ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు కేఎస్ రాహుల్ షాకిచ్చాడు. ఇప్పటికే అతని ఎడమ చేతి మణికట్టు గాయంతో ఇప్పటి వరకు జరిగిన టెస్టులకు దూరమయ్యారు. ఇక మూడోటెస్టుకు కూడా కేఎస్ రాహుల్ ఆడే అవకాశం లేదని బీసీసీఐ ప్రకటించింది. రాహుల్ కోలుకునేందుకు మూడు వారాల సమయం పడుతుందని ప్రకటించింది. దీంతో స్టార్ బ్యాట్ మెన్ కొరత టీమిండియాలో ఏర్పడింది. కాగా ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా సభ్యలు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారన్న వార్తలు రావడంతో కరోనా టెస్టులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు సాగనుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ 1-1తో సమం చేసింది. దీంతో మూడో టెస్టుపై భారీ ఆశలు నెలకొన్నాయి.