Fish Market Viral Video: మనలో చాలామందికి చేపలు ఉంటే విపరీతమైన ఇష్టం. చేపల్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. అవి తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. పైగా వాటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చేపలు కంటి చూపును పెంపొందిస్తాయి. అందువల్లే వాటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.
చేపలు సముద్ర ప్రాంతంలో విస్తారంగా లభిస్తాయి. నదుల ప్రాంతంలో కూడా లభిస్తాయి.. చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతంలో కూడా చేపలు సమృద్ధిగా ఉంటాయి. నీటి ఆధారంగా చేపల రుచి మారుతూ ఉంటుంది. చేపలను కొంతమంది వేపుడు చేసుకొని తింటారు. మరి కొంతమంది పులుసుగా తింటారు. ఇంకొంతమంది నిలువ పచ్చడి పెట్టుకొని తింటారు. ఎలా తిన్నా సరే చేపలు రుచికరంగానే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చేపలను అధికంగా తింటూ ఉంటారు.
ఒకప్పుడు చేపలకు ఇంతగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో ప్రత్యేకంగా చెరువులు తవ్వించి.. చేపలను పెంచుతున్నారు. అందులో కొర్రమీను నుంచి మొదలుపెడితే బొచ్చే వరకు అన్ని రకాల చేపలు ఉంటాయి.
ఇక వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు గోదావరి నదీ ప్రవాహానికి ఎదురు ఈదే పులస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోదావరి నీరు ఎరుపు రంగు అలముకున్న తర్వాత పులస జాలర్ల వలలకు చిక్కుతుంది. ఆ సమయంలో ఆ చేపల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు చేపల గురించి మీరు చదివారు కదా. ఇప్పుడు చేపలు అమ్మే వాళ్ల గురించి.. వాళ్ళు వచ్చేసే మోసం గురించి చదవండి.
సాధారణంగా చేపలు నీళ్లలో పెరుగుతాయి. వలలకు చిక్కిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఆ సమయంలో అవి చాలావరకు బరువు తగ్గిపోతాయి. అయితే కొంతమంది వ్యాపారులు చనిపోయిన చేపల నోట్లో నీళ్లు పోస్తున్నారు. ఇలా నీళ్లు పోయడం ద్వారా చేపలు బరువు అధికంగా ఉంటాయి. తద్వారా కొనుగోలు చేసిన వారు మోసపోక తప్పదు. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. అయితే ఈ సంఘటన మన దగ్గర కాదు.. బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ వ్యాపారులు చేపలను అమ్ముతుండగా.. కొందరు వాటి నీటిలో నీళ్లు పోస్తూ కనిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
View this post on Instagram