ఆన్లాక్ 5.0. మార్గదర్శకాలతో స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకెళ్తోంది. సెన్సెక్స్ 401.27 పాయింట్లు లాభపడి 38,469.20 వద్ద, నిఫ్టి 109.20తో 11,356.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత 600 పాయింట్ల లాభాల్లోకి సెన్సెక్స్ దూసుకెళ్లింది. పెట్టుబడిదారుల సెంటిమెంటుకు తోడు ప్రభుత్వం ఆన్లాక్ 5.0. మార్గదర్శకాలు లాభాలకు కారణమని తెలుస్తోంది. కరోనా రికవరీ రేటు పెరుగుతుండడం ఇన్వెస్టర్లకు కలిసొచ్చింది. ఇండస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ లాభాల బాట పడుతున్న కంపెనీల్లో ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సైతం లాభాల్లో ఉండడం ఈరోజు శుభదినమేనందున్నారు ముదుపరులు.
Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?