spot_img
HomeNewsKrishna Express: ఇది రైలు బండి కాదు.. ఎడ్లబండి.. రికార్డు సృష్టించిన 50 ఏళ్ల ‘కృష్ణా...

Krishna Express: ఇది రైలు బండి కాదు.. ఎడ్లబండి.. రికార్డు సృష్టించిన 50 ఏళ్ల ‘కృష్ణా ఎక్స్ ప్రెస్’ కథ*

Krishna Express: భారతీయ రైల్వే వ్యవస్థం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవప్థలో ఐదో స్థానంలో ఉంది. దశాబ్దాలుగా మన దేశంలో పట్టాలపై రైళ్లు పరిగెత్తుతున్నాయి. బ్రిటిష్‌వారు తమ వ్యాపారం కోసం 1860లోనే రైల్వే లైన్‌ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఇండియన్‌ రైల్వే వ్యస్థం ప్రపంచంలో ఐదో స్థానానికి ఎదిగింది. ఇక ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలోనూ ఏటేటా తన రికార్డులు బద్దలు కొడుతోంది. పేదల నుంచి సంపన్నల వరకు సురక్షితమైన జర్నీని అందించే భారతీయ రైల్వే వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. దక్షిణ మధ్య రైల్వే ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడుపుతున్న క్రిష్ణా ఎక్స్‌ప్రెస్‌ గుచించి తెలియని తెలుగువారుండరు. ఎందుకంటే.. రైలు ఎక్కడం వరకే మన పని గమ్యస్థానానికి చేర్చడం మన చేతుల్లో ఉండదు. భగవంతుడిమీద భారం వేసి ప్రయాణం సాగించాల్సిందే ఇంతవరకు ఈ రైలు షెడ్యూల్‌ను సమయపాలన ప్రకారం నడపాలనే ఆలోచన అధికారులకు కలుగలేదు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే అలా చిన్నచూపు చూసింది.

ఐదు దశాబ్దాల చరిత్ర..
ఇక కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. 1974, అక్టోబర్‌ 2వ తేదీన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. డీజిల్‌ ఇంజిన్‌తో మొదట సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు నడిపారు. రెండుతెలుగు రాస్ట్రాలకు కృష్ణా నది వారధిగా ఉండడంతో ఈ రైలుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టారు. ఈ రైలు ప్రారంభంలో ఉదయం వేళ మాత్రమే నడిచేది. క్రమంగా ఈ రైలు గంటూరు వరకు పొడిగించారు. తర్వాత తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట ఇలా తిరుపతి వరకు నడుపుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మీదుగా ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడుస్తోంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 17405, 17406 నంబర్లతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రయాణికులు .

సూపర్‌ఫాస్ట్‌గా నడపాలని..
సరస్వతీదేవి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ రైలునే ఆశ్రయిస్తారు. అలాగే తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి ఈ రైలులోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. కాలక్రమంలో అనేక రైళ్లు వచ్చాయి. కానీ ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు తక్కువ బడెజట్‌లో ప్రయాణానికి వీలుండే రైలు మాత్రం కృష్ణా ఎక్‌ప్రెస్‌ మాత్రమే. ఎక్కువగా పగటివేళ నడుస్తుంది. ఈ రైలును సూపర్‌ఫాస్ట్‌ రైలుగా నడపాలని ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper