తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీతో సహా ఎవరూ తన మాట వినలేదని, ఒకవేళ తన మాట వింటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకునేవాడినని మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’లో రాసుకున్నారు. అంతేకాకుండా పలు సంచలన విషయాలను అందులో పేర్కొన్నారు. మహారాష్ట్ర విషయంలోనూ సోనియా తప్పుడు నేతలపై ఆధారపడ్డారన్నారు. సోనియా తీసుకున్న పలు నిర్ణయాలు పార్టీ పటిష్టతకు దెబ్బతీసిందన్నారు. 2014లో లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. పార్టీలో నెహ్రు వంటి నేతలు కరువయ్యారని, ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఆవేదన ఉండేదన్నారు.