Neha Narkhede: భారత దేశంలోనే పుట్టి పెరిగిన ఓ మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. అహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకువచ్చింది. యూఎస్లో అతి పిన్న వయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా ఫోర్బ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఆమే భారత సంతతికి చెందిన నేహా నార్టేడే.
పూణేలో పుట్టి..
భారత్కు చెందిన నేహా నార్టేడే పుట్టి పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. యూఎస్లోని జార్జియా టెక్లో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి అక్కడే కాన్పూయెంట్ అనే కంపెనీని స్థాపించింది.
ఒడిదుడుకులు ఎదురైనా..
కంపెనీ ప్రారంభించిన తొలి నాళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు నేహ. అన్నింటినీ అధిగమిస్తూ అనతికాలంలోనే రూ.75 వేల కోట్ల టర్నోవర్తో దూసుకెళ్లడం ప్రారంభించింది. అలా అత్యంత పిన్న వయస్కురాలు అయిన నేహ పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో 8వ అత్యంత సంపన్న మహిళగా నిలిచింది.
ప్రముఖుల గురించి చదవి..
తాను చిన్నతనంలో ఇందిరాగాంధీ, కిరణ్బేడి, ఇంద్రానూయీ వంటి ప్రముఖ మహిళల గురించి చదవడం వల్ల ఈ విజయం సాధ్యమైందని, వ్యాపారరంగంలో రాణిస్తున్నానని చెబుతోంది నేహ. ఆమె కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాత 2021లో రూ.13 వేల కోట్లకు సంపద పెరిగింది. అనూహ్యంగా 2022లో పడిపోయింది. సుమారు రూ.8 వేల కోట్ల నష్టాలను చవిచూసింది. అయినా కష్టపడి కంపెనీని మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ.75 వేల కోట్లు. అంతేకాదు 2023, మార్చిలో నార్టెడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కీలార్ అనే కొత్త కంపెనీని కూడా స్థాపించింది. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహ చోటు దక్కించుకోవడం విశేషం.