలేదు, దండం పెడితే చిన్న చిరునవ్వుతో సరిపెట్టాడు. ఇదే ఇప్పుడు అన్నా డీఎంకే సపోర్టర్స్ ని తీవ్రమైన అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఇదే అసెంబ్లీ లో తనకు గురువు లాంటి విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చినప్పుడు పైకి లేచి మరీ నమస్కారం చేసిన విజయ్, గతం లో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన పళని స్వామిని ఎందుకు గౌరవించలేదు?, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా మర్యాద ఇస్తాడు అన్నమాట. ఇదంతా పక్కన పెడితే నేడు విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ , ఆయనకు నమస్కారం చేసి , సన్మానం చేసి వచ్చాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ప్రతిపక్ష నేతకు గౌరవం ఇచ్చాడు మంచిగానే ఉంది , కానీ విపక్ష నేత అంటే చిన్న చూపు ఎందుకు?, అంటే AIDMK ప్రధాన ప్రతిపక్షం కాదు కాబట్టి విజయ్ చిన్న చూపు చూస్తున్నాడా?, ఎన్నికల ప్రచారం లో ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు , ఇక నుండి తమిళనాడు లో కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది , ఒకటి DMK కాగా, మరొకటి TVK అని. అంటే విజయ్ హోదా ని బట్టే గౌరవం ఇస్తాడు అన్నమాట , అంటూ సోషల్ మీడియా లో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే , ఇక రాబోయే రోజుల్లో ఈయన ఎలా ఉంటాడో అని అంటున్నారు నెటిజెన్స్.
https://www.youtube.com/shorts/GwaByE8hF7Y?feature=share

'పెద్ది' థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. బ్రాండ్ న్యూ పోస్టర్ అదుర్స్..

Peddi theatrical trailer release date
Peddi theatrical trailer release date

Peddi theatrical trailer release date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఊహించిన రేంజ్ లో అద్వానీ బుకింగ్స్ జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకొని ప్రీమియర్ షోస్ నుండి అద్భుతమైన గ్రాస్ వసూళ్లను రాబట్టాలంటే , కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ కావాలి. ఎందుకంటే నార్త్ అమెరికా లో ఆడియన్స్ ట్రైలర్ ని చూసిన తర్వాతే టికెట్స్ బుక్ చేసుకుంటారు. అందుకే ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా, కాసేపటి క్రితమే అందుకు సంబంధించిన అధికారిక అప్డేట్ ని ఒక సరికొత్త పోస్టర్ ని తెలిపారు.

ఈ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారట. ముంబై లో ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసి ఈ ట్రైలర్ ని విడుదల చేస్తారని టాక్. ముందుగా భోపాల్ లో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేద్దాం అని అనుకున్నారు. కానీ చివరికి ముంబై కి షిఫ్ట్ చేశారు. మరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులు ఎవరైనా రాబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం ప్రధానంగా నార్త్ ఇండియా కలెక్షన్స్ ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు నార్త్ ఇండియా లో తిరుగులేని స్టార్ స్టేటస్ తో బలంగా నాటుకుపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ వాళ్లకు పోటీ అవ్వాలంటే , కచ్చితంగా అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి. అందుకే సినిమాకు సంబంధించిన అతి ముఖ్యమైన ఈవెంట్ ని నార్త్ అమెరికా నుండే మొదలు పెట్టబోతున్నారు.

ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేయబోతున్నారట. అవి అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తుందని టాక్. ఈ ట్రైలర్ తో సినిమా కథ మీద అందరికీ ఒక అంచనా వస్తుందని , ఇప్పటి వరకు ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ ని పదింతలు ఎక్కువ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుంది అనేది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన రెండు గ్లింప్స్ వీడియోస్ కి , రెండు పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

సీఎంగా విజయ్ బిందాస్.. మరి ఆయన భార్య, పిల్లలు ఎక్కడున్నారు

CM Vijay Wife and Children
CM Vijay Wife and Children

CM Vijay Wife and Children: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పని మొదలుపెట్టారు. అసెంబ్లీలో శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఇప్పుడు అసలైన ప్రశ్న వ్యక్తమవుతోంది. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన చర్చ సాగుతూ ఉంది. విజయ్ ముఖ్యమంత్రిగా బిందాస్ గా ఉన్నారు.. మరి ఆయన భార్య ఎక్కడున్నారు, పిల్లలు ఎక్కడ తలదాచుకున్నారు?

విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. నిన్న తన స్వగృహంలోనే ఉన్నారు. కొంతమంది వీవీ వీఐపీలను మాత్రమే ఆయన కలిశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో గెలిచిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.. పొలిటికల్ గా ఈ స్థాయికి ఎదిగిన విజయ్.. వ్యక్తిగతంగా మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. బయటికి ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే.. లోపల మాత్రం ఒక రకమైన ఆవేదన కనిపిస్తూనే ఉంది.

కట్టుకున్న భార్య సంగీత దగ్గర లేదు. పిల్లలు జేసన్, దివ్య కూడా ఆయన వద్ద లేరు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు పిల్లలు పక్కన లేరంటే ఆ బాధ మామూలుగా ఉండదు. భర్తతో విభేదాల నేపథ్యంలో ఇప్పటికే విజయ్ భార్య సంగీత దూరంగా ఉంటున్నారు. ఆమె ఏకంగా విడాకుల నోటీస్ కూడా పంపించారు. దానిపై రకరకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఆ కేసు విచారణకు రానుంది.. విజయ్ భార్య సంగీతకు బ్రిటిష్ సిటిజన్ షిప్ ఉంది. ఆమె ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్నారు.

మరోవైపు త్రిష విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. విజయ్ తో తాను రిలేషన్ లో ఉన్నానని త్రిష చెప్పకనే చెప్పారు. విజయ్ కుమారుడు జేసన్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు.. సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే జేసన్ తన తండ్రి పేరును తొలగించుకున్నాడు. దివ్య కూడా తల్లితో ఉంటున్నది.. ఆమె కూడా ఉన్నత చదువులు చదువుతున్నది.. విడాకుల కేసు విచారణకు సంగీత హాజరయ్యే అవకాశం ఉందని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సత్వర విచారణకు సీఎం ఆదేశం!

Bandi Bhagirath POCSO case
Bandi Bhagirath POCSO case

Bandi Bhagirath POCSO case: కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాది.. బండి సంజయ్‌ తనయుడు సాయిభగీరథ్‌పై ఇటీవల హైదరాబాద్‌లో పోక్సో కేసు నమోదైంది. అదే రోజు సాయి భగీరథ్‌ కూడా ఓ మైన్‌ బాలిక, ఆమె తల్లిదండ్రులపై హనీట్రాప్‌ కేసు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. ఈ రెండు కేసులపై ఇంకా విచారణ మొదలు కాలేదు. అయితే ఇప్పటికే రాజకీయరంగు పులుముకుని విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాఱ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సభలో బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై ఆరా తీశారు. ఇది న్యాయ వ్యవస్థ పరీక్ష, ప్రజా విశ్వాసానికి పరీక్ష. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తక్షణ చర్యలకు ఆదేశించడం ఇపుపడు చర్చనీయాంశమైంది.

పోలీస్‌ల తీరుపై విమర్శలు..
ఈనెల 8వ తేదీనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ తెలిపారు. అయితే డీజీపీ సమాధానంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 17 ఏళ్ల బాలిక హక్కులు ముఖ్యం కాదా అని నిలదీశారు. రాజకీయ నేత తనయుడు కాబట్టి వెనుకాడారా అని నిలదీశారు.

న్యాయం సంక్లిష్టం..
ఇదిలా ఉంటే ఈ కేసు సంక్లిష్టంగా ఉంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్‌ తన కుమార్తెను వేధిస్తున్నారని. కానీ అదే రోజు భగీరథ్‌ కూడా ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని.

ఎవరు నిజం చెబుతున్నారు?
ఇది కేవలం పోలీసుల విచారణ కోసం వదిలివేయాలి. కానీ ప్రశ్న మిగిలిపోతోంది. రాజకీయ నేత తనయుడు కాబట్టి ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ ఉందా? లేదా నిజమైన బాధితురాలికి న్యాయం లభిస్తుందా?

సీఎం కీలక ఆదేశాలు..
మరోవైపు ఈ కేసుపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ఆనందర్‌ కూకట్‌పల్లి డీసీపీ రుతురాజ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

రంగంలోకి బాలల హక్కుల కమిషన్‌..
పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది. చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి సీపీ నుంచి పూర్తి వివరాలు కోరారు. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేశారు. బాలల హక్కుల విషయంలో ఏ వ్యక్తి అయినా, ఏ స్థానం అయినా సమానం అనేలా చర్యలు ఉన్నాయి.

ఈ కేసు పరిష్కారం ద్వారా రాష్ట్రం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచగలదు. లేదా కోల్పోయి, అనేక ప్రశ్నలను మిగిల్చివేస్తుంది. న్యాయం ముందు సమానత్వం కేవలం మాట కాదు, 17 ఏళ్ల బాలిక హక్కులు రక్షించబడతాయా లేదా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.

బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు అన్నారు.. కొంటే ఏమవుతోంది..

Why Modi said not to buy Gold
Why Modi said not to buy Gold

Why Modi said not to buy Gold: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. దీనిని సంప్రదాయానికి, సంపదకు, సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహాలు, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయాల్లో బంగారం కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొన్ని గణాంకాల ప్రకారం.. భారతీయులు ఏటా సగటున 700 నుండి 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడానికి ఇక్కడి ప్రజలకు ఈ పసిడిపై ఉన్న మక్కువనే ప్రధాన కారణం. అయితే ఇటీవల మోదీ బంగారం ఎక్కువగా కొనుగోలు చేయొద్దని ప్రకటన చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?

దేశంలో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా మన దేశీయ ఉత్పత్తి అత్యంత స్వల్పంగా ఉంది. ఏటా కేవలం 1 నుండి 2 టన్నుల బంగారం మాత్రమే మన గనుల నుండి లభిస్తోంది. దీనివల్ల దాదాపు 90 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌ను విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వస్తోంది. ముడిచమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతుల కోసమే. దీనివల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరిగి, రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు తెలిపారు. కనీసం ఏడాది పాటు కొత్త బంగారం కొనకుండా ఉండటం వల్ల దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని, ఆ నిధులను దేశాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పసిడిపై పెట్టుబడి పెట్టడం వల్ల అది వ్యక్తిగతంగా లాభదాయకంగా అనిపించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా అది ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’ గానే మిగిలిపోతుందనేది నిపుణుల వాదన.

బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ‘సావరిన్ గోల్డ్ బాండ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. భౌతికంగా బంగారాన్ని కొని లాకర్లలో దాచుకోవడం కంటే, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల విదేశీ దిగుమతుల భారం తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులకు భద్రతతో పాటు అదనపు వడ్డీ కూడా లభిస్తుంది. ప్రజలు తమ పెట్టుబడి దృక్పథాన్ని మార్చుకుని, భౌతిక బంగారం నుంచి డిజిటల్ , బాండ్ల వైపు మళ్ళినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

‘ఆదిలోనే హంసపాదు’ ఎలా పుట్టింది.. దీని వెనుకన్న ఆసక్తికర స్టోరీ ఏంటీ..

Adilone Hamsapadu meaning
Adilone Hamsapadu meaning

Adilone Hamsapadu meaning: చాలా సందర్భాల్లో కొన్ని విషయాలను గట్టిగా చెప్పాలనుకుంటే సామెతలను వాడుతూ ఉంటారు. ఈ సామెతల వల్ల ఎదుటివారిని ఆకర్షించడంతో పాటు వారికి విషయం పూర్తిగా అర్థం అవుతుంది. ఇలాంటి సామెతల్లో ‘ఆదిలోనే హంసపాదు’ అనే సామెత తెలుగు భాషలో చాలా ప్రసిద్ధి చెందింది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ప్రారంభంలోనే పొరపాటు జరగడం, లేదా మొదట్లోనే ఆటంకం రావడం జరిగినప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారు. ఒక పని సజావుగా సాగకుండా మొదటి దశలోనే సమస్యలు ఎదురైతే ‘ఆదిలోనే హంసపాదు వచ్చింది’ అని అంటారు. ఈ సామెత వెనుక ఆసక్తికరమైన సాంప్రదాయం ఏంటీ? ఈ పదం ఎలా పుట్టింది?

పూర్వకాలంలో గ్రంథాలను తాళపత్రాలపై లేదా చేతిరాత పుస్తకాలుగా రాసేవారు. రాయడం సమయంలో ఎక్కడైనా అక్షరదోషం వచ్చినప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రత్యేక గుర్తులు పెట్టేవారు. అందులో ఒక గుర్తు హంస కాలి ఆకారంలా ఉండేదని చెబుతారు. అంటే ఇంగ్లీష్ Vని తిరగేసి రాసినట్లు ఉంటుంది. ఆ గుర్తునే ‘హంసపాదు’ అని పిలిచేవారు. ముఖ్యంగా రచన ప్రారంభంలోనే అలాంటి దిద్దుబాటు గుర్తు వస్తే అది మంచి శకునంగా భావించేవారు కాదట. అంటే, ఒక రచన మొదటి పేజీలోనే తప్పు రావడం వల్ల రచయితకు నిరాశ కలిగేది. ‘ఇంకా మొదలుపెట్టగానే తప్పు వచ్చింది’ అనే భావంతో “ఆదిలోనే హంసపాదు” అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత అది కేవలం రచనలకే కాకుండా అన్ని పనులకు వర్తించే సామెతగా మారిపోయింది.

ఈ సామెతలో ‘హంస’ అంటే స్వచ్ఛత, అందం, జ్ఞానం అనే భావాలు ఉన్నాయి. అయితే ‘హంసపాదు’ అనే పదం ఇక్కడ అందమైన గుర్తు కాదు. తప్పును సూచించే చిహ్నం. అందుకే మంచి ప్రారంభం కాకుండా, మొదట్లోనే సమస్య ఎదురవడాన్ని ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు. నేటికీ ఈ సామెతను రోజువారీ జీవితంలో విరివిగా వాడుతుంటారు. ఉదాహరణకు కొత్త వ్యాపారం ప్రారంభించగానే నష్టాలు రావడం, సినిమా మొదటి రోజే విమర్శలు రావడం, పరీక్ష మొదటి ప్రశ్నకే సమాధానం రాకపోవడం వంటి సందర్భాల్లో ‘ఆదిలోనే హంసపాదు’అని అంటారు.

తెలుగు భాషలోని సామెతలు జీవన అనుభవాల నుంచి పుట్టుకొచ్చినవే. ‘ఆదిలోనే హంసపాదు’ కూడా అలాంటి అనుభవజ్ఞానం నుంచి వచ్చిన సామెతగా భావిస్తారు. చిన్న పొరపాట్లు కూడా ప్రారంభంలోనే పెద్ద ప్రభావం చూపుతాయని ఈ మాట ద్వారా తెలియజేస్తారు.

మిడ్ రేంజ్ పీపుల్స్ కోనే ఫోన్.. ఫీచర్లు మాత్రం ప్రీమియం..

OnePlus Nord CE6 features
OnePlus Nord CE6 features

OnePlus Nord CE6 features: దాదాపు అన్ని వర్గాల వారికి OnePlus కంపెనీకి చెందిన మొబైల్స నచ్చుతాయన్న భావన ఉంది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి Nord CE6 ఇటీవల లాంచ్ అయింది. మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ లో మెరుగైన బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లు ఉండడంతో గేమింగ్ లవర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ఇది Nord 6 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండడం విశేషం. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

OnePlus Nord CE6లో 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3600 nits పీక్ బ్రైట్‌నెస్‌తో సూపర్ స్మూత్ స్క్రాలింగ్ ఉండడంతో గేమింగ్ కోరుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. IP66, 68 రేటింగ్ ఉండడంతో దుమ్ము, నీటి బిందువుల నుంచి రక్షణగా ఉంటుంది.

ఈ మొబైఖ్ లో Snapdragon 7s Gen 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండనుంది. ఇది Adreno 810 GPUతో పనిచేస్తుంది. 8GB RAM, 128 లేదా 256GB UFS 3.1 స్టోరేజ్‌ ఉండడంలో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6 గంటలు స్థిరంగా గేమింగ్ కోసం వాడుకోవచ్చు. ఈ కొత్త మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా ఉండనుంది. 2MP డెప్త్ రియర్ కెమెరా కూడా ఉండనుంది. 4K రిజల్యూషన్ తో వీడియో, AI ఫీచర్లతో షార్ప్ ఫోటోలు తీసుకోవచ్చు. వీటితో పాటు 32MP ఫ్రంట్ కెమెరా గ్రూప్ సెల్ఫీలకు బాగా ఉపయోగపడుతుంది.

OnePlus Nord CE6లో 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండనుంది. ఇది 2.5 రోజులు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ బ్యాటరీకి 80Wవైర్డ్, 27W రివర్స్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్‌తో హెవీ యూజర్లకు ఫుల్ సపోర్టుగా ఉంటుంది. 8GB+128GB ఉండే ఈ మొబైల్ ధర రూ. 29,999 ఉంది. 8GB+256GB రూ. 32,999 తో విక్రయిస్తున్నారు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ లో డ్యూయల్ స్టెరియో స్పీకర్స్, IR బ్లాస్టర్, Wi-Fi 6తో కంప్లీట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లు కొనాలా.. వద్దా.. ఎవరికి ఉపయోగం..

Diesel vs Petrol Cars
Diesel vs Petrol Cars

Diesel vs Petrol Cars: ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల హడావుడి పెరుగుతోంది. అయినప్పటికీ SUV విభాగంలో డీజిల్ ఇంజిన్ల హవా ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం SUV అమ్మకాల్లో డీజిల్ వాటా 18 శాతంగా ఉంది. దీంతో కొన్ని వర్గాల వారు ఇంకా SUV వేరియంట్ లో డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసేవారు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించేవారు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌లనే నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా BS7 అమల్లోకి వస్తే డీజిల్ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో డీజిల్ కార్లు కొనాలా? వద్దా? అన్న సందేహం కలుగుతోంది.

BS7 నిబంధనలు
రాబోయే రోజుల్లో అమలు కానున్న BS 7 (Bharat Stage 7) ఉద్గార నిబంధనలు కార్ల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లను మార్చడం వల్ల తయారీ ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇప్పటికే BS6 నిబంధనల వల్ల డీజిల్ కార్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు BS7 అమల్లోకి వస్తే ముఖ్యంగా రూ.20 లక్షల లోపు ఉండే మధ్యతరహా SUVల ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

డీజిల్ కార్లు కొనాలా? వద్దా?
ప్రస్తుత తరుణంలో డీజిల్ కారు కొనాలనుకునే వారు తమ ప్రయాణ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ నెలవారీ ప్రయాణం 1,500 నుండి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండి.. తరచుగా హైవేలపై లాంగ్ ట్రిప్స్ చేసేవారైతే డీజిల్ కారు ఇప్పటికీ లాభదాయకమే. డీజిల్ ఇంజిన్ ఇచ్చే మైలేజ్, పవర్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎక్కువే. అయితే, కేవలం నగర పరిధిలోనే తిరిగేవారు లేదా తక్కువ ప్రయాణం చేసేవారు పెట్రోల్ లేదా హైబ్రిడ్ ఆప్షన్లను పరిశీలించడం మంచిది.

భవిష్యత్తు సవాళ్లు మరియు రీసేల్ వాల్యూ
ధరల పెరుగుదలతో పాటు, భవిష్యత్తులో డీజిల్ వాహనాలపై వచ్చే ఆంక్షలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని మెట్రో నగరాల్లో పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలపై నిషేధం ఉండటం, రాబోయే కాలంలో పర్యావరణ నిబంధనలు మరింత కఠినతరం కావడం వల్ల వీటి రీసేల్ వాల్యూ (మళ్లీ అమ్మేటప్పుడు వచ్చే ధర) తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఒకవేళ భారీ పవర్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కోరుకుంటేనే ఇప్పుడు డీజిల్ SUVని ఎంచుకోవడం సమంజసం.

స్టాలిన్ వద్దకు సీఎం విజయ్.. ప్రభుత్వాన్ని కాపాడడానికి పెద్ద ప్లాన్

CM Vijay meets Stalin
CM Vijay meets Stalin

CM Vijay meets Stalin: ఇల్లు అలకగానే పండగ కాదు అంటారు. ఈ సామెతను పెద్దవాళ్లు ఎందుకు వాడారో తెలియదు గాని.. తమిళ రాజకీయాలను చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా అట్టహాసంగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. అనేక పార్టీల కలబోతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల బాగానే ఉంది గాని.. బల పరీక్షలో నిలబడటమే ఇప్పుడు విజయ్ ముందున్న అసలు సవాల్. ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అనేక సందర్భాల్లో విజయ్ కి చుక్కలు చూపించారు. రెండుసార్లు మద్దతు లేఖలు లేవని వెనక్కి పంపించారు. చివరిగా మూడోసారి అతి కష్టం మీద విజయ్ మద్దతు లేఖలు సంపాదించి గవర్నర్ ఎదుట ప్రదర్శిస్తే.. దానికి ఒప్పుకున్నారు.

