farmer bill
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై పలు రాష్ట్రాల్లో నిరనసలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలు రైతు సంఘాలతో కలిసి కర్ణాటకలో రాష్ట్ర బంద్ చేపడుతుండగా ఢిల్లీలో మాత్రం నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. సోమవారం ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్కు నిప్పు పెట్టారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మధ్య డిల్లీ ప్రాంతంలో కొంతమంది గూమిగూడి ట్రాక్టర్కు నిప్పుపెట్టినట్లు స్థానిక డీసీపీ తెలిపారు. వ్యవసాయ బిల్లుపై పంజాబ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా ఆ తరువాత హర్యానా, కర్ణాటకల్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి.