కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కేంద్ర మంత్రులు రైతు సంఘాలతో పలుమార్లు సమావేశమయ్యారు. అయితే అవి కొలిక్కి రాకపోవడంతో ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులతో ప్రధాని భేటి అయ్యారు. రైతుల డిమాండ్లు, పరిష్కార మార్గంపై చర్చిస్తున్నారు. కాగా రైతులు మాత్రం వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంతవరకు ఏ ప్రదిపాదన ఇచ్చినా ఆందోళన విరమించమని తెలిపారు.అయితే ప్రధాన మోడీ మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.