చివరికి ఆదివారంనాడు చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇతర అతిరథ మహారధులు హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం విజయ్ ముందు ఉంది. మంగళవారం జరిగే అసెంబ్లీలో తన బలాన్ని గవర్నర్ ముందు చూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే తన చేతిలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో విజయ్ తన బలాన్ని చూపించుకోవచ్చు.. కానీ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వీసీకే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కమ్యూనిస్టులు కూడా తోక జాడించే ప్రయత్నం చేశారు. ఐయూఎంఎల్ కూడా ఏవేవో మాటలు మాట్లాడింది. ఇవన్నీ కూడా విజయ్ ని ఇబ్బంది పెట్టాయని వార్తలు వస్తున్నాయి. అందువల్లే విజయ్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు.

తనకు రాజకీయ అనుభవం లేదని.. రాజకీయంగా లౌక్యం తెలియదని అంటున్న విశ్లేషకులకు ఒక్కసారిగా సమాధానం చెప్పారు. తను ఏకంగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి కూడా ఉన్నారు. ఉదయ నిధికి, విజయ్ కి బలమైన బంధం ఉంది. రాజకీయంగా కూడా విజయ్ డీఎంకే మీద ఇంతవరకు ఎటువంటి ఆరోపణ చేయలేదు. పైగా ఇటీవల స్టాలిన్ కూడా ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇస్తామని.. ఆడవాళ్లకు ప్రతినెల 2500 ఇవ్వకపోయినా పర్వాలేదు.. తమలగా 1000 రూపాయలు ఇచ్చినా చాలని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తే సంతోషిస్తామని వ్యాఖ్యానించారు..

ఒకవేళ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్, వీసీకే మద్దతు ఇవ్వలేని పక్షంలో.. డీఎంకే సపోర్ట్ కోసమే విజయ్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఒకవేళ గనుక డీఎంకే విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే అప్పుడు తమిళనాడులో ప్రతిపక్షంగా అన్నా డీఎంకే ఉంటుంది. అన్న డీఎంకే లో కూడా ఇటీవల చీలిక వర్గం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ వర్గం కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే .. తమిళనాడులో రాజకీయాలు మరోవైపు టర్న్ తీసుకుంటాయి.

ఈ శని జయంతితో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా..

Shani Jayanti zodiac predictions
Shani Jayanti zodiac predictions

Shani Jayanti zodiac predictions: శని అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ శనిని న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. మనుషులు చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చే దేవుడిగా హిందూ పురాణాలు చెబుతాయి. శని జన్మించిన రోజునే ‘శని జయంతి’గా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య రోజున ఈ పర్వదినం వస్తుంది. 2026లో మే 16న శని జయంతి రాబోతుంది. ఈ రోజు శని అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, దానాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం..

శని జయంతి రోజున ఉదయం స్నానం చేసి నల్లటి లేదా గాఢ నీలం రంగు దుస్తులు ధరించడం శుభంగా భావిస్తారు. శని ఆలయాలకు వెళ్లి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులు సమర్పించడం వంటి ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు. ఈ సందర్భంగా ‘ఓం శం శనైశ్చరాయ నమః’ మంత్రాన్ని జపించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కాకులకు ఆహారం పెట్టడం, పేదలకు దానం చేయడం కూడా ఈ రోజు ముఖ్యమైన పుణ్యకార్యాలుగా భావిస్తారు.

శని జయంతి సందర్భంగా హనుమాన్ స్వామిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శని ప్రభావం తగ్గించేందుకు హనుమాన్ చాలీసా చదవడం మంచిదని పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సడే సాతి, అష్టమ శని, ఎలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ఈ రోజున ఉపవాసం చేసి శని దేవుడిని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వసిస్తారు.

2026 మే 16న వచ్చే శని జయంతి కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మకర, కుంభ, తుల రాశుల వారికి శని అనుగ్రహం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కోర్టు వ్యవహారాల్లో ఊరట వంటి ఫలితాలు కలగొచ్చని అంటున్నారు. కష్టపడి పనిచేసేవారికి శని అనుకూల ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్యం పేర్కొంటోంది.

అలాగే వృషభ, మిథున రాశుల వారికి కూడా ఈ శని జయంతి తర్వాత కొత్త అవకాశాలు రావచ్చని చెబుతున్నారు. వ్యాపార విస్తరణ, కుటుంబ సమస్యల పరిష్కారం, ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపించవచ్చని అంచనా. అయితే మేష, కర్కాటక, సింహ రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం, కోపాన్ని నియంత్రించడం మంచిదని సూచనలు ఉన్నాయి.

