Home Blog Page 291

యనమలపై గొప్ప బాధ్యతలు పెట్టిన చంద్రబాబు

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు.. అయితే మొన్నటి ఎన్నికల్లో చాలా తక్కువ మంది మాత్రమే పోటీ చేశారు. తమ వారసులను బరిలోకి దించి పక్కకు తప్పుకున్నారు. అటువంటి వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగా, స్పీకర్ గా, పిఎసి చైర్మన్ గా ఇలా సుదీర్ఘ పదవులను చేపట్టారు యనమల రామకృష్ణుడు. చివరిగా ఆయనకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉంది. రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యనమల రామకృష్ణుడుకు ప్రాధాన్యత తగ్గించారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు యనమలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

* మహానాడు తీర్మానాలు బాధ్యత..
ఈనెల చివరిలో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు పండుగ వాతావరణం లో మహానాడు వేడుకలు జరుగుతాయి. జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి అంశాలను ఈ మహానాడులో చర్చిస్తారు. ప్రతి విషయం మీద తీర్మానాలు పెడతారు. రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద ఈ తీర్మానాలు ఉంటాయి. అయితే ఈ తీర్మానాలను తయారు చేసే బాధ్యతను యనమల రామకృష్ణుడు పై పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు. మహానాడు కన్వీనర్ గా ఆయనకు చాన్స్ ఇచ్చారు. దీంతో త్వరలో యనమలకు పెద్ద పదవి రానుందని స్పష్టమవుతోంది. మహానాడు బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1994లో మాత్రం ఆయన శాసనసభ స్పీకర్ అయ్యారు. ఆ సమయంలోనే టిడిపి సంక్షోభం ఎదురయింది. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం వెనుక యనమల రామకృష్ణుడు కృషి ఉంది. అందుకే యనమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు చంద్రబాబు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019 నుంచి ఆయన పోటీ చేయడం లేదు. 2024 ఎన్నికల్లో తన వారసురాలిగా కుమార్తెను రంగంలోకి దించి గెలిపించుకున్నారు. రాజ్యసభ పదవి కోసం ఆశావహుడిగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే కీలకమైన మహానాడు బాధ్యతలు ఆయనకు ఇవ్వడం చూస్తుంటే.. ఆయన అనుకున్న పదవి సాధించడం ఖాయమని స్పష్టం అవుతుంది

విజయ్ తో పోల్చుకుంటున్న దువ్వాడ

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పట్ల ఆరాధనాభావంతోనే ఉన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతానని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మిగతా సీనియర్ల అభ్యంతరాలతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. తనను పార్టీలోకి తీసుకోవాలని.. లేకున్నా తాను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి ఉంటానని చెప్పారు. కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలి తోనే దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపుతో ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.

* వ్యక్తిగత వ్యవహారంతోనే సస్పెన్షన్…
దువ్వాడ శ్రీనివాస్ కు భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబ వివాదంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు విజయ్ గెలుపును ఉదహరిస్తున్నారు దువ్వాడ. విజయ్ వ్యక్తిగత కుటుంబ వివాదం సైతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నటి త్రిష తో విజయ్ కు ఉన్న సంబంధం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అయినా సరే అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ ను గెలిపించారు. ఇప్పుడు విజయ్ మాదిరిగా తనను కూడా ప్రజలు గెలిపిస్తారని చెబుతున్నారు దువ్వాడ.

* ప్రజలు ఆదరిస్తారని..
వ్యక్తిగత జీవితంతో రాజకీయాలకు ముడిపెట్టకూడదు అనేది దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయం. విజయ్ ను తమిళ్ నాడు ప్రజలు గెలిపించారని… తనను కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం గా చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం విజయ్ ను గుర్తుచేస్తూ.. తనను ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభిప్రాయం మాత్రం వేరేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు బయటకు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.

నాని రేంజ్ మారిపోయిందా...కలెక్షన్స్ విషయమేంటి...

Nani Paradise
Nani Paradise

Nani Paradise movie : న్యాచురల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు నాని… అష్ట చమ్మ సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత వరుస సక్సెస్ లను సాధించాడు. అయితే ఒకానొక సమయంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుడిని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ ను అందుకునే దిశలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందే ‘దసర’ సినిమా వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాతో హిట్ కాంబో గా నిలిచిన వీళ్లు ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారనేది తెలియాల్సి ఉంది.

నాని వరుస సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి ఆయన సినిమాకి వచ్చే కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన తేజ సజ్జా లాంటి వారు సైతం ఈజీగా వందల కోట్ల కలెక్షన్స్ ని రాపడుతుంటే నాని మాత్రం చాలా వరకు వెనకబడిపోతున్నాడు. ఆయన సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకున్న 100 కోట్లు కలెక్ట్ చేయడం గగనంగా మారిపోయింది.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్యారడైజ్ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడతాననే నమ్మకంతో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ప్యారడైజ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం నాని టైర్ వన్ హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం మరోసారి తను చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ మూవీ తర్వాత ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండటం విశేషం…

హార్థిక్ పాండ్యా ను సాగనంపినట్టే.. వచ్చే సీజన్లో MI కి కొత్త కెప్టెన్

Hardik Pandya missing
Hardik Pandya missing

Hardik Pandya Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఈ జట్టు భవితవ్యం హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కూడా మారలేదు. హార్దిక్ పాండ్యా 2024లో జట్టుకు సారథిగా వచ్చాడు. నాటి సీజన్లో ముంబై జట్టు అధమ స్థాయిలో ఉన్న నేపథ్యంలో విపరీతంగా విమర్శలు వచ్చాయి… ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఆట తీరు చాలా వరకు మార్చుకుంది.. ఫలితంగా 2025లో నాలుగో స్థానానికి వచ్చింది.

