బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కంపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తరువాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. 9 గంటల వరకు లెక్కింపులో ఆర్జేడీ కూటమి దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. 70కి పైగా స్థనాల్లో తేజస్వి యాదవ్ ముందున్నారు. ఎన్డీయే కూటమి 50 స్థానాల్లో లీడ్ ఉండగా, ఎల్జేపీ 2, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా ఎగ్జిట్ పోల్ష్ ప్రకారమే ఫలితాలు రావడంతో ఆర్జేడీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.