karna
ఈరోజు బంద్ తో రైతులంతా బెంగళూరు నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్ ముందు సోమవారం ఉదయం నిరసన పెద్దఎత్తున తెలిపారు. అన్ని సంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కర్ణాటక రైతులు భారీగా రోడ్లపైకి వచ్చి చేస్తున్న ఈ ఆందోళనతో రాష్ట్రమంతా అట్టుడుకుతోంది.
కాగా బెంగళూరుతోపాటు రాష్ట్రమంతటా బంద్, రైతుల నిరసనలతో రైతులు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం రైతుల ఆందోళనకు మద్దతుగా ముందుండి ఈ బంద్ ను విజయవంతం చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక బిల్లులను పాస్ చేయించాయని నిరసిస్తూ సోమవారం బెంగళూరు నగరంతో సహా కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో రైతన్నలు ఆందోళనకు దిగారు. ఈ బిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అన్నదాతలు కర్ణాటకలో చేస్తున్న ఈ బంద్ కు మొత్తం 108 సంఘాలు, సంస్థలు మద్దతు తెలుపడంతో భారీ ఆందోళనగా మారింది. కరోనా టైంలో ఇంత పెద్ద ఆందోళన దేశంలో ఇదే ప్రథమం కావడం గమనార్హం.