2025లో గొప్పగా ఆడిన ముంబై జట్టు.. 2026లో మాత్రం ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదు. రికెల్టన్ నుంచి మొదలు పెడితే నమన్ వరకు ఉన్నప్పటికీ ఎవరు కూడా సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు. బ్యాటింగ్లో విఫలమవుతున్నారు. బౌలింగ్ లోనూ విఫలమవుతున్నారు..

ఇటీవల మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చి సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించారు. అతని ఆధ్వర్యంలో ఒక విజయం సాధించిన ముంబై జట్టు.. కీలకమైన మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఇలా కీలకమైన దశలో ఓడిపోవడంతో ముంబై జట్టు ఇంటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా మీద తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. జట్టులో విభేదాల వల్ల హార్దిక్ పాండ్యా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందువల్లే అతడు ఇంస్టాగ్రామ్ లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ ఫాలో చేశాడు. మళ్లీ ఫాలో అయ్యాడు. ఇది సాంకేతిక సమస్యా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. లక్నో జట్టుతో.. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా ఇప్పటికే దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించి.. సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ముంబై ఇండియన్స్..మేనేజ్మెంట్ ప్రకటన చేయలేదు.

సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందుకోవడానికి సానుకూలంగా ఉన్నాడా.. అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగతంగా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అతడి వ్యక్తిగత ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. అందువల్ల అతడిని ముంబై మేనేజ్మెంట్ సారధిగా కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావాలంటే ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఏడాదిపాటు ఆ ఒక్కటి కొనొద్దు.. మోదీ పిలుపు!

Narendra Modi
Narendra Modi

Narendra Modi gold appeal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో ఒక అసాధారణమైన, కానీ అత్యవసరమైన పిలిచింపు ఇచ్చారు.. ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలను కోరారు. ఈ పిలుపు ఎప్పుడూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో బంగారం కొనుగోలు భారీగా పడిపోయాయి. ఇతరుణంలో మోదీ బంగారం కొనవద్దని సూచించడం వెనుక కారణం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సలహా కాదు, ఇది దేశభక్తికి ఒక పరీక్ష.

అత్యవసర సమయంలో బాధ్యత..
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని మోదీ స్పష్టం చేశారు. ఇది కేవలం ధరల పెరుగుదల గురించి మాట్లాడటం కాదు. ఇది దేశ ఆర్థిక భద్రత గురించి. ఏ ఫంక్షన్‌ ఉన్నా బంగారం కొనొద్దు.. ప్రజలు ఈ మేరకు శపథం చేయాలని ఆయన కోరారు.

విదేశీ మారకద్రవ్యం కోసమే..
బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. పెరిగిన ధరలతో బంగారం దిగుమతికి కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కలిసిరావడం లేదు. డాలర్‌ విలువ పెరుగుతోంది, అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఈ సమయంలో బంగారం దిగుమతులు తగ్గించడం దేశ ఆర్థిక భద్రతకు కీలకం. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది.. రాగి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇది పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి, భవిష్యత్తు వికాసానికి ఇబ్బందిగా మారింది. మనం ఇప్పుడు చర్య తీసుకోకపోతే, భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలు ఎదురవుతాయి.

మధ్య తరగతే దేశానికి ఆర్థిక శక్తి..
మోదీ మధ్యతరగతి వారిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది క్లిష్టమైన సమయంలో మధ్యతరగతి బాధ్యత. మధ్యతరగతి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తి, మరియు ఈ సమయంలో దేశానికి సహాయపడటం వారి బాధ్యత. అదే సమయంలో వంట నూనె వాడకం తగ్గించుకుంటే మంచిదని సూచించారు. ఇది కేవలం ఆరోగ్య సలహా కాదు. వంట నూనె దిగుమతి కూడా భారత దిగుమతి బిల్లులో భాగం. తగ్గించడం ద్వారా కుటుంబ బడ్జెట్‌ను బలపరచవచ్చు, దిగుమతులను తగ్గించవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం చేయాలని..
రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సూచించారు. ఇది భవిష్యత్తు తరాల కోసం ఉన్న బాధ్యత. సేంద్రీయ వ్యవసాయం పర్యావరణాన్ని రక్షిస్తుంది. రసాయనాలపై ఆధారపడటం తగ్గిస్తుంది. రైతుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఎందుకు ఈ అత్యవసరత?
మోదీ సడెన్‌గా ఇప్పుడే ఎందుకు ఇన్ని విషయాలు సూచించాడన్న సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. దేశం విదేశీ మారకద్రవ్యం రక్షించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మోదీ పిలుపు.. కేవలం ఆర్థిక సలహా కాదు. ఇది దేశభక్తికి ఒక పరీక్ష. మనం ఇప్పుడు ఆత్మనియంత్రణతో ఉంటే, భవిష్యత్తులో మనం బలంగా నిలబడగలము. మోదీ పిలుపును పాటిస్తే దేశ ఆర్థిక భద్రత రక్షిస్తాము. భవిష్యత్తు తరాల కోసం బాధ్యత తీసుకుంటాం. దేశభక్తిని ప్రకటిస్తాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం సులభం కాదు. కానీ ఇది అవసరం. ఏడాది పాటు బంగారం కొనకపోవడం ద్వారా, మనం దేశానికి చేసే సేవ అంతకంటే ఎక్కువ ఉండదు.