శని దేవుడు కేవలం కష్టాలు ఇచ్చేవాడు కాదని, నిజాయితీగా జీవించే వారికి విజయాన్ని కూడా ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శని జయంతి రోజున భక్తి, నియమం, దానం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

OPPO నుంచి ఫ్లాగ్ ఫిష్ మొబైల్.. భారత్ లో రిలీజ్ ఎప్పుడంటే..

OPPO flagship mobile launch
OPPO flagship mobile launch

OPPO flagship mobile launch: Oppo మొబైల్స్ అనగానే చాలా మందికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కెమెరా సెటప్ తో పాటు ఫ్లాగ్ ఫిష్ ఫీచర్ తో ఆకట్టుకునే ఈ కంపెనీకి చెందిన చాలా మోడల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా దీని నుంచి Find X9S OPPO ఫ్లాగ్‌షిప్ Find X సిరీస్‌లోని కాంపాక్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. ఇది 2026 ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన తరువాత దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఫోన్ 7.99mm మందంతో చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1,256×2,760 పిక్సెళ్లతో నాణ్యతగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో , 3,600 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంటూ 1.15mm సూపర్-థిన్ బెజెల్స్‌తో ఆకట్టుకుంటుంది. కాంపాక్ట్ సైజ్‌తో హ్యాండ్‌హెల్డ్ ఉపయోగానికి బాగా సరిపోతుంది.

ఈ మొబైల్ లో MediaTek Dimensity 9500 లేదా 9000 సిరీస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 12GB RAM, 256GB లేదా 512GB UFS స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో పనిచేసేవారికి ఫుల్ సపోర్టును ఇస్తుంది. Android 16 ఆధారిత ColorOSతో అధునాతన AI ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ లవెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ వంటి కలర్లలో అందుబాటులో ఉన్నాయి.

వివో మొబైల్స్ కెమెరాకు ప్రత్యేకం. అందుకు అనుగుణంగానే ఇందులో ట్రిపుల్ 50MP కెమెరాలు ఉన్నాయి. 4K రిజల్యూషన్ తో వీడియో, AI ఎన్‌హాన్స్‌మెంట్స్ ఫొటోగ్రఫీ వారికి సపోర్టుగా ఉంటుంది. బ్యాటరీ పెర్ఫామెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ మొబైల్ లో 7,025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ 80W వైర్డ్, 13.5W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఫోన్‌లోని మెరుగైన బ్యాటరీ లైఫ్ హైలైట్. వియత్నామ్‌లో 12GB+256GB వేరియంట్ 24.99M (సుమారు ₹85,000) గా ఉంది. ఇండియాలో ఇంకా అధికారిక లాంచ్ లేదు. అయితే ఇక్కడ మార్కెట్లోకి వస్తే రూ. 50,990 నుంచి రూ.70,000 వరకు ఉండే అవకాశం ఉంది.

వేసవిలో ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా.. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది..

Sleep Deprivation
Sleep Deprivation

Summer Heat Sleeping Tips: వేసవి కాలంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామందికి నిద్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా గది వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, ఉక్కపోతతో పలుమార్లు మేల్కొనడం వంటి ఇబ్బందులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రలేమి కారణంగా అలసట, చిరాకు, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది..

వేసవిలో నిద్రపోయే సమయంలో సింథటిక్ లేదా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి సరిగా తగలదు. దీంతో చెమట ఎక్కువై అసౌకర్యం కలుగుతుంది. కాటన్ దుస్తులు అయితే చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే రాత్రి వేళల్లో వీలైనంత లైట్ కలర్ కాటన్ నైట్‌డ్రెస్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరుపుపై వేసే బెడ్షీట్ కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. సింథటిక్ బెడ్షీట్లు వేడిని ఎక్కువగా నిల్వ చేస్తాయి. కానీ కాటన్ బెడ్షీట్లు గాలి ప్రసరణకు సహాయపడుతూ చల్లదనాన్ని ఇస్తాయి. శుభ్రంగా ఉతికిన కాటన్ బెడ్షీట్ వాడితే శరీరానికి హాయిగా అనిపించి త్వరగా నిద్ర వస్తుంది.

నిద్రకు ముందు గోరువెచ్చగా లేదా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. రోజంతా వేడి కారణంగా వచ్చిన అలసట కూడా తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర త్వరగా పట్టడమే కాకుండా మధ్యలో మేల్కొనే సమస్య కూడా తగ్గుతుంది.