నాసిక్‌లో లవ్‌ జిహాద్‌ కుట్ర భగ్నం.. ఎంఐఎం కార్పొరేటర్‌ ఇంట్లో పట్టుబడిన కీలక నిందితురాలు!

Nashik love jihad case

Nashik love jihad case : నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) బీపీవో ఆఫీస్‌లో హిందూ ఉద్యోగులను లవ్‌ జిహాద్‌ వైపు మళ్లించి, వారిని మతం మార్చుకోవడానికి ఒత్తిడి చేసిన కుట్రను గత నెలలో పోలీసులు భగ్నం చేశారు . ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మహిళా హెచ్‌ఆర్‌ అధికారి నిడా ఖాన్‌ నెల రోజులుగా పోలీసులకు చిక్కలేదు. అజ్ఞాతంలో ఉంటూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. అవి విఫలమయ్యాయి. చివరకు అజ్ఞాతం వీడారు.

ఎంఐఎం కార్పొరేటర్‌ ఆశ్రయం..
నిడా ఖాన్‌ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఇంట్లో దాక్కుని ఉండగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు . ఆమెకు ఆశ్రయం ఇచ్చింది ఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పతేల్‌. ఈ ఘటన కీలకమైనది, ఎందుకంటే మతిన్‌ పతేల్‌ ఇల్లు ప్రభుత్వ స్థలంలో నిర్మించబడిందని తేలింది . నిడా ఖాన్‌ ఉన్న విషయం తెలియముందే ఆ ఇంటికి నోటీసులు ఇచ్చారు. తాజాగా నిడాఖాన్‌ పట్టుబడడంతో నాసిక్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఆ ఇంటిని కూల్చివేయాలని నిర్ణయించింది.

నిడా ఖాన్‌ ఏం చేశారంటే..
టీసీఎస్‌ కేసులో నిడా ఖాన్‌ హిందూ ఉద్యోగులను మతం మార్చుకోవడానికి ఒత్తిడి చేశారు. హిందూ ఉద్యోగులను లవ్‌ జిహాద్‌ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశారు. ఉద్యోగులను మతం మార్చుకునేలా ఒత్తిడి తెచ్చారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సీక్రెట్‌ ఆపరేషన్‌ ద్వారా దీనిని భగ్నం చేశారు.

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో జరిగిన లవ్‌ జిహాద్‌ కుట్ర భగ్నం కావడం, నిడా ఖాన్‌ అరెస్టు, ఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పతేల్‌ ఇల్లు తొలగించే నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతుంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించడం ద్వారా ప్రభుత్వం అక్రమాలపై సున్నా సహనం ప్రదర్శిస్తోంది.

కోహ్లీ ఎగిరి గంతేశాడు.. అంబానీ ముందు చిందేశాడు..

Virat Kohli celebration

Virat Kohli celebration : ఉత్కంఠ తారస్థాయి చేరింది. ప్రతి పరుగు అత్యంత విలువైనదిగా మారిపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో చివరికి బెంగళూరు విజయం సాధించింది. ముంబై జట్టును ఇంటికి పంపించింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను బెంగళూరు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు.. సరికొత్త చరిత్ర సృష్టించింది.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగిసింది.

167 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు మొదట్లో తడబడింది. విరాట్ కోహ్లీ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కీలక ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ దశలో బెంగళూరు జట్టుకు కృనాల్ పాండ్యా (73) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెతల్ (27) మెరుగైన ప్రదర్శన చేశాడు. చివర్లో జితేష్ శర్మ (18) విలువైన పరుగులు చేశాడు.

క్రికెట్ మ్యాచ్ లలో ఓటమి సహజం. గెలుపు కూడా అంతే సహజం.. ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు నిరాశలో ఉంటారు. గెలిచినప్పుడు ఆనందంలో ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లు గెలిచినప్పుడు తమ ఆగ్రహాన్ని దాచుకోరు. గెలిచినప్పుడు ఉత్తమ ఉత్సాహాన్ని ఆపుకోలేరు. ఇటువంటి ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం అతడి వయసు 37 సంవత్సరాలు. అయినప్పటికీ పాతికేళ్ల కుర్రాడి మాదిరిగానే ఉంటాడు. ఆవేశాన్ని అస్సలు ఆపుకోలేడు. ఆగ్రహాన్ని అస్సలు చల్లార్చుకోలేడు.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అమాంతం ఎగిరి గంతులు వేశాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ యజమాని అనంత్ అంబానీ ముందు చిందులు వేశాడు. దీంతో అనంత్ అంబానీ చిన్నబోయాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు రసిక్ సలాం చివరి బంతికి రెండు పరుగులు తీసి ముంబై విజయాన్ని ఖరారు చేశాడు. విరాట్ కోహ్లీ ఎగిరి గంతులు వేస్తున్న నేపథ్యంలో ముంబై ఆటగాడు రికెల్టన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతిని నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ రుచిపచిలేని చూయింగ్ గమ్ తినుకుంటూ.. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేశాడు.

రేపు తాడేపల్లి కి జగన్.. రెండు కీలక నిర్ణయాలు

YS Jagan Mohan Reddy Mavigan
YS Jagan Mohan Reddy Mavigan

Jagan Mohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా అక్కడే గడిపారు. కోర్టు అనుమతి గడువు తీయడంతో ఆయన తిరిగి దేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. రేపు తాడేపల్లి కి రానున్నారు. ఈ నెల చివర్లో నెల్లూరు జిల్లాలో టిడిపి మహానాడు జరగనుంది. నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. రాజకీయంగా కూటమి పట్టు బిగించే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు వైసిపి కీలక నేతలతో మంతనాలు జరపనున్నారు. కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సమాచారం అందింది. రేపు తాడేపల్లి కి జగన్ వచ్చిన వెంటనే ఈ సమావేశం మొదలవుతుంది.

* ప్లీనరీ నిర్వహణపై..
తెలుగుదేశం పార్టీ మహానాడు మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కచ్చితంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ వచ్చే ఏడాది పాదయాత్ర ముంగిట.. ప్లీనరీ నిర్వహిద్దామని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.. అయితే పాదయాత్ర ముందు సమయం ఉండదని.. అందుకే ఇప్పుడే నిర్వహించుకోవడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. రేపు జరిగే సమావేశంలో ప్లీనరీపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

* జనంలోకి వెళ్లేందుకు..
మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటనలు ఉంటాయని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. దానిపై కూడా రేపు తాడేపల్లిలో నేతలతో చర్చిస్తారు జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు రోజులు సమయం కేటాయిస్తారని.. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది వరకు నేతలతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి చాలా రోజులుగా ప్రచారం నడుస్తూ వచ్చింది. గత సంక్రాంతి తర్వాత అన్నారు. ఈ సంక్రాంతి దాటిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యకు వచ్చింది లేదు. అయితే జనంలోకి వెళ్తే కానీ ప్రజలు హర్షించారని.. కచ్చితంగా జనం మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రస్తావించాలని సీనియర్లు కోరుతున్నారు. అందుకే రేపు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రెండు అంశాలపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీ శ్రేణుల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు.

పక్క రాష్ట్రం విజయంలో ఓదార్పు వెతుక్కుంటున్న జగన్

YS Jagan temple visit controversy
YS Jagan temple visit controversy

YS Jagan Mohan Reddy : ప్రతిపక్షంలో ఉన్నవారు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి ఎదురైతే ఎక్కడ లోపం జరిగిందో గుర్తించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. ఎంతవరకు ప్రత్యర్థి పార్టీలపై ఏడుపు తప్ప.. పార్టీ పూర్వ వైభవం తీసుకురా ఎలా అడుగులు వేయాలి అనే దానిపై ఆ పార్టీ దృష్టి పెట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది. కానీ పక్క పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. తమిళనాడులో విజయ్ గెలిస్తే.. ఏపీలో పవన్ ఓటమి అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకునే స్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. విజయ్ ను చూసి పవన్ నేర్చుకోవాలని సూచిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అదే విజయ్ ను చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. విజయ్ తన పార్టీని నడిపిస్తున్న తీరుతోనైనా జగన్ కు కనువిప్పు కలగాలి. కానీ అలా చేయకుండా విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఎద్దేవా చేయడం చూస్తుంటే ఎంత దిగజారుడో అర్థం అవుతోంది.

* చిన్న పార్టీలతో కలిసి..
విజయ్ మెజారిటీకి కూతవేటు దూరంలో నిలిచిపోయారు. కానీ చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ఇప్పుడు అధికారం చేపట్టారు. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసేవారు అంటే.. ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ కూడా ఆయన వెంట అడుగులు వేయదు అనేది విశ్లేషకుల వాదన. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజకీయ పార్టీని కూడా గౌరవించలేదు. ప్రజా సంఘాలను సైతం తరిమేశారు. పైగా సింహం సింగిల్ అంటూ పెద్దపెద్ద మాటలు అన్నారు. అందుకే ఆ పార్టీకి వేరే ఆప్షన్ ఉండేది కాదు. 2029 ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్క పార్టీ చూసే పరిస్థితి లేదు.

* పదేళ్ల పాటు ఓపికగా పోరాడి
2024 ఎన్నికల్లో పవన్ గెలిచిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తనపై గెలిచిన పవన్ ను చూసి నేర్చుకోవాల్సిన జగన్.. పక్క రాష్ట్రంలో విజయ్ ను అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం వ్యక్తిగత ద్వేషం కిందకి వస్తుంది. పక్క పార్టీల విజయాలలో ఓదార్పు వెతుక్కుంటున్నారు జగన్. పవన్ పదేళ్లపాటు ఓపిక పడ్డారు. ప్రజలు తనను ఓడించిన వారిపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పదేళ్లపాటు పోరాడి జీరో నుంచి హీరో అయ్యారు ఆయన . కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారాన్ని పోగొట్టుకొని.. ఇప్పుడు అడ్రస్ వెతుక్కునే పనిలో ఉన్నారు. విజయ్ సాధించిన విజయం ఆయన టీం వర్క్. పవన్ సాధించిన విజయం ఆయన నిబద్ధత. ఆ రెండింటినీ మరిచి.. తాము ఒక ప్రతిపక్ష నాయకుడిని అని మరిచి జగన్ వ్యవహరిస్తున్నారు. అంతిమంగా అది ఆ పార్టీకి నష్టమే.

అమరావతి పై పెరుగుతున్న ప్రచారం

Amaravati development updates
Amaravati development updates

Amaravati development updates: అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. ఒక రూపం తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓటమి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అమరావతిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ వ్యూహానికి తగ్గట్టు పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలోనే అమరావతిపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం అమరావతిపై చర్చ జరుగుతోంది. దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో జాతీయస్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతోంది అమరావతిపై.

అమరావతి చుట్టూ అనుకూల కథనాలు
అమరావతి నిర్మాణంలో సాంకేతిక అంశాలను జోడిస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా గ్రిడ్ తరహా డిజైన్, కృష్ణానది తీరాన అభివృద్ధి చెందుతున్న జోనల్ సిస్టం ఇప్పుడు ప్రచారంలోకి వస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రాజన్ సింగ్ అమరావతి పనులపై రూపొందించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. కేవలం సంక్షేమ పథకాలు కాదు.. శాశ్వతమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యతను అమరావతి నిరూపిస్తోందని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల క్యాంపస్లు అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.

ఎండలను సైతం లెక్క చేయకుండా..
ప్రస్తుతం ఎండలకు తీవ్రత అధికంగా ఉంది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ఎండల్లో సైతం అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఎండలను కూడా లెక్క చేయకుండా జాతీయస్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అక్కడ జరుగుతున్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనను రికార్డ్ చేస్తున్నారు. అత్యాధునిక రవాణా సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పక్కాగా విభజించిన నివాస, వాణిజ్య జోన్లను చూసి ఇండియాలోనే అద్భుత నగరం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే తరాలకు ఒక ఆదర్శప్రాయమైన మాడల్ అవుతుందని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. తద్వారా అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేటు సంస్థలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

లోకేష్ లో మోడీకి నచ్చింది అదే!

Modi impressed with Lokesh
Modi impressed with Lokesh

Modi impressed with Lokesh: వారసత్వం అనేది కేవలం పరిచయం చేసేందుకు మాత్రమే అక్కరకు వస్తుంది. వారసులు తమకు తాము ప్రూవ్ చేసుకోకపోతే రాణించలేరు కూడా. అయితే ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల నడుమ రాజకీయ వారసుడిగా వచ్చిన లోకేష్ చాలా ఇబ్బందులు పడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. కానీ అదే లోకేష్ ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కీర్తించబడుతున్నారు. అది చిన్న విషయం కాదు.. రాజకీయాల కోసమో.. రాజకీయ మద్దతు కోసమో.. ప్రధాని నరేంద్ర మోడీ ఏ నేతను కూడా ప్రశంసించరు. ఆయన ప్రశంసించారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా అనుకూలంగా ఉన్నారు. రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

గంటన్నరకు పైగా..
హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నర పాటు గడిపారు. ప్రధాని ఎక్కువగా లోకేష్ తో సమకాలిన రాజకీయాలు, ప్రపంచ పరిణామాలు, మారుతున్న యువత ఆలోచన ధోరణి పై సుదీర్ఘంగా చర్చించడం.. వారి మధ్య బలమైన అనుబంధానికి నిదర్శనం. లోకేష్ ను అభినందించడం ప్రధానికి కొత్త కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనను ప్రశంసిస్తూనే ఉన్నారు. అందుకే ఆ కుటుంబానికి ప్రత్యేక విందు ఆహ్వానం కూడా పలికారు అప్పట్లో. అందుకే లోకేష్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో విందు భేటీ జరిగింది. లోకేష్ పనితీరులో ప్రధాని మోదీని ఆకట్టుకున్నది ఆయన పనితనం. కేవలం ప్రణాళికలు రచించడం కాదు.. వాటిని 100% విజయవంతంగా అమలు చేసే తీరు ఆకట్టుకుంటూ వస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఏర్పాట్లను చూసి ప్రధాని ఫిదా అయ్యారు. దానిపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయించి సహచర క్యాబినెట్ మంత్రులకు ప్రధాని ఇచ్చారంటే లోకేష్ విషయంలో ఎంతలా ఆసక్తిగా ఉన్నారు అర్థం అవుతోంది.

ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానం..
ప్రధానిని కలవాలంటే చాలా రకాల తతంగం ఉంటుంది. అటువంటిది లోకేష్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు రెండు గంటలకు పైగా సమయాన్ని కేటాయించారు. లోకేష్ మిత్రపక్ష నేత కావచ్చు కానీ.. దేశంలో చాలామంది యువ నేతలు మిత్రపక్ష పార్టీలకు చెందినవారు. కానీ ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యం లోకేష్ కు దక్కుతోంది ప్రధాని నరేంద్ర మోడీ వద్ద. యువ నేతలతో ఉండాల్సిన అసలైన రాజకీయ పరిణితి లోకేష్ లో ఉందన్న విషయాన్ని గ్రహించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోకేష్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచన నరేంద్ర మోడీ చేసిన ఆశ్చర్యపడనవసరం లేదు.

మాతో కలువు.. డెవలప్ చేద్దాం.. రేవంత్ కు మోడీ ఆఫర్ వెనుక.. ఇంత ఉందా..

Modi offer to Revanth Reddy
Modi offer to Revanth Reddy

Modi offer to Revanth Reddy: రాజకీయాలలో ఏమైనా జరుగుతాయి.. ఎంతైనా జరుగుతాయి. కాకపోతే అది జరిగే సందర్భం ద్వారానే ఫలితం ఆధారపడి ఉంటుంది.. ఉదాహరణకు అస్సాం రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న హిమంతా.. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. రాహుల్ గాంధీ వల్ల బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏకంగా బిజెపిలో కీలక నాయకుడిగా ఉన్నాడు. అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుంటే.. సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్నాడు. మమత బెనర్జీ ఏకపక్ష పోకడలను తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బిజెపి లో కీలక నాయకుడిగా ఎదిగాడు.

ఇవన్నీ చూస్తుంటే ఏదో సాధారణంగా జరిగిన ప్రక్రియల మాదిరిగా అనిపించవచ్చు. హిమంత, సువేందు సాధారణ నాయకులు దర్శనమియ వచ్చు. కానీ, వీరిద్దరిని పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా పని చేసింది మాత్రం నరేంద్ర మోడీ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అమిత్ షా చెప్పడం.. నరేంద్ర మోడీ క్యాప్చర్ చేయడం.. పార్టీలోకి తీసుకురావడం.. ఆ తర్వాత పార్టీ అవసరాలకు అనుగుణంగా వారిని మర్చిపోవడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి.

ఇప్పుడు ఈ వంతు తెలంగాణకు వచ్చిందా.. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ ప్రధానమంత్రి ఆదివారం నాటి తెలంగాణ పర్యటనలో మాత్రం అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈసారి రేవంత్ రెడ్డి మీద ఆయన అంతగా విమర్శలు చేయలేదు. మాతో రండి.. కలిసి పనిచేద్దామని ఆఫర్ ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటీవల స్థాయిలో ఎన్నడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నరేంద్ర మోడీ ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే.. దాని వెనుక ఏదో జరిగి ఉంటుందని చర్చ నడుస్తుంది. నిజానికి చర్చకు ఆస్కారం ఇచ్చింది నరేంద్ర మోడీ.. ప్రధానమంత్రి ఆఫర్ ను అటు తిరస్కరించలేక.. ఇటు అవునన లేక ఇబ్బంది పడింది రేవంత్ రెడ్డి.. కాకపోతే రేవంత్ రెడ్డి బిజెపిలోకి వస్తారా.. అది సాధ్యమవుతుందా.. రాహుల్ గాంధీ అంత సులభంగా రేవంత్ రెడ్డిని వదులుకుంటారా.. అనే ప్రశ్నలు వ్యక్తం కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలమైన పునాదులు నిర్మించుకున్నారు. పెద్దపెద్ద వ్యక్తులు ఉదాహరణకు కేసి వేణుగోపాల్, ఆమధ్య ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసిన అభ్యర్థి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఆయనకు మూల స్తంభాలుగా ఉన్నారు.

ఊకూకేనే రాలేదు రా బిడ్డ కూకున్న సీటు.. అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఓ పాటను అప్పట్లో రూపొందించారు. ఆ పాటకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ నిర్మించుకున్నారు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి అంత సులభంగా బయటికి వచ్చే అవకాశం లేదు. నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన బిజెపిలో చేరే ఆస్కారం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏ స్థాయిలో అయితే రాజకీయ లెక్కలు ఉన్నాయో.. రేవంత్ రెడ్డికి కూడా అటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి.

ప్లేట్ పాస్తా 8,500.. సల్మాన్ ఖాన్ సోదరి రెస్టారెంట్ లో అంతే మరి..

8500 rupees pasta viral news
8500 rupees pasta viral news

8500 rupees pasta viral news: ప్లేట్ పాస్తా ఎంత ఉంటుంది.. మహా అయితే 100.. ఒకవేళ ఖరీదైన రెస్టారెంట్ అయితే 250 కి మించదు. కానీ ప్లేట్ పాస్తా ₹8,500.. అదేంటి అదేమైనా బంగారంతో చేశారా.. వెండి కోటింగ్ ఏమైనా ఇచ్చారా.. అని అనుకోకండి. ప్లేట్ పాస్తాకు నిజంగానే అంత ఛార్జ్ చేశారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి ఆర్పిత ఖాన్ ముంబైలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ మీద రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. విభిన్నమైన వీడియోలు సర్కులేట్ అవుతూనే ఉంటాయి. ఆర్పిత ఖాన్ ఏర్పాటుచేసిన రెస్టారెంట్లో రేట్లు విపరీతంగా ఉంటాయని రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెస్టారెంట్ లో క్రౌడ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో వ్యాపారం సాగుతోంది.

అర్పిత హోటల్లో ఇటీవల ఒక వ్యక్తి పాస్తా ఆర్డర్ చేశాడు. ఆస్వాదించుకుంటూ తిన్నాడు. బిల్లు చూసేసరికి గుండెలు బాదుకున్నాడు. మహా అయితే 300 కు మించి ఖరీదు చేయని పాస్తా కు ఏకంగా 8,500 బిల్లు వేశారు. దీంతో అతడు కళ్ళు పిండుకుంటూ ఆ బిల్లు కట్టాడు.. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.. పాస్తాకు అంత ఖరీదా అంటూ నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు రెస్టారెంట్లకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందువల్ల చాలామంది ఆ ధరలను తట్టుకోలేక అక్కడికి వెళ్లలేరు. కేవలం బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ రెస్టారెంట్లకు వెళుతుంటారు. అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళకు కూడా ఆ ధరలు చూసి భయం మొదలవుతుంది. ఈ పాస్తా తిన్న వ్యక్తి కూడా అటువంటివాడే. 350 రూపాయలతో పోయేదాన్ని.. 8500 పెట్టి తిన్నాడు. చివరికి ఇదిగో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తనకు జరిగిన క్షవరం గురించి చెప్పుకున్నాడు. ఎంతైనా సెలబ్రిటీల రెస్టారెంట్ల వేరు. అదే కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టడానికి..

తెలుగోడు ఆ క్యాచ్ పట్టి ఉంటే.. ముంబై బతికి బట్ట కట్టేది..

Tilak Varma dropped catch
Tilak Varma dropped catch

Tilak Varma dropped catch: ఐపీఎల్ లో ప్రతి పరుగు అత్యంత విలువైనది. ప్రతి వికెట్ అంతకంటే ఎక్కువ విలువైనది. అందువల్లే ప్రతిక్షణం ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఐపీఎల్ లో ముంబై జట్టుకు వచ్చింది.

ఐపీఎల్ పేరు ప్రస్తావన వస్తే ముంబై జట్టు గురించి అభిమానులు గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే ముంబై జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీలను అందుకుంది. అంతేకాదు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త ఘనతను తన పేరు మీద రాసుకుంది. ముంబై జట్టు అంతటి స్థాయి ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో సరిగ్గా ఆడలేక పోతోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేస్తోంది.

ముంబై ఇండియన్స్ జట్టు దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే అతడి సారధ్యంలో ముంబై జట్టు 2024లో చివరి స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు కూడా గ్రూప్ దశ నుంచి వెళ్లిపోతోంది. గత ఏడాది నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన సందర్భంలో ముంబై జట్టు ఓడిపోయింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్ కావడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు.

బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఎలిమినేట్ కావడం పట్ల అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రారంభంలో వికెట్లు పడగొట్టినప్పటికీ.. బెంగళూరు ఆటగాడు కృణాల్ పాండ్యా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన క్రమంలో పాండ్యా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ వద్ద నమన్ బంతిని అందుకున్నాడు. తిలక్ వర్మ వైపు విసిరేశాడు. ఆ బంతిని తిలక్ అందుకోలేకపోయాడు. తర్వాత పాండ్యా 2 భారీ సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. తెలుగోడైన తిలక్ వర్మ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. చివరికి కృణాల్ పాండ్యా తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తోనే అవుట్ అయ్యాడు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మత కల్లోలాల వెనుక రాజకీయం.. హాపూర నుంచి కడప వరకు ఒకే నిజం

Hapur to Kadapa communal issues
Hapur to Kadapa communal issues

Politics behind Religious Riots: దేశవ్యాప్తంగా ఒకే రకమైన చిత్రం కనిపిస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడప వరకు, మత కల్లోలాల వెనుక దాగి ఉంది ఒక వ్యూహాత్మక రాజకీయం. ఇది కేవలం సంఘటనల పాట కాదు, దేశ సమగ్రతపై చేయబడే దాడి.

మత కల్లోలాల వ్యూహం
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రాణాప్రతాప్‌ జయంతి సందర్భంగా అల్లర్లు, ఆంధ్రప్రదేశ్‌లో టిప్పు సుల్తాన్‌ జయంతి పేరుతో పార్టీల పోటీ పడుతున్నాయి. కశ్మీర్, మణిపూర్‌లలో అల్లర్లు పెద్ద ప్రాధాన్యత పొందకపోవడం వల్ల, రాజకీయ నేతలు ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలపై దృష్టి సారించారు. ఉద్రిక్తతలను పెంచేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు, మరియు ఒక వర్గం ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది. హాపూర్‌లో ధౌలానా ఏరియాలో రాణాప్రతాప్‌ జయంతి ర్యాలీని భగ్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. అక్బర్‌ సైనికాధికారితో యుద్ధం చేసిన రాణాప్రతాప్‌ జయంతిని కొందరు వ్యతిరేకించారు. యోగి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవడం గమనించదగినది – రాళ్లు రువ్వినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ టిప్పు సుల్తాన్‌ జయంతి విషయమై పోటీ పడుతున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్‌ సర్కిల్‌ ఏర్పాటు చేశాడు, కడపలో గత వైసీపీ మేయర్‌ టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తానని వాగ్దానం చేశారు.

ముస్లిం ఓట్ల కోసమే..
అల్మాస్‌గూడ ఏరియాకు టిప్పు సర్కిల్‌ అని పేరుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, హిందువులు దానిని హనుమాన్‌ సర్కిల్‌గా మార్చారు. దీంతో ముస్లింలు రోడ్లపైకి వచ్చి దాడి చేశారు, పోలీసులు గాయపడ్డారు, లాఠీచార్జి జరిగింది. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, శాంతి కమిటీ మీటింగ్‌లో గొడవ ఆపే ప్రయత్నం చేశారు, కానీ సమస్య పరిష్కరించలేదు.

హిందువుల్లో అసంతృప్తిని గుర్తించని నేతలు..
గుంటూరులో మహ్మద్‌ జిన్నా టవర్‌ విషంలో గొడవ జరిగింది. హిందువులు ఆగ్రహించడంతో టవర్‌కు జాతీయ జెండా రంగులు వేశారు. జాతీయ జెండా ఎగురవేయడం మొదలైంది. హిందువులు తలుచుకుంటే ఇలా మార్పు వస్తుంది. ఇది కేవలం మాట కాదు, నిజం. కానీ ప్రశ్న ఎక్కువ ముఖ్యమైనది: హిందువుల్లో పెరుగుతున్న అసంతృప్తి, కోపాన్ని రాజకీయ నేతలు గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవు.

గుణపాటం నేర్చుకోవాల్సిన సమయం
టీడీపీ, వైసీపీ బెంగాల్‌ అస్సాంల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాల్లో మత కల్లోలాల ఫలితాలు ఏమిటో చరిత్ర చెబుతోంది. మత రాజకీయాల్లో లాభం లేదు, కేవలం దేశ విభజనే ఉంది.

మత కల్లోలాల వెనుక ఉన్నది కేవలం ముస్లిం ఓట్ల కోసం రాజకీయం మాత్రమే. ఇది నైతికంగా తప్పు, దేశసమగ్రతకు హానికరం. హిందువుల అసంతప్తిని గుర్తించి, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి. జాతీయత్వం ముఖ్యం, మతం కాదు.

సుకుమార్ మూవీ లో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడా..

Ram Charan
Ram Charan

Ram Charan farmer role in Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఆయన నుంచి రాబోయే సినిమాల విషయంలో సైతం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రామ్ చరణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే సుకుమార్ తో చేయబోయే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే రంగస్థలం సినిమా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ కాంబినేషన్ కి అయితే మంచి క్రేజ్ దక్కింది. ఇక వీళ్ళిద్దరు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారు. ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సుకుమార్ తో చేయబోయే సినిమాలో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడట. రంగస్థలం సినిమాలో ఆల్మోస్ట్ పల్లెటూరు పాత్రను పోషించిన ఆయన ఈ సినిమాలో సైతం అలాంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడట.

చిట్టిబాబు క్యారెక్టర్ ఎంత పాపులారిటిని క్రియేట్ చేసుకుందో ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్ సైతం అదే రేంజ్ ఇంపాక్ట్ ను ఇవ్వబోతుందట. సుకుమార్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పర్చదనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు.

కాబట్టి ఈ సినిమా కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు…ఈ సినిమా విషయానికి వస్తే సుకుమార్ ఈ సినిమా విషయంలో కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడట. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో ఈ ప్రాజెక్టును సెట్ చేసింది కూడా సుకుమార్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

 

ప్రధాని మోదీ 'గ్రేట్'ర్ ఆలోచన!

Modi Latest Speech
Modi Latest Speech

PM Modi greater vision: తెలంగాణలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరిగింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో సైతం సన్నిహితంగా మెలిగారు ప్రధాని. ఒక విధంగా చెప్పాలంటే పక్క పొలిటికల్ వ్యూహంతోనే సాగింది నరేంద్ర మోడీ పర్యటన. అయితే మరోవైపు హైదరాబాదులో ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో గడిపారు మోదీ. అయితే దీని వెనుక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలను గమనిస్తే ఒక వ్యూహం ప్రకారమే సాగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో కూడా ప్రధాని ఆలోచన అదేనని ఒక టాక్ నడుస్తోంది.

గ్రేటర్ ఎన్నికలు త్వరలో..
మరి కొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ వీటిని ఒక సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ మంచి ఫలితాలు సాధించింది.. అందుకే ఈసారి మేయర్ పీఠం సాధించడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టు సంకేతాలు పంపాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి.. టిడిపి తో పాటు జనసేన మద్దతును పరోక్షంగా పొందినట్టు అర్థం అవుతోంది.

టిడిపికి బలమైన క్యాడర్..
గ్రేటర్ పరిధిలో టిడిపికి క్యాడర్ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. ఆ రెండింటిని తిప్పుకుంటే బీజేపీకి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కువ. ఏపీలో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉండడంతో సెటిలర్స్ తప్పకుండా బిజెపి వైపు మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలను కలవడం ద్వారా సరికొత్త సంకేతాలను పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండిపోయింది. అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందని విశ్లేషణలు ఉన్నాయి. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల పరిధిలో టిడిపి ఓటు బ్యాంకును బిజెపి వైపు మళ్లించగలిగితే.. భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఇంటికి వెళ్లిన మోడీ గంటా పది నిమిషాల పాటు ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు.

పవన్ ఇమేజ్..
పవన్ కళ్యాణ్ బిజెపికి సానుకూలంగా ఉంటారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పోటీ చేశారు కొన్నిచోట్ల. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ కంటే గ్రేటర్ పరిధిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శ పేరుతో పవన్ ఇంటికి వెళ్లారు అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి అయితే ప్రధాని టూర్ వెనుక గట్టి వ్యూహమే ఉన్నట్టు స్పష్టమైంది.