రాత్రి వేళల్లో ఎక్కువ మసాలా, ఆయిల్, కారం ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరిగి కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం, పెరుగు, పండ్లు, దోసకాయ వంటి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. అయితే నిద్రకు ముందు ఎక్కువగా నీరు తాగితే మధ్యలో పలుమార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావచ్చు. దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే పగటి సమయంలో ఎక్కువగా నీరు తీసుకుని, రాత్రి నిద్రకు ముందు పరిమితంగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.

నిద్రపోయే గదిలో గాలి సరిగా ఆడకపోతే ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తుంది. కిటికీలు కొద్దిసేపు తెరిచి ఉంచడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా వెంటిలేషన్ సౌకర్యం ఉండేలా చూడడం మంచిది. ఫ్యాన్ గాలి నేరుగా శరీరంపై కాకుండా గదిలో సర్క్యులేట్ అయ్యేలా ఉంచితే మరింత సౌకర్యంగా ఉంటుంది.

శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో నిద్రలేమి వల్ల అలసట, నీరసం మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడంతో పాటు హాయిగా నిద్రపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మహేష్ బాబు తమిళ దర్శకులను నమ్మకపోవడానికి అసలు కారణం ఇదే..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu on Tamil directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధించిన స్టార్ హీరోలందరు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. కారణమేదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం కేవలం తెలుగు దర్శకులతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పుడు చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ లను సాధించిన దాఖలలైతే లేవు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…

ఇక ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోగా భారీ విమర్శలను కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక మీదట తమిళ దర్శకులతో సినిమాలు చేయకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికి తమిళ డైరెక్టర్లు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అతనికి కథ వినిపించడానికి చాలా వరకు సన్నాహాలు చేసిన కూడా అవేవీ వర్కౌట్ కావడం లేదు. మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన స్టోరీని విన్న మహేష్ బాబు ఫైనల్ కూడా చేశారట.

అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా తొందరలోనే రాబోతుంది అంటూ అతని సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…ఇక ఇప్పటి వరకు సందీప్ మహేష్ బాబు కి నాలుగు స్టోరీలను చెప్పాడట. వాటిలో ఒక్కటి మాత్రమే ఫైనల్ చేశాడు…మరి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబోలో ఒక పవర్ ఫుల్ సినిమా వస్తుందనేది వాస్తవం…

రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించడానికి కారణం ఇదే...

Ravi Teja Next Movie
Ravi Teja Next Movie

Ravi Teja remuneration reduced: సినిమా ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రవితేజ…చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవతరించి వరుస సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలకు తను ఏమాత్రం తీసిపోని ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు… ఇక గతంలో తన రెమ్యూనరేషన్ విషయంలో చాలావరకు స్ట్రిక్ట్ గా ఉన్న రవితేజ వరుస ప్లాప్ లు రావడంతో తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకు అవకాశాలను ఇచ్చే దర్శకులు కరువైపోయారు.

స్టార్ డైరెక్టర్లందరు స్టార్ హీరోలతో లేదంటే సీనియర్ హీరోలతో సినిమాలను చేస్తున్నారు. కానీ రవితేజ ను మాత్రం స్టార్ డైరెక్టర్లు పట్టించుకోవడం లేదు. అందుకే యంగ్ డైరెక్టర్లు మాత్రమే అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తనకు భారీ విజయాలు దక్కేవరకు రెమ్యూనరేషన్ ని కొంతవరకు తగ్గిస్తే మంచిదని తనకు తాను డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఒకప్పుడు 25 కోట్లు తీసుకున్న రవితేజ ఇప్పుడు 20 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నాడట. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మరోసారి టాప్ హీరోగా మారతాడు. అలాగే తన కెరియర్ ను సైతం బిల్డ్ చేసుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… రవితేజ ఈ మధ్యకాలంలో చాలావరకు వెనుకబడిపోయాడు.

కాబట్టి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయాల్సిన సమయమైతే ఆసన్నమైందనే చెప్పాలి… ‘ఇరుముడి’ సినిమాతో మొదటిసారి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన థ్రిల్లర్ జానర్ లో సినిమాలైతే చేయలేదు. కాబట్టి ఈ సినిమా తనని మరో మెట్టు పైకెక్కిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…